MI vs CSK: ముంబైను వణికించిన రూ. 10కోట్ల బౌలర్.. చెన్నై టార్గెట్ 156

చిదంబరం స్టేడియం వేదికగా  చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతోన్న ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టీమ్ తడబడింది. 20 ఓవర్లకు గానూ 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.

author-image
By Krishna
New Update
noor ahamad

చిదంబరం స్టేడియం వేదికగా  చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతోన్న ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టీమ్ తడబడింది. 20 ఓవర్లకు గానూ 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టుకు ఊహించని షాక్‌ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు రోహిత్‌ శర్మ డకౌట్ గా వెనుదిరిగాడు. ఖలీల్‌ అహ్మద్‌ వేసిన మొదటి ఓవర్ నాలుగో బంతికి రోహిత్‌ శర్మ ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగాడు. ఆ కాసేపటికే ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లోనే మరో ఓపెనర్ రికెల్టన్‌ (13), అశ్విన్‌ బౌలింగ్‌లో విల్ జాక్స్‌ (11) త్వరత్వరగానే ఔట్‌ అయ్యారు.

మూడు కీలక వికెట్లు కోల్పోవడంతో

వెంటవెంటనే మూడు కీలక వికెట్లు కోల్పోవడంతో కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌ (29), తిలక్‌ వర్మ (31)  ఆచితూచి ఆడుతూ జట్టు స్కోర్ ను 7 ఓవర్లలో స్కోర్‌ 60 దాటించారు.  అయితే నూర్‌అహ్మద్‌ బౌలింగ్‌లో ముందుకు వచ్చి ఆడే ప్రయత్నం చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌ ..  ధోనీకి అడ్డంగా దొరికిపోయాడు. ఇక తరువాత రాబిన్‌ మింజ్‌ (3), తిలక్‌ వర్మ, నమన్‌ ధిర్‌ (17), మిచెల్ శాంట్నర్ (11) తక్కువ  పరుగులకే వెనుదిరిగారు. చివర్లో దీపక్ చాహర్ (28) మెరుపులు మెరిపించడంతో. ముంబై జట్టు155 పరుగులు అయిన చేయగలిగింది.  చెన్నై బౌలర్లలో నూర్‌అహ్మద్‌ నాలుగు, ఖలీల్‌ అహ్మద్‌ మూడు, అశ్విన్‌, నాథన్ ఎల్లిస్ తలో వికెట్ తీశారు.  

Also read :  IPLలో ఆంధ్రా రోయ్యల వ్యాపారి కొడుకు.. ఎవరీ సత్యనారాయణరాజు?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

KKR Vs LSG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా.. దంచికొడుతున్న లఖ్‌నవూ బ్యాటర్స్!

IPL 2025 సీజన్ 18లో భాగంగా నేడు KKR Vs LSG మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. లఖ్‌నవూ బ్యాటర్లు మార్ష్, మార్కరమ్ ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నారు. 

New Update
ipl 2025lsg vs kkr

ipl 2025lsg vs kkr Photograph: (ipl 2025lsg vs kkr)

IPL 2025: IPL 2025 సీజన్ 18లో భాగంగా నేడు KKR Vs LSG మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. లఖ్‌నవూ బ్యాటర్లు మార్ష్, మార్కరమ్ ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నారు. 

తుది జట్లు..

KKR: అజింక్య రహానే (కెప్టెన్‌), క్వింటన్‌ డికాక్‌ (వికెట్‌ కీపర్‌), సునీల్‌ నరైన్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, రింకు సింగ్‌, అండ్రీ రస్సెల్‌, రమణ్‌దీప్‌ సింగ్‌, హర్షిత్‌రాణా, వైభవ్‌ అరోరా, స్పెన్సర్‌ జాన్సన్‌, వరుణ్‌ చక్రవర్తి.

LSG: రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌, కెప్టెన్‌), మిచెల్‌ మార్ష్‌, ఐడెన్‌ మార్కమ్‌, నికోలస్‌ పూరన్‌, ఆయుష్‌ బదోనీ, డేవిడ్‌ మిల్లర్‌, అబ్దుల్‌ సమద్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఆకాశ్‌ దీప్‌, అవేశ్‌ ఖాన్‌, దిగ్వేశ్‌ సింగ్‌ రాఠీ. 

ఇక టాస్ అనంతరం ముందుగా బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే.. పిచ్‌ చాలా బాగుంది. బౌండరీ చిన్నగా ఉంది. అందుకే మేం మొదట బౌలింగ్‌ చేయాలనుకున్నాం. మొయిన్‌ అలీ స్థానంలో స్పెన్సర్‌ జాన్సన్‌ను తీసుకున్నామని చెప్పాడు. ఇక రిషబ్‌ పంత్‌ మాట్లాడుతూ.. చాలా సంతోషంగా ఉందని చెప్పలేను. మేం గతం గురించి ఆలోచించడం లేదు. టీమ్‌గా మేం విజయం సాధిస్తున్నప్పుడు కెప్టెన్‌గా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మా జట్టులో ఎలాంటి మార్పులు లేవని చెప్పాడు. 

 

Advertisment
Advertisment
Advertisment