Pakistan: పాకిస్థాన్కు షాక్.. 22 మంది సైనికులు హతం
బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్థాన్పై మరోసారి దాడులకు పాల్పడింది. తాజాగా తుర్బత్, దుక్కిలో ఆర్మీ కాన్వాయ్పై దాడి చేసింది. అయితే దాడుల్లో 22 మంది పాకిస్థాన్ సైనికులు హతమయ్యారు.
బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్థాన్పై మరోసారి దాడులకు పాల్పడింది. తాజాగా తుర్బత్, దుక్కిలో ఆర్మీ కాన్వాయ్పై దాడి చేసింది. అయితే దాడుల్లో 22 మంది పాకిస్థాన్ సైనికులు హతమయ్యారు.
పహల్గాం దాడితో భారత్, పాక్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్ పొరుగు దేశాలతో ఏనాడు సఖ్యతగా లేదు. దేశంలో అంతర్గత ఉద్రిక్తలతో పాటు పొరుగుదేశాలతో ఉన్న విభేధాల నేపథ్యంలో పాకిస్థాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్తో వాణిజ్యపరమైన సంబంధాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దేశ భద్రత, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సింధుజలాలను అడ్డుకునేందుకు నదిపై భారత్ డ్యామ్ కడితే ఏం చేస్తారని మీడియా ప్రశ్నించింది. దీంతో ఖవాజా ఒకవేళ భారత్ ఆ పని చేస్తే ఎలాంటి కట్టడాలనైనా పాక్ ధ్వంసం చేస్తుందని బదులిచ్చారు.
పాకిస్తాన్ కు ఊహించని షాకులు తగులుతున్నాయి.పాకిస్థాన్ నుంచి ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధించింది.ఈ మేరకు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది.
సముద్రంపై తమ బలాన్ని, పరాక్రమాన్ని చూపుతూ ఇండియన్ నేవీ Xలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో INS యుద్ధనౌక, జలాంతర్గామి, హెలికాప్టర్ మూడు ఉన్నాయి. ఈ మూడీటిని కలిపి ఇండియన్ నేవీ శక్తి త్రిశూలంగా అభివర్ణిస్తారు. ఈ టైంలో నేవీ పోస్ట్ చర్చనీయాంశమై వైరల్ అవుతుంది.