Canada: భారత్, కెనడా వివాదం.. గణనీయంగా పడిపోయిన భారతీయ విద్యార్థుల సంఖ్య

ఇండియా, కెనడాల మధ్య దౌత్యవిభేదాలు నెలకొన్న నేపథ్యంలో.. కెనడా వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. వాళ్లకు ఇచ్చే స్టడీ పర్మిట్ల సంఖ్యను కెనడా గణనీయంగా తగ్గించేసింది. గతంతో పోలిస్తే దాదాపు 86 శాతం మంది భారతీయ విద్యార్థులు తగ్గిపోయినట్లు తెలుస్తోంది.

New Update
Canada: భారత్, కెనడా వివాదం.. గణనీయంగా పడిపోయిన భారతీయ విద్యార్థుల సంఖ్య

India-Canada Row: భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన విభేదాలు తలెత్తడంతో.. కెనడా వెళ్లే భారతీయ విద్యార్థుల (Indian Students) సంఖ్య తగ్గిపోయింది. వాళ్లకు ఇచ్చే స్టడీ పర్మిట్ల సంఖ్యను కెనడా గణనీయంగా తగ్గించేసింది. 2023లో డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కేవలం 14,910 పర్మిట్లను మాత్రమే జరీ చేసింది. అంతకు ముందు ఈ సంఖ్య 1,08,940గా ఉంది. అంటే దాదాపు 86 శాతం భారతీయ విద్యార్థులు తగ్గిపోయారు.

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్‌ నిజ్జర్ హత్య భారతీయ ఏజెంట్లు ఉన్నారని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) ఇటీవల ఆరోపణలు చేయడంలో ఇరుదేశాల మధ్య దౌతపరమైన విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఉన్న రాయబారులను తగ్గించుకోవాలి అని భారత్‌ కెనడాకు సూచించింది. దీంతో కెనడా 41 మంది దైత్యాధికారులను తమ స్వదేశానికి పిలిపించింది. ఇలాంటి తరుణంలో పెద్ద సంఖ్యలో స్టడీ పర్మిట్లను ప్రాసెస్ చేయడం కుదరని.. కెనడా ఇమిగ్రేషన్ మంత్రి మార్క్‌ మిల్లర్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Also Read: తమ్మినేని వీరభద్రం హెల్త్ బులిటెన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే..

విదేశీ విద్యార్థులే ఆదాయ వనరు

భవిష్యత్తులో ఈ స్టడీ పర్మిట్లను జారీ చేసే సంఖ్య కూడా గణనీయంగా పెరిగే సంకేతాలు కనిపించడం లేవన్నారు. ఇదిలాఉండగా.. కెనడాలో చదువుకోవడానికి వెళ్లే విదేశీ విద్యార్థుల్లో భారతీయులే ఎక్కువగా ఉంటారు. 2022లో 22,835 స్టడీ పర్మీట్లు జారీ చేశారు. ఇందులో 41 శాతం భారత విద్యార్థులే దక్కించుకున్నారు. మరో విషయం ఏంటంటే కెనడాలోని యూనివర్శిటీలకు విదేశీ విద్యార్థులు రావడమే ప్రధాన ఆదాయ వనరు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ (Hardeep Singh Nijjar) హత్యకు భారతీయ ఏజెంట్లే కారణమంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన నిరాధార ఆరోపణలు ఇరు దేశాల మధ్య తీవ్ర విభేదాలను రాజేసిన విషయం తెలిసిందే. దీంతో దిల్లీలోని తమ రాయబారులను భారీ సంఖ్యలో తగ్గించుకోవాలన్న భారత ప్రభుత్వ సూచన మేరకు కెనడా 41 మంది దౌత్యాధికారులను (Diplomats) వెనక్కి తీసుకుంది.

Also Read: ఇకనుంచి వాతావరణ సమాచారం మీ చేతిలోనే.. యాప్‌ ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి..

విద్యార్థులు వలసలు పెరిగాయి

ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో స్టడీ పర్మిట్లను ప్రాసెస్‌ చేయడం కుదరడం లేదని ఆ దేశ ఇమిగ్రేషన్‌ మంత్రి మార్క్‌ మిల్లర్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సమీప భవిష్యత్తులో పర్మిట్ల జారీ గణనీయంగా పెరిగే సంకేతాలూ కనిపించడం లేదని పేర్కొన్నారు. అలాగే విదేశీ విద్యార్థుల వలసలు కూడా ఎక్కువగా పెరిగిపోయాయని.. దీనివల్ల కెనడాలో నిరుద్యోగం, ఇళ్ల కొరత సమస్యలు కూడా తలెత్తుతున్నాయని కూడా మిల్లర్‌ ఇటీవల అన్నారు. అందుకే తమ దేశంలో ఉండే విదేశీ విద్యార్థులప పరిమితి విధించే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లను మినహాయించారు.  దీనికి సంబంధించి అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది.

New Update
iPHONE 16 Trump Tariffs

iPHONE 16 Trump Tariffs Photograph: (iPHONE 16 Trump Tariffs)

గత పది రోజులుగా ప్రపంచం మొత్తం టారీఫ్ ల వార్ తో దడదడలాడిపోతోంది. టారీఫ్ లతో దాదాపు అన్ని దేశాలనూ బెంబేలెత్తించారు. అయితే రెండు రోజు క్రితం ఈ సుంకాలకు 90 రోజుల బ్రేక్ ను కల్పిస్తూ అనౌన్స్ చేశారు. మళ్ళీ ఇందులో చైనాను మాత్రం కలపలేదు. దీంతో మిగతా దేశాలన్నీ కాస్త ఊపిరి పీల్చుకున్నా చైనాతో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా సుంకాల విషయంలో మరో కీలక నిర్ణయం ప్రకటించింది అమెరికా. 

ఫోన్లు, కంప్యూటర్ల మీద..

అమెరికా మీద చైనా 125 శాతం, అమెరికా 145 శాతం సుంకాలను విధించుకుంటున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తుల మీద 145 ఉంటాయి కానీ స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల మీద కాదంటూ ఒక కీలక ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, హార్డ్‌ డ్రైవ్‌లు, కంప్యూటర్‌ ప్రాసెసర్లు, మెమొరీ చిప్‌లు, సెమీ కండక్టర్లు, సోలార్‌ సెల్స్‌, ఫ్లాట్‌ టీవీ డిస్‌ప్లేలు వంటి వాటిని ఈ ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు పొందుతాయి. అమెరికాకు చెందిన యాపిల్ సంస్థకు సంబంధించి ప్రోడక్ట్స్ ఎక్కువ శాతం చైనా నుంచే వస్తాయి. 

యాపిల్ కంపెనీకి ఊరట..

సుంకాల పెంచడంతో స్మార్ట్ ఫోన్లు, యాపిల్ ఫోన్లు ధరలు పెరుగుతాయని వినియోగదారుల్లో ఆందోళన పెరిగింది. దీంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కోసం అమెరికా వాసులు స్టోర్లకు కూడా పరుగెత్తారు. కానీ ఇప్పుడు అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. నిజానికి ప్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల ఉత్పత్తుల మీద ప్రతీకార సుంకాలను పెంచాలంటే అవన్నీ అమెరికాలోనే తయారు చేయాలి. కానీ అక్కడ ఇవి చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నట్టుండి తయారీ కంపెనీలను పెట్టడం కూడా  కుదరదు.  దీనికి కొన్నేళ్ళు సమయం పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అమెరికా సుంకాల నిర్ణయంతో అత్యధికంగా నష్టపోయిన యాపిల్ కంపెనీ...ఇప్పుడు తాజా నిర్ణయంతో హమ్మయ్య అనుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

 today-latest-news-in-telugu | usa | china | trump tariffs | apple | i-phone

Also Read: SRH VS PBKS: ఉప్పల్‌లో కొడితే తుప్పల్లో పడింది భయ్యా.. సన్‌రైజర్స్ ముందు భారీ టార్గెట్

 

Advertisment
Advertisment
Advertisment