Telangana MP's: రాజీనామాలు చేసిన తెలంగాణ ఎంపీలు
తెలంగాణ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తమ ఎంపీ పదవులకు రాజీనామా చేశారు.
తెలంగాణ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తమ ఎంపీ పదవులకు రాజీనామా చేశారు.
తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్యాస్ సిలిండర్ హామీ వంద రోజుల్లో అమలు చేస్తామని తెలిపారు. అలాగే కొత్త రేషన్ కార్డు దరఖాస్తులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఈ రోజు నిర్వహించిన సమీక్షలో స్పష్టం చేశారు.
మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్ కుంగడం, ప్రాజెక్టు వ్యయం, ఒక్కో ఎకరా సాగుకు అవుతున్న ఖర్చు తదితర వివరాలను అందించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితితో పాటు పలు అంశాలపై నీటిపారుదల శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు.
సివిల్ సప్లై , నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు తిరుపతి వెళ్లనున్నారు. తన మొక్కును తీర్చుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు గడ్డం తియ్యనన్నా ఉత్తమ్.. 10 ఏండ్లుగా గడ్డం తీయకుండా ఉన్నారు. కాంగ్రెస్ గెలవడంతో రేపు గడ్డం తీసుకోనున్నారు.
ఏడు సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి వరుసగా విజయం సాధించిన తన పేరును సీఎం పదవికి కాంగ్రెస్ హైకమాండ్ తప్పకుండా పరిశీలిస్తుందని ఆశిస్తున్నానని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీఎం ఎంపిక విషయంలో కాంగ్రెస్ పర్ఫెక్ట్ ప్రాసెస్ ఫాలో అవుతోందన్నారు.
తెలంగాణ సీఎం ఎవరన్న అంశాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా తేల్చలేదు. మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రస్తుత చీఫ్ రేవంత్ రెడ్డి ఫైనల్ రేసులో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. సాయంత్రం లోగా వీరిలో ఒకరి పేరును హైకమాండ్ ఫైనల్ చేయనున్నట్లు సమాచారం.
తెలంగాణకు రేవంత్ను సీఎం చేయొద్దని పలువురు సీనియర్లు తమ వాదనలు వినిపిస్తున్నారు. మల్కాజ్గిరి ప్రాంతంలో కాంగ్రెస్ ఒక్క సీటు గెలవలేదని.. తమ జిల్లాల్లో ఒక్కచోట మినహా అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలిచిందని చెబుతున్నారు. తాము రేవంత్ కంటే అత్యధిక మెజార్టీ ఓట్లతో గెలిచామంటున్నారు.
తెలంగాణలో సీఎం ఎవరూ అనేదానిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. నిన్న డీకే శివకుమార్ బృందం ఢిల్లీకి వెళ్లగా.. ఇప్పుడు భట్టి, ఉత్తమ్ హుటాహుటీనా ఢిల్లీకి వెళ్లారు. మధ్యాహ్నం వీళ్లు మల్లిఖార్జున ఖర్గేతో సహా హైకమాండ్తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
పార్టీని శిఖరాగ్రానికి తీసుకెళ్లింది ఒకరైతే, కష్టకాలంలోనూ పార్టీని అంటిపెట్టుకుని కాపాడుకున్నది మరొకరు.. కాంగ్రెస్ అంటే తమ పార్టీ అన్న ఆత్మీయతే అందరిదీ అయినా, భావోద్వేగాలతో పాటు అందరికీ ఆమోదయోగ్యం కాగల నిర్ణయాన్ని ప్రకటించవలసిన బాధ్యత ఇప్పుడు హస్తం పార్టీ అధిష్ఠానంపై ఉంది.