Ravindra Jadeja: రిటైర్మెంట్ ప్రకటించిన జడేజా!.. హగ్ చేసుకున్న కోహ్లీ?

భారత్ స్టార్ ఆల్రౌండర్ జడేజా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత రిటైర్ అవుతారని తెలుస్తోంది. కివీస్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో జడేజాని కోహ్లీ కౌగిలించుకొని ఎమోషనల్‌గా కనిపించాడు. దీంతో త్వరలోనే వన్డేల నుంచి జడ్డూ రిటైర్ అవుతారని అందరికీ క్లారిటీ వచ్చింది.

New Update
Ravindra Jadeja

Ravindra Jadeja

టీమిండియా స్టార్ ఆల్రౌండర్ జడేజా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత రిటైర్ అవుతారని నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దానికి ముఖ్య కారణం కూడా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం కివీస్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో జడేజా తన స్పెల్ తర్వాత కాస్త ఎమోషనల్ అయ్యాడు. వెంటనే ఆయన్ను విరాట్ కోహ్లీ కౌగిలించుకొని బాధగా కనిపించాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.

దీంతో ఇప్పటికే T20ల నుంచి తప్పుకున్న జడేజా ఇప్పుడు వన్డేల నుంచి కూడా రిటైర్ అవుతారని తెలుస్తోంది. కాగా ఇటీవల రవిచంద్రన్ అశ్విన్, స్మిత్‌ను హగ్ చేసుకున్న తర్వాత అతడు రిటైర్ అయ్యాడు. అదే సీన్ ఇప్పుడు ఇక్కడ కూడా కనిపించింది. దీంతో జడేజా కూడా ఈ మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. 

రోహిత్ రికార్డు

ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్స్ అత్యంత రసవత్తరంగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ ఫీల్డింగ్‌కు దిగింది. ఈ క్రమంలోనే రోహిత్ అరుదైన రికార్డును సమం చేశాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు టీమిండియా టాస్‌ ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో అతడు వన్డే క్రికెట్‌లో వరుసగా 12వ సారి టాస్‌ను కోల్పోయాడు.

ఈ తరుణంలోనే విండిస్ స్టార్ ప్లేయర్ బ్రయన్ లారా (1998-99) సీజన్‌లో వరుసగా 12 సార్లు టాస్ కోల్పోయిన రికార్డును రోహిత్ సమం చేశాడు. కాగా వన్డే ఫార్మేట్లలో టీమిండియా అదృష్టం వెక్కిరించడం ఇది 15వ సారి కావడం గమనార్హం. అయితే ఇలా టాస్ ఓడిపోవడం 2023 వన్డే వరల్డ్ కప్ నుంచి ప్రారంభమైంది. అప్పుడు అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియా vs భారత్ మధ్య పోరుతో ఈ పరంపర స్టార్ట్ అయింది.

అప్పటి నుంచి భారత్ వరుసగా టాస్ ఓడిపోతూ వస్తోంది. దీంతో ఈ లిస్ట్‌లో మొదటిగా లారా ఉండగా.. ఇప్పుడు అతడితో పాటే రోహిత్ చేరాడు. వీరిద్దరూ ఇప్పుడు మొదటి స్థానంలో ఉన్నారు. ఇదే జాబితాలో తర్వాతి వరుసలో నెదర్లాండ్స్ ప్లేయర్ పీటర్ బారెన్ ఉన్నాడు. అతడు వరుసగా 11 సార్లు టాస్ ఓడిపోయాడు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

టోక్యో ఒలింపిక్స్ విజేత మీరాబాయి చానును ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ కేంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె 49కేజీల విభాగంలో రజతం గెలుచుకున్నారు. వైస్ ఛైర్‌పర్సన్‌గా సతీస్ కుమార్ ఎన్నికయ్యారు.

New Update
_Mirabhai Chanu

టోక్యో ఒలింపిక్స్ విజేతమీరాబాయి చానుకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్ చైర్‌పర్సన్‌గా ఆమెను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మీరా భాయి చాను 49 కిలోల విభాగంలో రజత పతకం గెలుచుకున్నారు. చైర్‌పర్సన్‌గా నియమించినందుకు వెయిట్ లిఫ్టింగ్ కమిషన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. తన తోటి వెయిట్‌లిఫ్టర్ల వాయిస్ వినిపించేందుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం ఆమెకు చాలా గర్వకారణమని అన్నారు. అని టోక్యో పతక విజేత మీరాబాయి ఒక ప్రకటనలో తెలిపారు.

మీరాబాయి రెండుసార్లు 2018, 2022 కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతక విజేత. 2017లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని, 2022లో రజతాన్ని గెలుచుకుంది. మీరాబాయి కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు, ఒక రజతాన్ని గెలుచుకుంది. ఆమెతోపాటు కమీషన్ వైస్ ఛైర్‌పర్సన్‌గా సతీస్ కుమార్ ఎన్నికయ్యారు. ఆయన రెండుసార్లు కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేత. వీరిద్దరి పదవీకాలం నాలుగేళ్ల పాటు కొనసాగుతుంది. అథ్లెట్లు, పాలకమండలి మధ్య వారధిగా ఈ వెయిట్ లిఫ్టర్లు పనిచేయనున్నారు. 

#Mirabhai Chanu #Weightlifting Federation #chairperson #Weightlifter
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు