Rohit Sharma: రోహిత్‌శర్మ విధ్వంసం.. 76 బంతుల్లో సెంచరీ చేసిన హిట్‌మ్యాన్

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ చెలరేగిపోయాడు. 76 బంతుల్లోనే సెంచరీ చేశాడు. రోహిత్‌కు వన్డేల్లో ఇది 32వ సెంచరీ. దాదాపు 16 నెలల తర్వాత రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. 

New Update
Rohith Sharma Century

Rohith Sharma Century

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ చెలరేగిపోయాడు. 76 బంతుల్లోనే సెంచరీ చేశాడు. రోహిత్‌కు వన్డేల్లో ఇది 32వ సెంచరీ. దాదాపు 16 నెలల తర్వాత రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. గత కొంతకాలంగా మ్యాచుల్లో విఫలవుతూ వస్తున్న రోహిత్ శర్మ.. ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చేశాడు. చాలాకాలం తర్వాత హిట్‌మ్యాన్‌ తన స్టైల్లో థండర్ షాట్లతో విరుచుకుపడ్డాడు. 30 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ కూడా చేశాడు.ఆదిల్ రషీద్‌ వేసి 25.2 ఓవర్‌కు సిక్స్‌ కొట్టి సెంచరీ చేశాడు. 

Also Read: పరువు తీయొద్దు .. భారత్ పై గెలవండి..కప్ తీసుకురండి :  పాక్ ప్రధాని

వన్డే మ్యాచుల్లో అత్యధిక సిక్సులు బాదిన క్రికెటర్స్‌ జాబితా కూడా రోహిత్‌ (337) రెండో ప్లేస్‌కు చేరుకున్నారు. వెస్టిండీస్ ఆటగాడు క్రిస్‌ గేల్‌(331)ను రోహిత్‌ వెనక్కి నెట్టాడు. ఇక వన్డేల్లో 351 సిక్స్‌లతో పాకిస్థాన్ ఆటగాడు షాహిద్ అఫ్రిది మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే ఇంటర్నేషనల్ మ్యాచుల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ (49) మూడో స్థానంలో ఉన్నాడు. సచిన్‌ టెండుల్కర్‌ 100 సెంచరీలతో మొదటి స్థానంలో ఉండగా.. విరాట్‌ కొహ్లీ 81 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు.

Also Read: ఈడ్చి కొట్టిన పాక్ బ్యాట్స్మెన్...  న్యూజిలాండ్ ఆటగాడికి తీవ్ర గాయం!

 ఈ మ్యాచ్‌తో రోహిత్‌ శర్మ వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసి ప్లేయర్స్‌లో టాప్‌ 10 జాబితాలోకి వచ్చేశాడు. రాహుల్ ద్రవిడ్ (318 ఇన్నింగ్స్‌, 10,889)ను దాటేసిన రోహిత్‌ పదో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం రోహిత్ 259 ఇన్నింగ్స్‌లో 10,962 పరుగులతో ఉన్నాడు. అంతేకాదు వన్డే క్రికెట్‌ చరిత్రలో అత్యధిక రన్స్‌ చేసిన నాలుగో భారత ఆటగాడిగా నిలిచాడు. సచిన్ టెండుల్కర్ (18,426 పరుగులు), విరాట్‌ కొహ్లీ (13,906), సౌరభ్‌ గంగూలీ (11,363) వరుసగా మొదటి, రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.  

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DC vs RR : అదరగొట్టిన ఢిల్లీ .. రాజస్థాన్ టార్గెట్ 189

ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది, ఓపెనర్ అభిషేక్ పొరెల్ (49)టాప్ స్కోరర్ గా నిలిచాడు. కేఎల్ రాహుల్ (38) పరుగులతొ రాణించారు.

New Update
dc-vs-rr match

dc-vs-rr match

ఐపీఎల్ 2025లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఓపెనర్లు జేక్ ఫ్రేజర్  (9), అభిషేక్ పొరెల్(49)  మంచి శుభారంభాన్ని అందించారు. అభిషేక్ పొరెల్ దూకుడుగా జట్టు స్కోరు బోర్డును పెంచాడు. తుషార్ దేశ్‌పాండే వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో 23 పరుగులు రాబట్టాడు. వరుసగా 4, 4, 6, 4, 4 బాదేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.  

 ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్‌

34 పరుగుల వద్ద  ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్‌ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ వేసిన 2.3 ఓవర్‌కు జేక్ ఫ్రేజర్ ఔట్  అయ్యాడు. ఆ తరువాత వచ్చిన కరుణ్‌ నాయర్ ఈ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన  కేఎల్ రాహుల్(38) తో కలిసి జట్టును ముందుకు నడిపించాడు పొరెల్. అయితే 97 పరుగుల వద్ద  కేఎల్ రాహుల్ రూపంలో ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. ఆ  కాసేపటికే అభిషేక్ పొరెల్ కూడా ఔటయ్యాడు. దీంతో 106 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 

అనంతరం స్టబ్స్ (34), అక్షర్ (34) ఇద్దరు దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పెంచారు.  హసరంగ వేసిన 16 ఓవర్లో అక్షర్ పటేల్ తొలి మూడు బంతులకు వరుసగా 4, 4, 6 బాదేశాడు. ఈ ఓవర్‌లో 19 పరుగులు వచ్చాయి. ఇద్దరు 19 బంతుల్లో 41 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించగా వీరి జోడీని తీక్షణ విడదీశాడు. చివర్లో స్టబ్స్, అశుతోష్ శర్మ(11) దూకుడుగా ఆడటంతో ఢిల్లీ జట్టు 188 పరుగులు చేసింది. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2, మహీశ్‌ తీక్షణ, వానిందు హసరంగ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Advertisment
Advertisment
Advertisment