Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం..

పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో భారత్‌కు మరో పతకం దక్కింది. పురుషుల 50 మీటర్ల 3 పొజిషన్ విభాగం పోటీల్లో భారత షూటర్ స్వప్నిల్ కుశాలె ఫైనల్‌లో అదరగొట్టాడు. మూడో ప్లేస్‌తో బ్రాంజ్‌ మెడల్‌ సాధించాడు.

New Update
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం..

పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో భారత్‌కు మరో పతకం దక్కింది. పురుషుల 50 మీటర్ల 3 పొజిషన్ విభాగం పోటీల్లో భారత షూటర్ స్వప్నిల్ కుశాలె ఫైనల్‌లో అదరగొట్టాడు. బుధవారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో స్వప్నిల్ ఏడో స్థానంలో నిలిచి ఫైనల్లో ప్రవేశించాడు. ఇక ఫైనల్‌లో మూడో ప్లేస్‌తో బ్రాంజ్‌ మెడల్‌ కొట్టాడు.

Also read: రాహుల్ కుట్టిన షూస్‌కు సూపర్ డిమాండ్

2012 సంవత్సరంలో, స్వప్నిల్ అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ 2024లో 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ల పోటీలో ఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేయడానికి అతను 12 సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. స్వప్నిల్ కథ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కథను పోలి ఉంటుంది. స్వప్నిల్ కూడా టిక్కెట్ కలెక్టర్ కావడంతో అతని పేరు ఎంఎస్ ధోనితో ముడిపడి ఉంది. ధోని తన కెరీర్‌తో పాటు రైల్వేలో టిక్కెట్ కలెక్టర్‌గా కూడా కొంతకాలం పనిచేశాడు. స్వప్నిల్ ధోని బయోపిక్‌ని చాలాసార్లు చూశాడు. స్వప్నిల్ ధోనీకి వీరాభిమాని.. క్రికెట్ మైదానంలో ధోని ఎలా ప్రశాంతంగా ఉంటాడో, అదే విధంగా తన ఆటకు కూడా ప్రశాంతత, సహనం అవసరం అని చెబుతుంటాడు స్వప్నిల్.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PBK VS RR: పంజాబ్ కింగ్స్ ను బోల్తా కొట్టించిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2025లో ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్ఆర్ ఇచ్చిన టార్గెట్ ను ఛేజ్ చేయలేక పంజాబ్ బోల్తా పడింది. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

PBK VS RR

పంజాబ్ కింగ్స్ కు షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. సంజూ శాంసన్ కెప్టెన్సీలో విజయాన్ని నమోదు చేసుకుంది. పంజాబ్ కు 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ టార్గెట్ ను ఛేదించలేక కింగ్స్ బొక్క బోర్లా పడ్డారు. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయి 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ బ్యాటర్ నేహాల్ వధేరా 62 పరుగులతో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇతని తర్వాత మాక్స్ వెల్ ఒక్కడే 30 పరుగులు చేసాడు. నేహాల్ , మ్యాక్స్ వెల్ చాలా సేపు క్రీజులో ఉండి జట్టు విజయానికి పాటు పడ్డారు. కానీ మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం డబుల్ డిజిట్ కూడా కొట్టకపోవడంతో మ్యాచ్ ను చేజార్చుకోవాల్సి వచ్చింది.  కింగ్స్ బ్యాటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచే వికెట్లను పోగొట్టుకుంటూ వచ్చింది. 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అంతకు ముందు మ్యాచ్ లో బాగా ఆడిన ప్రభ్ మన్ సింగ్ ఎవరూ కూడా ఎక్కువసేపు ఉండలేదు. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3, సందీప్‌ శర్మ 2, మహీశ్ తీక్షణ 2, కార్తికేయ,  హసరంగ చెరో వికెట్‌ తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్..

చంఢీఘడ్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జైస్వాల్ 67తో స్కోర్‌తో అదరగొట్టాడు. చివర్లో రియాన్ పరాగ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 43 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ సంజు శాంసన్ కూడా 38 పరుగులతో రాణించాడు. నితీశ్ రాణా 12, హెట్ మయర్ 20, ధ్రువ్ జురెల్ 13 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.  ఫెర్గూసన్ 2, మార్కో జన్‌సెన్, అర్ష్‌దీప్‌ తలొ వికెట్ తీశాడు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | match | cricket

Also Read: RC 16: రామ్ చరణ్ రోరింగ్ టుమారో..పెద్ది గ్లింప్స్ రిలీజ్

 

Advertisment
Advertisment
Advertisment