Election Commission: ఈసీ సంచలన నిర్ణయం.. పోలింగ్ సమయం పెంపు
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఎన్నికల పోలింగ్ సమయాన్ని పెంచింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెంచింది. ఎండల కారణంగా ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఎన్నికల పోలింగ్ సమయాన్ని పెంచింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెంచింది. ఎండల కారణంగా ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
పోలింగ్ కేంద్రం దగ్గరకు రాలేనివారికి ఈ ఎన్నికల్లో ఇంటి వద్దే ఓటు వేసే సౌకర్యం కల్పిస్తూ సీఈసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన 5రోజుల్లోగా అర్హులైన ఓటర్లు ఇంటి వద్ద ఓటు వేసేందుకు 12డి ఫారమ్ ను పూర్తి చేసి రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలి.
లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం సోషల్ మీడియాలో విభిన్నంగా ప్రచారం చేస్తోంది. లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి యువ, పట్టణ ఓటర్లను ప్రోత్సహించేందుకు ‘ఆప్ ఏక్ హై’ క్యాంపెయిన్కు శ్రీకారం చుట్టింది.
భారతీయ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చిన చండశాసనుడు టీఎన్ శేషన్. గత 72 ఏళ్లలో ఎన్నడూ లేనంత సుదీర్ఘ ఎన్నికల షెడ్యూల్కు దేశం సన్నద్ధమవుతున్న సమయంలో మరోసారి ప్రజలకు గుర్తొచ్చారు శేషన్ . ఇంతకీ శేషన్ ఏం చేశారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
భారత ఎన్నికల సంఘంలో ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించింది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. ఆ వార్తలన్నీ ఫేక్ అంటూ కొట్టిపారేసింది. అలాంటి గెజిట్ నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదని తెలిపింది.
ఈవీఎంల వినియోగంపై భయాందోళన అనవసరమని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. అలాగే ఒకరికి బదులు మరొకరు ఓట్లు వేయడంపై దృష్టి సారించాలని.. యంత్రంగానికి సూచనలు చేసినట్లు పేర్కొన్నారు.
లోక్సభ ఎన్నికలకు ముందు సీఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. 'ఏ రూపంలోనైనా' పిల్లలను ప్రచారంలో ఉపయోగించవద్దని ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలను కోరింది. పద్యాలు, పాటలు, రాజకీయ పార్టీ చిహ్నాల ప్రదర్శన లాంటి వాటికి కూడా పిల్లలను ఉపయోగించవద్దని ఆదేశించింది.
రానున్న లోక్సభ ఎన్నికల్లో మొత్తం 96 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గణంకాలు చెబుతున్నాయి. వీళ్లలో 47 కోట్ల మంది మహిళలే ఉన్నారు. అలాగే ఓటు వేసేందుకు అర్హులైన వారిలో 1.73 కోట్ల మంది 18 నుంచి 19 ఏళ్ల వయసు ఉన్నవారేనని తెలుస్తోంది.
తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికలు, వాటి ఫలితాలు ముగియడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ను ఎత్తివేసింది. ఈ ఎత్తివేత తక్షిణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. అయితే మిజోరాంలో డిసెంబర్ 4న ఫలితాలు వెల్లడయ్యాయి.