IPL : చెన్నై పై సన్ రైజర్స్ విజయం!

ఐపీఎల్‌ 2024 లో భాగంగా శుక్రవారం సన్‌ రైజర్స్- చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య రసవత్తర మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ లో సన్‌రైజర్స్ 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ పై గెలిచింది. సొంత గడ్డ పై గెలిచి సన్‌ రైజర్స్‌ తన సత్తా చాటింది

New Update
IPL : చెన్నై పై సన్ రైజర్స్ విజయం!

SRH : ఐపీఎల్‌ 2024(IPL 2024) లో భాగంగా శుక్రవారం సన్‌ రైజర్స్- చెన్నై సూపర్‌ కింగ్స్‌(CSK) మధ్య రసవత్తర మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ లో సన్‌రైజర్స్ 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ పై గెలిచింది. సొంత గడ్డ పై గెలిచి సన్‌ రైజర్స్‌ తన సత్తా చాటింది. 166 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18.1 ఓవర్లలోనే అందుకుంది.

సన్‌ రైజర్స్‌(Sun Risers Hyderabad) బ్యాటర్లలో మార్క్రమ్ (50) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.. అలాగే ఓపెనర్లు.. ట్రేవిస్ హెడ్ 31, అభిషేక్ శర్మ 37 పరుగులు చేసారు. అభిషేక్ శర్మ కేవలం 12 బంతుల్లో 37 పరుగులతో మెరుపు ఇన్సింగ్స్ తో ఆడి జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. షాబాజ్ అహ్మద్ 18, క్లాసెన్ 10, చివరలో నితీశ్ కుమార్ 14 పరుగులు చేశాడు.

చివరిలో సిక్స్ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు. చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీపక్ చాహర్, మహీష్ తీక్షణ తలో వికెట్ తీశారు. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు లక్ష్యాన్ని సన్‌ రైజర్స్ ముందు ఉంచింది

చెన్నై బ్యాటింగ్ లో శివం దూబే అత్యధికంగా 45 పరుగులు పూర్తి చేశాడు. ఆ తర్వాత రహానే 35, గైక్వాడ్ 26, చివరలో జడేజా 31 పరుగులు చేయడంతో 165 పరుగులు ఇచ్చింది. చివరలో ధోనీ బ్యాటింగ్ కు దిగడంతో స్టేడియం మొత్తం ధోని నామస్మరణతో దద్దరిల్లింది. ఈ గెలుపుతో సన్ రైజర్స్ తన ఖాతా రెండో విజయాన్ని వేసుకుంది. చెన్నై కూడా నాలుగు మ్యాచ్ ల్లో రెండు గెలుచుకుంది.

Also read: ఆందోళనతో గుండె కొట్టుకోవడం పెరుగుతుంది.. అలా ఎందుకు జరుగుతుందో తెలుసా!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Air india:పహల్గాం ఉగ్రదాడి...కీలక ప్రకటన చేసిన ఇండిగో,ఎయిర్‌ ఇండియా!

టాటా గ్రూపునకు చెందిన విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది.భారత్‌కు చెందిన విమానాలకు పాక్‌ తమ గగన తలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇక పై ప్రత్యామ్నాయ మార్గంలో విమానాలు నడపనున్నట్లు వెల్లడించింది.

New Update
Air India

Air India

భారత్‌ -పాక్‌ మధ్య నెలకొన్న ద్వైపాక్షిక ఉద్రిక్తతల నేపథ్యంలో టాటా గ్రూపునకు చెందిన విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది.భారత్‌కు చెందిన విమానాలకు తమ గగన తలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇక పై ప్రత్యామ్నాయ మార్గంలో విమానాలు నడపనున్నట్లు వెల్లడించింది. దీంతో ఆ మేర ప్రయాణ సమయం పెరగనుంది. ఎక్కువ ప్రయాణం కారణంగా టికెట్‌ ధర కూడా ఆ మేర పెరిగి అవకాశాలున్నాయని విమానయాన వర్గాలు చెబుతున్నాయి.

Also Read:New Smartphone: శాంసంగ్ M56 5G ఫస్ట్ సేల్ షురూ.. భారీ డిస్కౌంట్- ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!

భారత్‌ కు చెందిన విమానాలకు పాకిస్థాన్‌ తన గగనతలం నుంచి ప్రయాణాల పై ఆంక్షలు విధించింది. దీంతో ఉత్తర అమెరికా,యూకే,యూరప్‌,పశ్చిమాసియా దేశాల నుంచి వచ్చేపోయే విమానాలు ప్రత్యామ్నాయ సుదూరపు మార్గంలో ప్రయాణిస్తాయి.ప్రయాణికులకు కలిగిన ఈ అసౌకర్యానికి మేం చింతిస్తున్నాం.

Also Read: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?

గగనతలం మూసివేత మా చేతిలో లేని వ్యవహారం. ఏదేమైనా ఎయిరిండియా ప్రయాణికులు సిబ్బంది భద్రత మాకు అంటూ ఎయిరిండియా తన ఎక్స్‌ పోస్ట్‌ లో పేర్కొంది. పాకిస్థాన్‌ ఎయిర్‌స్పేస్‌ మూసివేతతో తాము నడిపే కొన్ని అంతర్జాతీయ విమానాల పై ప్రభావం పడుతోందని ఇండిగోసంస్థ పేర్కొంది.

వీలైనంత తొందరగా గమ్యస్థానాలకు చేర్చడంలో తమ సిబ్బంది ప్రయత్నిస్తారని తెలిపింది.ఒకవేళ మీరు ప్రయాణించబోయే విమానం పైనా దీని ప్రభావం ఉంటే స్టేటస్‌ చెక్‌ చేసి తమ వెబ్‌సైట్‌ ద్వారా రీ బుకింగ్‌ లేదా రిఫండ్‌ ను పొందొచ్చని ప్రయాణికులకు సూచిస్తూ ఎక్స్‌ వేదికగా ట్రావెల్‌ అడ్వైజరీని జారీ చేసింది. ఎయిరిండియా,ఇండిగోతోపాటు స్పైస్‌ జెట్‌, ఎయిరిండి ఎక్స్‌ప్రెస్‌ కూడా అంతర్జాతీయ సర్వీసులను నడుపుతున్నాయి. 

ఉత్తరాది నగరాల నుంచి పశ్చిమ దేశాల పై వెళ్లే విమానాల పై గగన తలం మూసివేత ప్రభావం  పడనుంది.

Also Read:Pahalgam terror attack: ఏ క్షణమైనా భారత్ -పాక్ యుద్ధం.. వేగంగా మారుతున్న పరిణామాలు?

Also Read: All-party Meeting: ముగిసిన ఆల్ పార్టీ మీటింగ్.. కశ్మీర్‌లో రాహుల్ గాంధీ పర్యటన

 air-india | indigo | flight indigo | pak | pahalgam | attack in Pahalgam | Pahalgam attack | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment