Syria: సిరియాపై ఆగని ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. మరో పేద దేశంపై ప్రతాపం!

సిరియాపై ఇజ్రాయెల్‌ దాడులను ఆపడంలేదు. ఓవైపు గాజాపై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్‌ సైన్యం ఇటు సిరియాపైనా దాడులు కొనసాగిస్తోంది. డమాస్కస్‌లోని సైనిక ప్రదేశాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఒక సిరియన్ సైనికుడు మరణించాడు.

New Update
Syria: సిరియాపై ఆగని ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. మరో పేద దేశంపై ప్రతాపం!

ఓవైపు బాంబులతో గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌ మరోవైపు సిరియాపైనా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఐదు రోజుల క్రితం (జున్ 9) సిరియాలోని బనియాస్ నగరానికి సమీపంలో ఉన్న సైట్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ దళాలు వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ దెబ్బ నుంచి సిరియా ఇంకా కోలుకోకముందే మరోసారి ఇజ్రాయెల్‌ సైనికులు రెచ్చిపోయారు. సిరియా రాజధాని డమాస్కస్‌లో ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేసింది.


తిప్పికొడుతున్నాం...:
డమాస్కస్‌లోని సైనిక ప్రదేశాలు, నివాస భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఒక సిరియన్ సైనికుడు మరణించాడు. మరో ముగ్గురు గాయపడ్డారని సిరియా సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్ నుంచి దాడులు జరిగాయని సిరియా సైన్యం ప్రకటించింది. అటు డమాస్కస్ గ్రామీణ ప్రాంతంలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను తమ సైన్యం తిప్పికొట్టినట్టుగా సిరియా చెబుతోంది.


ఈ రెండు దేశాలకు ఎందుకు గొడవ?
ఇజ్రాయెల్ , సిరియా మధ్య వైరుధ్యం 1967 నాటి నుంచి ఉంది. అప్పడు జరిగిన ఆరు రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్‌ పైచేచి సాధించింది. సిరియా నుంచి గోలన్ హైట్స్‌ను ఇజ్రాయెల్‌ ఆనాడే స్వాధీనం చేసుకుంది. 1973లో యోమ్ కిప్పూర్ యుద్ధంలో ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సిరియన్ దళాలు విఫలయత్నం చేశాయి. 1974లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ , గోలన్ హైట్స్‌లో ఎక్కువ భాగం ఇజ్రాయెల్ నియంత్రణలోనే ఉండిపోయింది. 2011లో సిరియా అంతర్యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇజ్రాయెల్, సిరియాల మధ్య వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఎందుకంటే అప్పుడు సిరియాకు ఇరాన్‌ మద్దతుగా నిలిచింది. ఇది ఇజ్రాయెల్‌కు నచ్చలేదు. ఇక సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్‌ పాలనకు మద్దతుగా ఆయుధాలు, డబ్బు, యోధులను ఇరాన్‌ అందిస్తూ వస్తోంది.

Also Read: దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం.. 300 మంది..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించిన పాక్.. ఉద్యోగుల సెలవులు రద్దు!

పాకిస్తాన్ లో ప్రస్తుతం పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. భారత్ యుద్ధానికి రెడీ అవుతుండడంతో పాక్ జాగ్రత్తలు పడుతోంది. పీవోకేలో అత్యవసర ఆంక్షలు విధించింది. ఉద్యోగుల సెలవులు, ట్రాన్సఫర్లను నిలిపేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 

New Update
పాక్ ఉగ్రవాదులకు చైనా ఆయుధాలను అందిస్తున్న ఐఎస్ఐ

పైకి బీరాలు పోతున్నా పాకిస్తాన్ లోపల భయపడుతోందని స్పష్టంగా తెలుస్తోంది. పాక్ పీవోకేలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. ఒకవైపు బోర్డర్ లో భారత్ చర్యలు, యుద్ధం తప్పదన్న హెచ్చరికలతో పాకిస్తాన్ అత్యవసర నిర్ణయాలను తీసుకుంటోంది. పాక్ పీవోకేలో అత్యవసర ఆంక్షులు విధించింది అక్కడి ప్రభుత్వం. దాంతో పాటూ ఆరోగ్య కార్యకర్తల సెలవులు, ట్రాన్సఫర్లను నిలిపేసింది. దీనికి సంబంధించి ఏప్రిల్ 25న జీలం వ్యాలీ హెల్త్ డైరెక్టరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆసుపత్రులు, ఆరోగ్య విభాగాలలోని వైద్య సిబ్బందిని వారి వారి డ్యూటీ పాయింట్ల వద్దనే ఉంచాలని ఆదేశించింది. ఇప్పటికే సెలవు మీద ఉన్నవారు కూడా వెంటనే డ్యూటీల్లో జాయిన్ అవ్వాలని చెప్పింది. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, అంబులెన్స్ డ్రైవర్లను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని ఆదేశించింది. 

అప్రమత్తమైన భారత బలగాలు..

పాక్ హెల్త్ డైరెక్టరీ ఉత్తర్వులను భారత భద్రతా సంస్థలు కూడా తీవ్రంగా పరిగణించాయి. పాకిస్తాన్ తీసుకుంటున్న ఈ చర్యలు ఎల్వోసీ దగ్గర సైనిక లేదా ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాయి. దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్, పరిసర ప్రాంతాలలో ఇవి ఎక్కువగా జరగొచ్చని ఊహిస్తున్నారు. దీంతో భారత భద్రతా దళాలు పహల్గామ్, అనంతనాగ్ జిల్లాల్లో పెట్రోలింగ్, నిఘాను ముమ్మరం చేశాయి.  ఇక నియంత్రణ రేఖ దగ్గర భారత సైన్యం ప్రత్యేక నిఘాను కూడా ఏర్పాటు చేసింది. భారత సైన్యం ఎటువంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. 

today-latest-news-in-telugu | pakistan | loc | emergency 

Also Read:   J&K: మరో ఉగ్రవాది ఇంటిని పేల్చేసిన బలగాలు

Advertisment
Advertisment
Advertisment