SCR : రైలు ప్రయాణికులకు తీపి కబురు... అక్కడ రద్దైన రైళ్ల పునరుద్ధరణ

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులు ఓ శుభవార్త చెప్పింది. గతంలో విజయవాడ మార్గంలో ప్రయాణించిన పలు రైళ్లను రైల్వే రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ రైళ్లను తిరిగి పునరుద్ధరించింది.

New Update
South Central Railway: ఆ రైళ్లు నెల రోజుల పాటు రద్దు!

South Central Railway : దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులు ఓ శుభవార్త చెప్పింది. గతంలో విజయవాడ (Vijayawada) మార్గంలో ప్రయాణించిన పలు రైళ్లను రైల్వే రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ రైళ్లను తిరిగి పునరుద్ధరించింది. ఈ రైళ్ల వివరాలు తెలుసుకోండి. రైలు నెంబర్ 17258 కాకినాడ పోర్ట్ నుంచి విజయవాడకు అందుబాటులో కి రానుంది. ఈ రైలు కాకినాడ పోర్టు (Kakinada Port) లో ఉదయం 4.10 గంటలకు బయల్దేరితే ఉదయం 9.30 గంటలకు విజయవాడ కు చేరుతుంది.

రైలు నెంబర్ 07500 విజయవాడ నుంచి గూడూరుకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు (Train) విజయవాడలో సాయంత్రం 4.45 గంటలకు బయల్దేరితే అర్ధరాత్రి 12.40 గంటలకు గూడూరుకు చేరుతుంది. రైలు నెంబర్ 07876 తెనాలి నుంచి రేపల్లె వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు తెనాలి లో సాయంత్రం 4.40 గంటలకు బయల్దేరితే సాయంత్రం 5.40 గంటలకు రేపల్లెకు చేరుకుంటుంది. రైలు నెంబర్ 07787 రేపల్లె నుంచి గుంటూరుకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రేపల్లెలో సాయంత్రం 6 గంటలకు బయల్దేరితే రాత్రి 7.55 గంటలకు గుంటూరుకు చేరుకుంటుంది. రైలు నెంబర్ 07458 గూడూరు నుంచి విజయవాడ వరకు అందుబాటులో ఉంటుంది.

ఈ రైలు గూడూరులో ఉదయం 6.10 గంటలకు బయల్దేరితే మధ్యాహ్నం 3.45 గంటలకు విజయవాడ వస్తుంది. రైలు నెంబర్ 07781 విజయవాడ నుంచి మాచర్లకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు విజయవాడలో సాయంత్రం 4.15 గంటలకు బయల్దేరితే రాత్రి 9.35 గంటలకు మాచర్లకు చేరుతుంది. రైలు నెంబర్ 07782 మాచర్ల నుంచి విజయవాడకు ఉంటుంది. ఈ రైలు మాచర్లలో ఉదయం 5.30 గంటలకు బయల్దేరితే ఉదయం 10.55 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. రైలు నెంబర్ 07629 విజయవాడ నుంచి తెనాలికి ఉంటుంది.

ఈ రైలు విజయవాడలో ఉదయం 11.15 గంటలకు బయల్దేరితే మధ్యాహ్నం 12.20 గంటలకు తెనాలికి చేరుకుంటుంది. రైలు నెంబర్ 07874 తెనాలి నుంచి రేపల్లెకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు తెనాలిలో మధ్యాహ్నం 2.20 గంటలకు బయల్దేరితే మధ్యాహ్నం 3.20 గంటలకు రేపల్లెకు చేరుకుంటుంది.

రైలు నెంబర్ 07873 రేపల్లె నుంచి తెనాలికి అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రేపల్లెలో తెల్లవారుజామున మధ్యాహ్నం 1.10 గంటలకు బయల్దేరితే మధ్యాహ్నం 2.10 గంటలకు తెనాలికి చేరుకుంటుంది. రైలు నెంబర్ 07630 తెనాలి నుంచి విజయవాడకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు తెనాలిలో మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరితే మధ్యాహ్నం 2.20 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

రైలు నెంబర్ 07875 రేపల్లె నుంచి తెనాలికి అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రేపల్లెలో మధ్యాహ్నం 3.30 గంటలకు బయల్దేరితే సాయంత్రం 4.30 గంటలకు తెనాలి (Tenali) కి చేరుకుంటుంది.

Also read: ఏపీలో దారుణం…వైన్‌ షాపు దగ్గర గొడవ..ఒకరి హత్య!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Govt : ఏపీ ప్రభుత్వం కొత్త పథకం.. కుటుంబానికి రూ.20వేలు..రేపటి నుంచి అకౌంట్లోకి!

రేపు ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. 'మత్స్యకార సేవలో' అనే పేరుతో సీఎం కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నారు. దీనికోసం ప్రభుత్వం  రూ. 258 కోట్ల మేర ఖర్చు చేయనుంది.

New Update
chandrababu srikakulam

chandrababu srikakulam

మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  సముద్రంలో వేట విరామ సమయంలో జాలర్లకు అందించే ఆర్థిక సాయం అందించనున్నారు.  ఏప్రిల్ 26వ తేదీ శనివారం రోజున సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. 'మత్స్యకార సేవలో' అనే పేరుతో సీఎం చంద్రబాబు పథకాన్ని ప్రారంభించనున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నారు. ఈ పథకం కింద 1,29,178 కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. దీనికోసం కూటమి ప్రభుత్వం  రూ. 258 కోట్ల మేర ఖర్చు చేయనుంది. రేపు లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు