Suryapet : కాంగ్రెస్ మండలాధ్యక్షుడి దారుణ హత్య.. సముద్రంలో డెడ్ బాడీ!

సూర్యాపేట కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వడ్డె ఎల్లయ్య దారణ హత్యకు గురయ్యాడు. పక్కా పథకం ప్రకారం ఆయనను జగ్గయ్యపేటకు తీసుకెళ్లి హత్య చేసిన నిందితుడు.. అనంతరం డెడ్ బాడీని వైజాగ్ తీసుకెళ్లి సముద్రంలో పడేసినట్లు తెలుస్తోంది.

New Update
Suryapet : కాంగ్రెస్ మండలాధ్యక్షుడి దారుణ హత్య.. సముద్రంలో డెడ్ బాడీ!

Vadde Yellaiah : సూర్యాపేట(Suryapet) మండల కాంగ్రెస్(Congress) అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య మర్డర్(Murder) మిస్టరీలో సంచలన అంశాలు వెలుగుచూశాయి. పక్కా ప్లాన్ ప్రకారం ఆయనను కిడ్నాప్ చేసి దారుణ హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఓ స్వచ్ఛసంస్థ నిర్వాహకుడితో సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఎల్లయ్యను చంపేందుకు ఓ మహిళతో పాటు, శ్రీనివాస్‌ అనే వ్యక్తితో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఏపీ(Andhra Pradesh) లో ఓ పంచాయితీకి పరిష్కారం చెప్పాలని ఈనెల 18న ఎల్లయ్యను నిందితుడు శ్రీనివాస్ తీసుకెళ్లాడు. జగ్గయ్యపేట దగ్గర్లోని లాడ్జీలో ఎల్లయ్యను హత్య చేశారని పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Nalgonda Politics: నల్లగొండ కాంగ్రెస్ లో కొత్త లొల్లి.. ఆ చేరికలు చెల్లవన్న పీసీసీ!

అనంతరం ఎల్లయ్య డెడ్ బాడీని ఫిషరీస్‌ లారీలో తీసుకెళ్లి విశాఖపట్నం దగ్గర సముద్రంలో పడేసినట్లు గుర్తించినట్లు సమాచారం. పాత కక్షలే హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఎల్లయ్యకు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడితో భూ వివాదం ఉందని సమాచారం. ఎల్లయ్య మృతదేహం కోసం పోలీసులు సముద్రంలో గాలిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఈ కింది వీడియో చూడండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు