Revanth Reddy : హరీష్ రావు రాజీనామా లేఖ రెడీగా పెట్టుకోవాలి-సీఎం రేవంత్ రెడ్డి
హరీష్ రావు సవాల్ను స్వీకరిస్తున్నా అన్నారు తెలంగాణముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన తన రాజీనామా లేఖను సిద్ధం చేసుకుని రెడీగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు.
హరీష్ రావు సవాల్ను స్వీకరిస్తున్నా అన్నారు తెలంగాణముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన తన రాజీనామా లేఖను సిద్ధం చేసుకుని రెడీగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు.
రైతు రుణమాఫీపై తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. మాజీ మంత్రి హరీశ్రావు, సీఎం రేవంత్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రాజీనామా లేఖను జేబులో పెట్టుకుని సిద్ధంగా ఉండాలంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు గన్పార్క్కు రాజీనామా లేఖతో చేరుకున్నారు.
TG: రుణమాఫీపై సీఎం రేవంత్రెడ్డికి సవాల్ విసిరారు హరీష్ రావు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని అన్నారు. రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని రేవంత్కు సవాల్ విసిరారు.
ఆగస్టు 15లోగా కాంగ్రెస్.. రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఒకవేళ రుణమాఫీ చేయకుంటే సీఎం పదవికి మీరు రాజీనామా చేస్తారా అంటూ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే తాటతీస్తా జాగ్రత్త అంటూ హెచ్చరించారు. కుల్వకుంట్ల కుటుంబమే పెద్ద చెడ్డీ గ్యాంగ్ అని ఆరోపించారు.
TG: కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోపై రాహుల్ గాంధీకి ఎమ్మెల్యే హరీష్ లేఖ రాశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చినట్లు మరోసారి పార్లమెంట్ ఎన్నికల వేళ దేశ ప్రజలను మోసం చేయొద్దు అని అన్నారు.
అధికారులు ఏడాదికొకసారి రియాక్టర్లను తనిఖీ చేయకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లాలో తరచూ రియాక్టర్లు పేలుతుండడంతో చాలామంది చనిపోతున్నారన్నారు. అయినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసి బహిష్కరించబడ్డాడని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఆరోపించారు. భువనగిరిలో పోటీ చేస్తున్న క్యామ మల్లేష్ బలహీన వర్గాల నేత అని, ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఆయనను పార్లమెంటుకు పంపాలని పిలుపునిచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పాత్ర ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ నేత రఘునందనరావు. గొప్ప హిందువు అయినట్టు హరీష్ రావు నేడు హనుమాన్ చాలీసా చదువుతున్నారు కానీ...అదంతా ఫోన్ ట్యాపింగ్ నుంచి ప్రజల దృష్టిమళ్ళించేందుకే అంటూ మండిపడ్డారు.