Hyderabad: కొత్త ఇల్లు కట్టినందుకు లక్ష ఇవ్వాల్సిందే.. కీసరలో యజమానిని దారుణంగా కొట్టిన హిజ్రాలు!
మేడ్చల్ జిల్లా కీసరలో హిజ్రాలు దారుణానికి తెగబడ్డారు. కొత్త ఇల్లు కట్టినందుకు లక్ష ఇవ్వాల్సిందే అంటూ ఇంటి యజమాని పై కర్రలు, రాళ్లతో దాడి చేశారు.
మేడ్చల్ జిల్లా కీసరలో హిజ్రాలు దారుణానికి తెగబడ్డారు. కొత్త ఇల్లు కట్టినందుకు లక్ష ఇవ్వాల్సిందే అంటూ ఇంటి యజమాని పై కర్రలు, రాళ్లతో దాడి చేశారు.
విశాఖలో దొంగపోలీస్, దాగుడు మూతల ఆట పేరుతో అత్తను లేపేసిన కోడలు విషయంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. యూట్యూబ్ వీడియోలు చూసి అత్తను ఎలా చంపాలని శోధించి మరి కోడలు అంతమొందించి న దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.
ఓ యువతి తన ప్రేమ విఫలం కావడంతో ప్రియుడిపై కసి తీర్చుకోవడానికి కొత్త మార్గాన్ని ఎంచుకుంది. అతని పేరిట పలు ఇంటర్నేట్ అకౌంట్లు సృష్టించింది.. వాటి నుంచి పాఠశాలలు, కళాశాలలకు బాంబులు పెట్టినట్లు బెదిరింపు మెసేజ్ లు పంపింది. చివరికి కటకటాలపాలైంది.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు జాతీయ రహదారి 65 పై ఆర్టీసీ బస్సు ప్రమాదం ముత్తంగి గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు డివైడర్ను ఢీకొట్టింది. బస్సులో 20 మంది ప్రయాణికులు ఉండగా ఎవరికి ఏం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
యూపీలోని మిర్జాపుర్లో పట్టాలు దాటుతున్న యాత్రికులను రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో దాదాపుగా ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హల్లిఖేడ్లో వ్యాను, కారు ఢీకొనడంతో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే మృతులు తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథ్పూర్ గ్రామానికి చెందిన వారు.
తిరుపతిలో ఉన్న బాలుర వసతి గృహంలో దారుణం జరిగింది. అక్కడ పనిచేసే నైట్ వాచ్మెన్ ఇద్దరు మైనర్ బాలురపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. వారు తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు హాస్టల్ వార్డెన్కు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కోయంబత్తూరులో ఓ కాలేజీ విద్యార్థినిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్యాచార నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లాలో సోమవారం కారు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దేవా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుత్లుపూర్ గ్రామ సమీపంలోని కల్యాణి నదిపై ఉన్న వంతెనపై రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.