విద్యాశాఖ మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష.. భార్యకు భారీ జరిమానా

తమిళనాడు డీఎంకే పార్టీ నేత, విద్యాశాఖ మంత్రి కె. పొన్ముడికి మద్రాసు కోర్టు షాక్ ఇచ్చింది. 1996-2001లో డీఎంకేలో మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి చేసినట్లు రుజువు కావడంతో మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఆయన భార్యకు రూ. 50 లక్షల జరిమానా విధించింది.

New Update
విద్యాశాఖ మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష.. భార్యకు భారీ జరిమానా

తమిళనాడు డీఎంకే పార్టీ నేత, విద్యాశాఖ మంత్రి కె. పొన్ముడి కొంతకాలంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా పొన్ముడి ఫ్యామిలీకి మద్రాసు కోర్టు షాక్ ఇచ్చింది. అవినీతి చేసినట్లు రుజువు కావడంతో మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాదు ఈ కేసులో ఆయన భార్య, వారసులకు భారీ జరిమానా వేసింది.

ఈ మేరకు పొన్ముడి 1996-2001లో డీఎంకేలో మంత్రిగా ఉన్నప్పుడు అక్రమాస్తులకు పాల్పడ్డాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. రూ.1.75 కోట్ల వరకు అక్రమాస్తులు కూడబెట్టినట్లు పొన్ముడి, ఆయన భార్యపై డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ (DVAC) అధికారులు 2002లో కేసు నమోదు చేశారు. అయితే తాజాగా ఈ కేసులో సాక్ష్యాధారాలు సమర్పించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమయ్యాడు. దీంతో జూన్‌ 28న వెల్లూరులోని ప్రిన్సిపల్‌ సెషన్స్‌ కోర్టు పొన్ముడి, అతని భార్య పీ విశాలాక్షిని నిర్దోషులుగా ప్రకటించింది. అలాగే ఆగస్టు నెలలో ఈ కేసును మద్రాసు హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే డిసెంబర్‌ 19న ఈ కేసును విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు.. పొన్ముడిని నిర్దోషిగా దిగువ కోర్టు ఇచ్చిన తీర్పు తోసిపుచ్చి గురువారం కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది.

ఇది కూడా చదవండి : పబ్లిక్ ఫిగర్ నే కానీ ఎవరూ ప్రేమించలేదు.. వెక్కి వెక్కి ఏడ్చాను

ఈ క్రమంలో నేడు విచారణ చేపట్టిన హైకోర్టు ఈ కేసులో మంత్రి దంపతులను దోషులుగా పేర్కొంటూ తీర్పు ఇచ్చింది. అవినీతి నిరోధక చట్టంకింద మంత్రి దంపతులను దోషులుగా తేల్చింది. మంత్రికి మూడేళ్లు సాధారణ జైలు శిక్షతోపాటు ఆయన భార్యకు ఒక్కొక్కరికి రూ.50 లక్షలు చొప్పున జరిమానా విధించింది. అయితే శిక్షను తగ్గించాలని పొన్ముడి, ఆయన భార్య కోర్టుకు మెడికల్ రికార్డు సమర్పించగా.. శిక్షను పైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు న్యాయస్థానం 30 రోజుల గడువు ఇచ్చింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. రేపాకపల్లికి చెందిన మొండయ్య కోడలిపై మోజుతో కొడుకు ఓదెలును రోకలిబండతో కొట్టి చంపాడు. అనంతరం ఇంటినుంచి పారిపోగా పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. ఓదెలు 108 అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. 

New Update
father killed

Warangal Father kills son

TG Crime: తెలంగాణలో మరో దారుణం జరిగింది. కోడలుపై మోజుతో కనిపెంచిన తండ్రే కొడుకును లేపేశాడు. తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించవద్దని హెచ్చరించినందుకు కుమారిడిపై దారుణానికి పాల్పడ్డాడు. రోకలి బండతో కొట్టి కొట్టి చంపాడు. ఈ దారుణమైన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేపాకపల్లిలో జరగగా ఘటను సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

కోడలితో అసభ్య ప్రవర్తన..

ఈ మేరకు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రేపాకపల్లికి చెందిన కాసం ఓదెలు(35), తన భార్య, కొడుకు(2)తో కలిసి తల్లిదండ్రులు సారక్క, మొండయ్యలతో కలిసి నివసిస్తున్నాడు. ఓదెలు 108 అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా 14 ఏళ్ల కిందట పెళ్లైంది. అయితే కొంతకాలంగా మొండయ్య ప్రవర్తన సరిగా లేకపోవడంతో గొడవలు జరుగుతున్నాయి. మొండయ్య కోడలితో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా బంధువులు పంచాయితీ పెట్టి హెచ్చరించారు. అయినా మారని మొండయ్య అలాగే ప్రవర్తిస్తున్నాడు. అయితే సోమవారం ఓదెలు తమ పెళ్లిరోజు వేడుకలు జరుపుకున్నాడు. అప్పుడు తాగి ఇంటికొచ్చి తండ్రి మొండయ్య కొడుకుతో గొడవపడ్డాడు. 

Also  read :  AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

ఎప్పటినుంచో పగతో రగిలిపోతున్న మొండయ్య కొడుకును చంపాలని ఎదురుచూస్తున్నాడు. ఇందులో భాగంగానే మంగళవారం తెల్లవారుజామున ఇంటి ముందు పడుకున్న కొడుకు ఓదెలు తలపై రోకలి బండతో కొట్టాడు. దీంతో తీవ్ర గాయమైన ఓదెలు అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం మొండయ్య పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు చెప్పిన భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, చిట్యాల సీఐ మల్లేశ్‌, ఎస్సై సందీప్‌కుమార్‌ తెలిపారు.

Also Read: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?

father | killed | son | today telugu news

Advertisment
Advertisment
Advertisment