Hyderabad: కొత్త ఇల్లు కట్టినందుకు లక్ష ఇవ్వాల్సిందే.. కీసరలో యజమానిని దారుణంగా కొట్టిన హిజ్రాలు!
మేడ్చల్ జిల్లా కీసరలో హిజ్రాలు దారుణానికి తెగబడ్డారు. కొత్త ఇల్లు కట్టినందుకు లక్ష ఇవ్వాల్సిందే అంటూ ఇంటి యజమాని పై కర్రలు, రాళ్లతో దాడి చేశారు.
మేడ్చల్ జిల్లా కీసరలో హిజ్రాలు దారుణానికి తెగబడ్డారు. కొత్త ఇల్లు కట్టినందుకు లక్ష ఇవ్వాల్సిందే అంటూ ఇంటి యజమాని పై కర్రలు, రాళ్లతో దాడి చేశారు.
ప్రముఖ రచయిత అందెశ్రీ అంతిమయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఘట్కేసర్లోని అందెశ్రీ అంతిమయాత్రలో రేవంత్ రెడ్డి పాడె మోశారు. ఓ కళాకారుడిగా, రచయితగా ఆయన ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
నటి అనుపమ పరమేశ్వరన్ తన ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై ఆమె పోలీసులను ఆశ్రయించారు. విచారణలో తన పేరుతో ఫేక్ అకౌంట్స్ ను సృష్టించి, తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నది తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల అమ్మాయేనని తెలిసి తాను షాకయ్యానని తెలిపారు.
కరీంనగర్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక హిందూ, ముస్లింల మధ్య జరుగుతున్న వార్ అని అన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కోసం సాగుతున్న ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉండగా మొత్తంగా 58 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. కాగా ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది.
జూబ్లీహిల్స్ మాజీ MLA మాగంటి గోపినాథ్ మృతిపై బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయని తల్లి మహానందకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోపీనాథ్ని ఆసుపత్రిలో చూసేందుకు తనను నిరాకరించారని.. KTRను మాత్రం లోనికి వెళ్లనిచ్చారని ఆమె పేర్కొన్నారు.
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో గుర్తు తెలియని వ్యక్తులు నాటు కోళ్లను తీసుకొచ్చి వదిలేశారు. దీంతో కోళ్ళన్నీ పొలాల చుట్టూ కనిపించాయి. దీంతో నాటు కోళ్లను తెచ్చుకోవడం కోసం జనం ఎగబడ్డారు. అందినకాడికి దొరకబట్టుకొని ఇళ్లకు తీసుకెళ్లారు. పండుగ చేసుకున్నారు.
రాష్ట్రంలో వరుస ప్రమాదాల నేపథ్యంలో నిబంధనలు అతిక్రమించే భారీ వాహనాల డ్రైవర్లు, యాజమాన్యాలపై రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఓవర్ లోడ్తో వెళ్లే టిప్పర్లు, లారీలను సీజ్ చేసి, డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేయాలని నిర్ణయించారు.
నల్గొండ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారిపై ఇన్నోవా కారు యూటర్న్ వద్ద అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టి పల్టీ కొట్టింది. ఇంజన్ లో మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది.