పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమి.. సింగిల్ రన్‌కే IPL స్టార్ ఔట్

అండర్‌-19 ఆసియా కప్‌ టోర్నీలో భారత్‌కు పాక్ షాక్ ఇచ్చింది. ఇవాళ జరిగిన తొలి మ్యాచ్‌లో 43 పరుగుల తేడాతో భారత్‌ను పాక్ ఓడించింది. దీంతో భారత్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. భారత్ తన తర్వాతి మ్యాచ్‌లో డిసెంబరు 2న జపాన్‌తో తలపడనుంది.

New Update
Under 19 asia cup

దుబాయ్ వేదికగా అండర్ -19 ఆసియా కప్ టోర్నమెంట్ జరుగుతుంది. ఇందులో భాగంగా పాకిస్తాన్ - భారత్ మధ్య తొలి మ్యాచ్‌ ఇవాళ (నవంబర్ 30) జరిగింది. ఈ మొదటి మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైంది. పాకిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో యువ భారత్ 43 పరుగుల తేడాతో ఓడిపోయింది. 

ఇది కూడా చూడండి: రైతు బంధు బంద్.. హరీష్ రావు ఫైర్!

తొలి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. పాక్ ఆటగాడు షాజైబ్ ఖాన్ చెలరేగిపోయాడు. 147 బంతుల్లో 159 పరుగులు చేశాడు. 10 సిక్స్‌లు, 5 ఫోర్లతో పరుగుల వర్షం కురిపించాడు. 

ఇది కూడా చూడండి: చెన్నై ఎయిర్‌పోర్టు మూసివేత.. ఎందుకో తెలుసా ?

ఇక మరో ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ సైతం హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దీంతో వీరిద్దరి తొలి వికెట్‌కు 160 పరుగుల పాట్నర్‌షిప్ నమోదు అయింది. ఇక ఎప్పుడైతే తొలి వికెట్ పడిందో.. భారత్‌కు సరికొత్త ఊపు వచ్చింది. భారత బౌలర్లు పుంజుకుని వరుస వికెట్లు తీశారు. ఏకంగా సమర్త్ నాగరాజ్ 3, ఆయుశ్ మాత్రే 2, కిరణ్ 1, యుధజిత్ 2 వికెట్లు పడగొట్టారు. 

ఇది కూడా చూడండి: బిగ్ ట్విస్ట్ ! పృథ్వీ, నబీల్ ఎలిమినేటెడ్.. టాప్ 5 వీళ్ళే

పాకిస్తాన్ బ్యాటింగ్ అనంతరం భారత్ 282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. మొదటి నుంచే భారత యువ ఆటగాళ్లు తడబడ్డారు. 28 పరుగులకే ఓపెన్లు ఆయిష్ మాట్రే, వైభవ్ సూర్యవంశీ ఓటయ్యారు. ఐపీఎల్ మెగా వేలంలో దాదాపు రూ1.10 కోట్లకు అమ్ముడు పోయిన 13 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. 9 బంతులు ఎదుర్కొని కేవలం 1 రన్ మాత్రమే చేసి ఔటయ్యాడు. 

ఇది కూడా చూడండి: నాగ చైతన్య - శోభిత మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్ ఉందా?

మిడిల్ ఆర్డర్ బ్యాటర్ నిఖిల్ కుమార్ (67) సహా మిగతా బ్యాటర్లెవ్వరూ ఈ మ్యాచ్‌లో రాణించలేకపోయారు. ఇక చివరకు భారత్ 47.1 ఓవర్లలో 238 పరుగులకే ఆలౌట్ అయింది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH VS MI: మళ్ళీ హైదరాబాద్ ఓటమి..వరుసగా ముంబైకు నాలుగో విజయం

సొంత గ్రౌండ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ మళ్ళీ ఓడిపోయింది. ఉప్పల్ జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ పై ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో అలవోగ్గా విజయం సాధించింది.  144 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలో పూర్తి చేసింది. 

New Update
ipl

SRH VS MI

ముంబై బ్యాటర్లు మరోసారి చెలరేగిపోయారు. ఈరోజు హైదరాబాద్ ఉప్పల్ లో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ను మట్టికరిపించారు. హైదరాబాద్ ఇచ్చిన 144 పరుగుల టార్గెట్ ను 7 వికెట్ల తేడాతో కొట్టి విజయం సాధించారు.  హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫుల్ ఫామ్ లోని వచ్చేశాడు. ఈ రోజు హైదరాబాద్ సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో 46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో చెలరేగిపోయాడు. 70 పరుగులు చేసి వరుసగా రెండో అర్దసెంచరీ సాధించాడు. అంతేకాదు ఐపీఎల్ లో అత్యతం వేగంగా 20 వేల పరుగులను పూర్తి చేసుకున్న బ్యాటర్ గా కూడా రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే సూర్య కుమార్ యావ్ కూడా  19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 పరుగులు చేసి దూకుడుగా ఆడాడు. రికెల్‌టన్ (11), విల్ జాక్స్ (22) పరుగులు చేశారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో జయదేవ్‌ ఉనద్కత్‌, జీషాన్ అన్సారీ, ఎషాన్ మలింగ తలో వికెట్‌ తీశారు. దీంతో ముంబై ఇంకా 26 బాల్స్ మిగిలుండానే హైదారబాద్ ను చిత్తు చేసింది.  దీంతో ముంబై వరుసగా నాలుగో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు ఓవరాల్ గా ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ లను గెలచి నెట్ రన్ రేట్ ను మెరుగుపరుచుకుని పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. 

చేతులెత్తేసిన హైదరాబాద్..

ముంబై ఇండియన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చేతులెత్తేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన SRH జట్టు ప్రారంభం నుంచే తడబడింది. ఓపెనర్లుగా క్రీజ్‌లోకి వచ్చిన ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ దూకుడుగా ఆడే క్రమంలో పెవిలియన్‌కు చేరారు. తొలి ఓవర్‌కు 2 పరుగులు చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ 2 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయింది. ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్‌ డకౌట్‌ అయ్యాడు. వెను వెంటనే 2 ఓవర్1వ బంతికి సన్‌రైజర్స్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఇషాన్‌ కిషన్‌ (1) ఔట్‌అయ్యాడు. దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ రికెల్‌టన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఓవర్‌లోనే మరో వికెట్ డౌన్ అయింది. 3 ఓవర్ 3వ బంతికి  అభిషేక్‌ శర్మ (8) ఔటయ్యాడు. ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఇలా 4 ఓవర్లకు 13/3 స్కోర్‌ చేసింది. ఆ తరువాత కూడా వరుసగా వికెట్లను కోల్పోతూ కనీసం వంద అయినా స్కోర్ చేస్తారా అన్న పరిస్థితుల్లోకి వెళ్ళింది. కానీ క్లాసెన్ క్లాసిక్ బ్యాటింగ్‌తో అదరగొట్టేశాడు. 30 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. నిలకడగా ఆడిన క్లాసెన్‌ (71) ఔట్‌ అయ్యాడు. దీంతో హైదరాబాద్ జట్టు ఆరో వికెట్‌ కోల్పోయింది. వెను వెంటనే ఏడో వికెట్‌ డౌన్‌ అయింది. అభినవ్‌ (43), కమిన్స్ (1) ఔట్‌ అయ్యారు. దీంతో 20 ఓవర్లకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. 

today-latest-news-in-telugu | IPL 2025 | srh-vs-mi | match

Also Read: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన్

Advertisment
Advertisment
Advertisment