Cyber crime: క్రెడిట్ కార్డు పేరిట యువతిని నట్టేటా ముంచిన సైబర్ కేటుగాళ్లు.. ఎంత దోచేశారంటే!
సైబర్ నేరగాళ్లు హైదరాబాద్ లో ఓ యువతిని నట్టేట ముంచేశారు. ముంబై, తమిళనాడు, బిహార్ పలు ప్రాంతాల్లో తన పేరిట క్రెడిట్ కార్డులు వాడుతున్నారని నమ్మించి రూ.7.50 లక్షలు దోచేశారు. చివరికి మోసపోయినట్లు గుర్తించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు.