Rape case: మహిళకు లిఫ్ట్‌ ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డ యువకులు!

తమిళనాడు పూతలూర్‌లో 42 ఏళ్ల మహిళపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. పనులు ముగించుకుని తిరుగుప్రయాణంలో రాత్రి బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న ఆమెకు లిఫ్ట్ ఇస్తామని చెప్పి ప్రవీణ్‌, రాజ్‌కపూర్‌ అనే వ్యక్తులు అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
Rape case: తెలంగాణలో మరో దారుణం.. మద్యం తాగించి మహిళా కూలీలపై అత్యాచారం!

Rape case: తమిళనాడు తంజావూర్‌లో మరో మహిళపై లైంగిక దాడి కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాత్రి పూట బస్సు కోసం బస్టాండ్ లో వెయిట్ చేస్తున్న మహిళపై ఇద్దరు యువకులు దారుణానికి పాల్పడ్డారు. బస్సు రావడం ఆలస్యం అవుతోందని చెప్పి బైక్‌పై ఇంటి దగ్గర దింపేస్తామని చెప్పి కొంతదూరం తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ మేరకు పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం.. తంజావూర్‌ జిల్లా పూతలూర్‌ లో 42 ఏళ్ల అవివాహిత పనికి ముగించుకుని రాత్రి ఇంటికి బయలుదేరింది. పూతలూర్‌లో బస్సు కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే రెండు బైకులపై వచ్చిన రాయందూర్‌కు చెందిన ప్రవీణ్‌ (32), రాజ్‌కపూర్‌ (26) అనే ఆమె ఒంటరిగా ఉండటాన్ని గమనించారు. లిఫ్ట్‌ ఇస్తామని చెప్పి ప్రవీణ్‌ తన బైక్‌పై ఎక్కించుకున్నాడు. వారి వెనకాలే రాజ్‌కపూర్‌ ఫాలో అవుతూ వెళ్లాడు. అలా కొంతదూరం వెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో ఇద్దరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు