Telangana: రాష్ట్రంలో రాగల ఐదు రోజులు భారీ వర్షాలు
తెలంగాణలో రాగల ఐదురోజులు పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను కూడా ఇష్యూ చేసింది
తెలంగాణలో రాగల ఐదురోజులు పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను కూడా ఇష్యూ చేసింది
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం కొన్ని చోట్ల, రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.
జూన్ 23 వరకు కూడా తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు యాదాద్రి భువనగిరి, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
రాగల 24 గంటల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరంగా విస్తరించినట్లు ఐఎండీ పేర్కొంది.
రానున్న ఐదు రోజుల్లో మహారాష్ట్ర , కర్ణాటక లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే రాబోయే 2 రోజుల్లో భారత దేశంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశాలున్నట్లు ఐఎండీ హెచ్చరించింది.
ఏపీ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించేందుకు రెడీగా ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.
హైదారాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇప్పటివరకు ఎండలు మండిపోగా.. తాజాగా వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. పలు ప్రాంతాల్లో వర్షాలు కూడా కురుస్తున్నాయి.
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు కొన్ని చోట్ల చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి. కరెంట్ స్తంభాలు పడిపోయాయి.నిన్న పడిన వర్షానికి వేర్వేరు ఘటనల్లో మొత్తంగా పది మంది మృతి చెందారు.