KTR: ఇప్పుడున్న సీఎం దొంగ.. రేవంత్ పై కేటీఆర్ ఫైర్
ఇవాళ రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తే ఓటు కు నోటు లో దొరికిన దొంగ అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్. ఆయనే ఓ క్రిమినల్.. ఆయనకు ఉండేవే క్రిమినల్ ఆలోచనలు అని అన్నారు.
ఇవాళ రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తే ఓటు కు నోటు లో దొరికిన దొంగ అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్. ఆయనే ఓ క్రిమినల్.. ఆయనకు ఉండేవే క్రిమినల్ ఆలోచనలు అని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ కు మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు పంపారు. పార్టీలో ఉద్యమకారుడికి రక్షణ కరువైందని సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మధ్య ఇంట్రస్టింగ్ టాపిక్ నడిచింది. మంత్రి పదవి ఎప్నుడొస్తుంది అంటూ కేటీఆర్ అడిగితే వద్దు..ప్లీజ్ నన్ను కాంట్రవర్శీ చేయొద్దు అంటూ రాజగోపాల్ రెడ్డి వెళ్ళి పోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది.
సీఎం రేవంత్పై ధ్వజమెత్తారు కేటీఆర్. చిన్నాపెద్ద తేడా లేకుండా నోటికొచ్చినట్లు రేవంత్ మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ను బొంద పెట్టుడే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ను మల్కాజ్ గిరిలో మడత పెట్టీ కొట్టుడే అని అన్నారు.
కృష్ణా జలాల వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వం ఏపీకి లొంగిపోయిందిని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కలిసి చేసిన పాపాలకు లెక్కలు లేవని సంచలన ఆరోపణలు చేశారు.
కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి నోరు పారేసుకుంటున్నారని.. తమకు నోరు ఉందని, వంద రోజుల వరకూ తామూ ఓపిక పడతామన్నారు. ఎంపీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేశారని కేటీఆర్ అన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తేనే గ్యారంటీలను అమలు చేస్తామంటున్నారని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, గ్యారెంటీలు అమలు చేసేది లేదని.. ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు.
తెలంగాణలోని సర్పంచుల పదవీకాలం ముగియడంపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు. సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ అని.. ప్రజాసేవకు కాదు అంటూ ట్విట్టర్ (X)లో ఆసక్తికర పోస్ట్ చేశారు. కేసీఆర్ హయాంలో ప్రతి గ్రామం అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. పీసీసీ పదవి కొరకు మీకు రేవంత్ రూ.50 కోట్లు ఇచ్చారని వెంకట్రెడ్డి పేర్కొన్నారని.. పరువు నష్టం నోటీసులు పంపాల్సింది తనకు కాదు.. కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి అని అన్నారు.