Chandrababu: ఫైబర్ గ్రిడ్ కేసులో దూకుడు పెంచిన సీఐడీ
చంద్రబాబు మీదున్న ఫైబర్ గ్రిడ్ కేసు విచారణను సీఐడీ వేగవంతం చేసింది. చంద్రబాబు సన్నిహితుల స్థిరాస్తుల అటాచ్మెంట్కు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఈరోజు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది.
చంద్రబాబు మీదున్న ఫైబర్ గ్రిడ్ కేసు విచారణను సీఐడీ వేగవంతం చేసింది. చంద్రబాబు సన్నిహితుల స్థిరాస్తుల అటాచ్మెంట్కు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఈరోజు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది.
టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేశారు తెలంగాణ బీజేపీ నేత ఈటల రాజేందర్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు రాజేందర్. ఆ పార్టీ విజయం కోసం తెరవెనుక మంత్రాంగం చేస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ కు అదనపు షరతులు పెట్టాలని సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. ఇరువైపులా న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును ఎల్లుండికి వాయిదా వేసింది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు టీమ్ హమాస్ ఉగ్రవాదులు లాగా ప్రవర్తిస్తున్నారని నారాయణ స్వామి ఆరోపించారు.
చంద్రబాబుకు కొత్త చిక్కులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అనారోగ్య కారణంగా జైలు నుంచి బెయిల్పై విడుదలైన ఆయన.. జైలు బయట ప్రసంగించండం సీఐడీకి ఆయుధంగా మారింది. కోర్టు నిబంధనల ప్రకారం.. ఆయన మీడియాతో మాట్లాడటం, ప్రసంగించడం చేయొద్దు. కానీ, ఆయన జైలు బయట ప్రసంగించారు. దీనిని సీఐడీ సీరియస్గా తీసుకుంది. దీని ఆధారంగా బెయిల్ రద్దు కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేయాలని భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది.
చంద్రబాబుకి బెయిల్ రావడంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చంద్రబాబు కోసం కోట్లాది మంది ఎదురుచూస్తున్నారని అన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో, ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని..అందరం ఆయనను స్వాగతిద్దాం అని ట్వీట్ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్ వచ్చిన క్రమంలో ఆయన మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ క్రమంలో ఆయనను రాజమండ్రి నుంచి విజయవాడ వరకు భారీ ఊరేగింపుగా తీసుకుని వెళ్లేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.
చంద్రబాబుకు బెయిల్ రావడంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. నిజం గెలిచి కాదు.. బాబుకు కళ్లు కనిపించట్లేదని బెయిల్ ఇచ్చారని సెటైర్లు వేశారు.
ఈ రోజు సాయంత్రంలోగా చంద్రబాబు విడుదల అవుతారని ఆయన తరఫు లాయర్లు తెలిపారు. ఒక వేళ ఆలస్యం అయితే.. రేపు ఉదయం విడుదల అవుతారని వెల్లడించారు. భవిష్యత్ లో మిగతా అన్ని కేసుల విషయంలోనూ చంద్రబాబుకు తప్పుకుండా ఊరట లభిస్తుందని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.