Karnataka: ముగ్గురు అమ్మాయిల మీద యాసిడ్ దాడి..ఎంబీఏ స్టూడెంట్ నిర్వాకం
కర్ణాటకలోని మంగుళూరులో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు ఇంటర్ చదివే అమ్మాయిల మీద యాసిడ్ దాడి జరిగింది. పరీక్ష రాయడానికి కాలేజీకి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
కర్ణాటకలోని మంగుళూరులో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు ఇంటర్ చదివే అమ్మాయిల మీద యాసిడ్ దాడి జరిగింది. పరీక్ష రాయడానికి కాలేజీకి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
బెంగళూరు రామేశ్వరం కేఫ్లో బాంబును అమర్చిన వ్యక్తి ఆచూకీ లభ్యమైంది. హోటల్తోపాటు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి బాంబు పెట్టినట్లు స్పష్టంగా తేలింది. అతడి ముఖకవళికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతడిని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది.
కర్ణాటకలో మరోసారి మంకీ ఫీవర్ కలకలం రేపింది. దీని కారణంగా ఇప్పటి వరకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా సోమవారం నాడు మంకీ ఫీవర్ తో 57 ఏళ్ల మహిళ మృతి చెందింది.
బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి ఆస్తులపై ఈడీ దాడులు నిర్వహించింది. కర్ణాటక, తమిళనాడుతోపాటు ఆరు రాష్ట్రాల్లోనూ ఆయన బంధువులకు చెందిన ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు జరిగాయి. మనీలాండరింగ్ కేసులో ఎమ్మెల్యేపై కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
భారత హాకీ ప్లేయర్ వరుణ్ కుమార్ అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 17 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుంటానని నమ్మించి 5 ఏళ్లుగా లైంగిక దాడి చేసినట్లు కర్ణాటకు చెందిన యువతి ఫిర్యాదు చేసింది. బెంగుళూర్ పోలీసులు కేసు నమోదు చేయగా వరుణ్ పరారీలో ఉన్నాడు.
కర్ణాటకలో ఇద్దరు మంకీ ఫీవర్ బారినపడి మృతి చెందడం కలకలం రేపుతోంది. అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ అధికారులు ఈ ఇన్ఫెక్షన్ మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకునేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఓ వ్యక్తి తన భార్యను 12ఏళ్లు ఇంట్లో బంధించి తాళం వేసిన సంఘటన మైసూర్ లో చోటుచేసుకుంది. మలమూత్ర విసర్జనలు ఓ బాక్స్ లోనే చేసిన ఇల్లాలు.. పిల్లలకు కిటికిలోంచి అన్నం పెట్టింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆమెను రక్షించారు. భర్తపై కేసు పెట్టేందుకు ఆమె నిరాకరించడం విశేషం.
కర్ణాటకలోని ఓ బాణాసంచా తయారీ కార్మాగారంలో ఆదివారం సాయంత్రం పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయాలపాలయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
కర్ణాటకలో ఓ బాయ్స్ హాస్టల్ విద్యార్థులు దారుణానికి పాల్పడ్డారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అంబేడ్కర్ పూజకు రాలేదని తోటి విద్యార్థిని అర్ధ నగ్నంగా ఊరేగించారు. పలు సెక్షన్ల కింద 20 మంది విద్యార్థులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.