అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నేత దారుణ హత్య..!!
ఛత్తీస్గఢ్లో బీజేపీ నేతను నక్సలైట్లు దారుణ హత్య చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నేత హత్య సంచలనం రేపింది. బీజేపీ నేత ఓం మాథుర్ ను గొడ్డలితో నరికి హత్య చేశారు నక్సలెట్లు.
ఛత్తీస్గఢ్లో బీజేపీ నేతను నక్సలైట్లు దారుణ హత్య చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నేత హత్య సంచలనం రేపింది. బీజేపీ నేత ఓం మాథుర్ ను గొడ్డలితో నరికి హత్య చేశారు నక్సలెట్లు.
ఢిల్లీలోని ప్రభుత్వ స్కూల్ పక్కన నల్లని ప్లాస్టిక్ బ్యాగ్ లో కాళ్లు, చేతులు కట్టేసి ఉన్న మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలిని స్విట్జర్లాండ్ కు చెందిన 30 ఏళ్ల లీనా బెర్గర్ గా గుర్తించారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా తన భర్తను తానే చంపించి తర్వాత గుండెపోటని చిత్రీకరించడానికి ప్రయత్నించిందో మహిళ. డబ్బులిచ్చి, పాముతె కాటు వేయించి మరీ భర్తను చంపించింది.
మణిపూర్ అల్లర్లలో చోటు చేసుకున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొంతకాలం అదృశ్యమైన ఇద్దరు విద్యార్ధులు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్య గురయ్యారు. వీరికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో రాష్ట్రం మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి
భారత్- కెనడాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజు పెరుగుతున్నాయి. ఖలిస్తాన్ వివాదం రెండు దేశాల మధ్య మంటలను పెంచుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కెనడా రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారత్ తో బంధం తమకెంతో ముఖ్యమైనదన్నారు బ్లెయిర్. అయినా కూడా నిజ్జర్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో వాలంటీర్ చనిపోయిన ఘటన కలకలం రేపుతోంది. ఆదోని వాలంటీర్ హరిబాబును గుర్తు తెలియని దుండగులు రాళ్ళతో కొట్టి చంపారు. అయితే ఈ ఘటనకు కారణమైన వ్యక్తు ఎవరనేది మాత్రం ఇప్పటి వరకూ తెలియలేదు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల పరిధిలోని బొజ్జాయిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు మారుతీ శ్రీనును(38) గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.