Ram Mandir : రామాలయ గర్భగుడి ఫొటో ఇదే.. ఎంత అద్భుతంగా ఉందో చూడండి!
హిందూజీవన విధానంలో మమేకమైన ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు. అయోధ్య రామాలయ గర్భగుడికి చెందిన అద్భుతమైన చిత్రాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ షేర్ చేశారు.
హిందూజీవన విధానంలో మమేకమైన ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు. అయోధ్య రామాలయ గర్భగుడికి చెందిన అద్భుతమైన చిత్రాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ షేర్ చేశారు.
భారతప్రధాని నరేంద్రమోదీ మరోసారి ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ యొక్క గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్లో PM మోదీ అత్యంత ప్రజాదరణ పొందిన గ్లోబల్ లీడర్ గా గుర్తింపు పొందారు.
ఒడిశాలోని ఓ మద్యం వ్యాపారి ఇళ్లపై గత మూడు రోజులుగా సోదాలు చేస్తున్న ఐటీశాఖ శుక్రవారం నాటికి రూ.220 కోట్లను స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ.. ప్రజల వద్ద నుంచి తీసుకున్న ప్రతి పైసాను కక్కిస్తామని ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొన్నారు.
ప్రధానమంత్రి కిసాన్ యోజనపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పీఎం కిసాన్ స్కీం కింద అందిస్తున్న నిధులను పెంచే ప్రసక్తే లేదని కేంద్రం వెల్లడించింది. డబ్బు పెరుగుతాయని అంచనా వేసిన రైతులకు కేంద్రం మొండిచేయి చూపించింది.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో బీజేపీ గెలిచింది. ఈరోజు (సోమవారం) నుంచి డిసెంబర్ 22 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలు చూసిన విపక్ష నేతలు తమ అసహనాన్ని పార్లమెంటులో చూపించకూడదని అన్నారు.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ఘడ్లో బీజేపీ గెలిచి 2024 ఎన్నికల విజయానికి ఒక బాటను వేసిందని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓ సలహా ఇస్తున్నానని.. దేశాన్ని బలహీనరపరిచే రాజకీయాలు చేయొద్దన్నారు. అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు.
తెలంగాణలో ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. గత కొన్నేళ్ల నుంచి మీరిస్తున్న ఈ మద్దతు పెరుగుతోందని.. తెలంగాణతో మాకున్న బంధం తెంచలేనిది అన్నారు. ఈ ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతిఒక్క బీజేపీ కార్యకర్తకు అభినందనలని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
కర్బన ఉద్గారాల కారణంగా దెబ్బతింటున్న పర్యావరణాన్ని రక్షించుకోవడమే లక్ష్యంగా దుబాయ్ లో COP28 సమ్మిట్ ప్రారంభమైంది. ఇందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు 167 దేశాలకు చెందిన అధినేతలు పాల్గొంటున్నారు. ఈ సమ్మిట్ డిసెంబర్ 12 వరకూ జరుగుతుంది.