Telangana: తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్లు బదిలీ
తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. రవాణా, గృహనిర్మాణం, సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్ రాజ్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా బెనహర్ మహేష్ దత్ ఎక్కా లను నియమించారు.
తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. రవాణా, గృహనిర్మాణం, సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్ రాజ్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా బెనహర్ మహేష్ దత్ ఎక్కా లను నియమించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై పలువురు ఐఏఎస్ ల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వివరణ కోరింది. ప్రాజెక్టు ప్రారంభం నుంచి నీటిపారుదల, ఆర్థిక శాఖలలో కీలక విధులు నిర్వహించిన వారు సోమ, మంగళవారాల్లో హాజరు కావాలని నోటీసులు పంపింది. విచారణకు సహరిస్తామని ఐఏఎస్ లు తెలిపారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరిక నెరవేరింది. కేరళ కేడర్కు చెందిన కృష్ణతేజను ఆంధ్రాకు తీసుకురావాలన్న పవన్ ప్రయత్నాలు ఫలించాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ & ట్రైనింగ్ గా కృష్ణతేజను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ట్రెయినీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్పై విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విచారణలో పూజా ఖేద్కర్పై చేసిన ఆరోపణలు నిజమని తేలితే.. ఆమెను సర్వీసు నుంచి తొలగించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
మహారాష్ట్ర కేడర్కు చెందిన 2023 ఐఏఎస్ బ్యాచ్ అధికారి పూజా ఖేద్కర్ వివాదంలో ఇరుక్కున్నారు. ఫేక్ సర్టిఫికేట్లు చూపించి ఆమె ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ (IAS)లో ఉద్యోగం పొందారని ఫిర్యాదు నమోదైంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈయనను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. గోపాలకృషణను బదిలీ చేయడం ఇది ఇప్పటికి రెండోసారి.
ఆంధ్రాలో పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఈరోజు దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. మొత్తం 18మంది ఐఏఎస్లను బదిలీ చేశారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ)గా, కేరళలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన యంగ్ ఐఏఎస్ అధికారి మైలవరపు వీఆర్ కృష్ణతేజ రానున్నారు.ఐఏఎస్ అధికారి అయిన కృష్ణతేజ నియామకానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక అనుమతి ఇచ్చారు.