TS Politics: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. పార్టీ మారనున్న ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముందుగా టికెట్ ప్రకటించి బీ ఫామ్ మాత్రం వేరే అభ్యర్థికి ఇవ్వడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముందుగా టికెట్ ప్రకటించి బీ ఫామ్ మాత్రం వేరే అభ్యర్థికి ఇవ్వడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు.
నాంపల్లి, గోషామహల్ అసెంబ్లీ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. నాంపల్లి నుంచి ఆనంద్ గౌడ్, గోషామహల్ నుంచి నందకుమార్ వ్యాస్ అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది.
తెలంగాణలో నామినేషన్ల గడువును పెంచాలని ఎన్నికల సంఘాన్ని కోరారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పెంచాలన్నారు. ఇదే సమయంలో తమ పార్టీ అభ్యర్థుల రెండవ జాబితాను విడుదల చేశారు కేఏ పాల్. ఈ లిస్ట్ లో ఏడుగురు సభ్యులు ఉన్నారు.
ఖమ్మం బీఆర్ఎస్ నేత జలగం వెంకట్రావ్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో.. కాంగ్రెస్లో చేరి పోటీ చేసేందుకు సిద్ధమవగా.. అక్కడా నిరాశే ఎదురైంది. తాను పోటీ చేయాలని భావించిన కొత్తగూడెం సీటును పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించింది కాంగ్రెస్.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే. టీపీసీసీ జనరల్ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఇవాళో, రేపో బీఆర్ఎస్ లో చేరుతారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
మహారాష్ట్రలో 130 సర్పంచ్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా..అందులో ఏకంగా 57 పదవులను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.
ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్ధులు ప్రచారం చేయడం చాలా మామూలు. దీని కోసం వినూత్న కార్యక్రమాలు...వింత వింత చేష్టలు కూడా చేస్తారు. కానీ అసలు టికెట్టే రాని అభ్యర్థులుఎన్నికల ప్రచారంలో పాల్గొంటే...జనగామలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య ప్రచారం సంథింగ్ స్పెషల్ గా నిలుస్తోంది.
ప్రజల సొమ్మును నీరు గారుస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్మే స్థితిలో లేరని మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీపై జ్యూడిషియల్ కమిషన్ వేస్తే నిజనిజాలు బయటకు వస్తాయన్నారు.
కత్తి దాడికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.. దేవుని దయ నియోజవర్గ ప్రజల ఆశీస్సులతో ప్రాణాలతో బయటపడ్డానని అన్నారు. నన్ను చూసేందుకు అభిమానులు హైదరాబాద్ రావొద్దని.. తానే వారం రోజల్లోనే ప్రజల ముందుకు వస్తానని చెప్పారు.