Suresh Gopi : కేంద్ర మంత్రి పదవికి రాజీనామా.. సురేష్ గోపి కీలక ప్రకటన

నిన్న కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సురేష్ గోపి.. రాజీనామా చేస్తున్నారంటూ ఈ రోజు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఆయన ఖండించారు. అవన్నీ అవస్తవమని స్పష్టం చేశారు. మోదీ నాయకత్వంలో కేరళ అభివృద్ధి, శ్రేయస్సుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు.

New Update
Suresh Gopi : కేంద్ర మంత్రి పదవికి రాజీనామా.. సురేష్ గోపి కీలక ప్రకటన

Suresh Gopi Resign : ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) కేరళ (Kerala) లోని త్రిసూర్ లోక్ సభ స్థానం నుంచి నటుడు సురేష్‌ గోపి (Suresh Gopi) విజయం సాధించిన విషయం తెలిసిందే. కేరళ నుంచి గెలిచిన ఏకైక బీజేపీ ఎంపీ ఆయనే కావడం విశేషం. దీంతో ఆయనకు మంత్రి పదవి సైతం లభించింది. ఆదివారం ప్రధాని మోదీతో పాటు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. ఈ రోజు ఉదయం నుంచి ఆయన రాజీనామాకు సిద్ధం అవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ప్రమాణస్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే సురేష్‌ గోపి మనస్సు మార్చుకున్నారన్నది ఆ వార్తల సారాంశం.

కేంద్రమంత్రి (Central Minister) పదవి నుంచి తనను రిలీవ్ చేయాలని పార్టీని సురేష్ గోపి కోరినట్లు కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో సురేష్ గోపి కొద్ది సేపటి క్రితం తన 'X' ఖాతాలో ఈ అంశంపై పోస్టు చేశారు. తాను కేంద్ర మంత్రి పదవిని వదులుకుంటున్నట్లు వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో కేరళ రాష్ట్ర అభివృద్ధి, శ్రేయస్సుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు సురేష్ గోపి. దీంతో ఈ రోజు ఉదయం నుంచి ఆయన రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తలకు చెక్ పెట్టారు సురేష్ గోపి.


Also Read : యూఎఫ్‌సీలో భారత్‌కు తొలి విజయం..చరిత్ర సృష్టించిన పూజా తోమర్‌

#central-minister #resign #suresh-gopi #kerala
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Muda case: ముడా స్కామ్ కేసులో సిద్దరామయ్యకు కోర్టు...

Muda case: ముడా స్కామ్ కేసులో సిద్దరామయ్యకు కోర్టు షాక్..!

ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. విచారణను కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు అనుమతించింది. లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బిరిపోర్ట్ విభేదిస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును వాయిదా వేసింది.

New Update
MUDA Scam: కర్ణాటకలో ముడా స్కామ్ కలకలం.. సిద్ధరామయ్య భార్యపై కేసు

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ముడా స్కామ్ కేసు వేంటాడుతోంది. మైసూరు అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ కేసులో ఆయనకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ముడా కేసులో విచారణను కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు మంగళవారం అనుమతించింది. కర్ణాటక లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బి రిపోర్ట్ తో విభేదిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది.

Also read: ఖమ్మం వరదల్లో చనిపోయిన అగ్రికల్చర్ సైంటిస్ట్‌కు అరుదైన గౌరవం

ముడా భూముల కేటాయింపులో సిద్ధరామయ్య అవినీతికి పాల్పడలేదని లోకాయుక్త పోలీసులు ఇటీవల క్లీన్‌చిట్ ఇచ్చారు. అయితే దీనిని ఈడీ, హక్కుల కార్యకర్త స్నేహమయి కృష్ణ సవాలు చేశారు. ఈ కేసులో కొన్ని కీలక కోణాల్లో విచారణ జరగలేదని ఈడీ, స్నేహమయి కృష్ణ వాదించారు. మరింత లోతుగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్‌ విచారణ చేపట్టారు. లోకాయుక్త పోలీసులు పూర్తి దర్యాప్తు నివేదిక సమర్పించిన తర్వాతే బి రిపోర్ట్ పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను మే 7న తేదీకి వాయిదా వేశారు. దీనికి ముందు, సిద్ధరామయ్య, మరో ముగ్గురిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మైసూరు డివిజన్ లోకాయుక్త పోలీసులు ప్రాథమిక నివేదకను సమర్పించారు. అయితే విచారణ కేవలం నలుగురు వ్యక్తులకే పరిమితం కాదని, ఇందులో ప్రమేయమున్న అందరికీ దర్యాప్తు జరపాలని, సమగ్ర నివేదిక సమర్పించాలని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

Also read: Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

Advertisment
Advertisment
Advertisment