పంత్ దెబ్బకు ఐపీఎల్ వేలం రికార్డ్స్ బద్ధలు.. రూ.30 కోట్లకు!

ఐపీఎల్ 2025 మెగా వేలంలో రికార్డులు బద్ధలు కాబోతున్నట్లు తెలుస్తోంది. భారత ఆటగాళ్లు పంత్, శ్రేయస్‌, కేఎల్‌ రాహుల్‌కు భారీ డిమాండ్ ఉంది. ముఖ్యంగా రిషబ్ పంత్ రూ. 25 నుంచి రూ. 30 కోట్లు పలికే అవకాశం ఉందని సురేష్ రైనా చెప్పారు. 

New Update
eeree

IPL 2025: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ 2025 మెగా వేలంలో రికార్డులు బద్ధలు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఆది, సోమవారాల్లో ఈ మెగా వేలం జరగనుండగా.. 577 మంది ఆటగాళ్లు పోటీలో నిలవగా 210 ప్లేయర్స్ కోసం 10 ఫ్రాంఛైజీలు పోటీపడనున్నాయి. భారత ఆటగాళ్లు 367, వీదేశీ ప్లేయర్స్ 210 మంది ఉన్నారు. ఇక కనీస ధర రూ.2 కోట్లుగా ఉన్న జాబితాలో 81 మంది ఆటగాళ్లుండగా.. పంత్, శ్రేయస్‌ అయ్యర్, కేఎల్‌ రాహుల్‌ వంటి కెప్టెన్లకు భారీ డిమాండ్ ఉంది.

పంత్ కోసం పోటీ.. 

అయితే సీజన్-18 మెగా వేలంలో రిషబ్ పంత్ రికార్డు ధరకు అమ్ముడుపోయే అవకాశం ఉందని మాజీలు చెబుతున్నారు. పంత్  25 నుంచి 30 కోట్లు పలికే అవకాశం ఉందని సురేశ్ రైనా జోస్యం చెప్పాడు. అయితే పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున ఆడడానికి ఇష్టపడకపోవడంతో కొత్త ఫ్రాంఛైజీ భారీ ధర పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. నిజంగా పంత్ 30 కోట్లు పలికితే భారత తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్నాడు. ముంబై దగ్గర 45 కోట్లు, చెన్నై దగ్గర 55 కోట్లు ఉండటంతో పంతో కోసం ఈ రెండు పెద్దగా పోటీ పడకపోవచ్చు. పంత్ కోసం పంజాబ్‌ కింగ్స్, బెంగళూరు పోటీ పడే అవకాశ ఉంది. 

ఇది కూడా చదవండి: పవన్ పై కేసు పెట్టిన దివ్వెల మాధురి.. ఏ క్షణమైనా అరెస్టు!?

ఇక ఫ్రాంఛైజీలను ఆకర్షించే జాబితాలో అర్ష్‌దీప్, కేఎల్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్‌ ఉండగా అర్ష్‌దీప్‌ సింగ్‌ కోసం ఫ్రాంఛైజీలు భారీగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఇక 2025 ఐపీఎల్‌ మార్చి 14న మొదలై మే 25న ఫైనల్‌ మ్యాచ్ తో ముగియనుంది. 

ఇది కూడా చదవండి: Samantha: చైతూ కోసం సమంత కాస్ట్లీ గిఫ్టులు.. అవేంటో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CSK Vs SRH: చెన్నైతో మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్

ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఇవాళ సీఎస్కే vs ఎస్‌ఆర్‌హెచ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగానే టాస్‌ గెలిచిన SRH జట్టు.. బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో CSKజట్టు బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ రెండు జట్లు పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.

New Update
CSK Vs SRH

CSK Vs SRH Photograph: (CSK Vs SRH)

ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఇవాళ సీఎస్కే vs ఎస్‌ఆర్‌హెచ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగానే టాస్‌ గెలిచిన SRH జట్టు.. బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో CSK జట్టు బ్యాటింగ్‌కు దిగనుంది. రెండు జట్లు పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాయి. వరుసగా పరాభవాలతో రెండు జట్లలోనూ ఆత్మవిశ్వాసం లోపించింది. ఆరేసి ఓటములు, రెండేసి విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నాయి. 

ధోనీ 400వ టీ20 మ్యాచ్‌

ఇదిలా ఉంటే సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఇది 400వ టీ20 మ్యాచ్‌. అతడు తన కెరీర్‌లో 400వ టీ20 మ్యాచ్‌‌ను SRHతో ఆడనున్నాడు. దీంతో భారత్‌ నుంచి నాలుగో ప్లేయర్‌గా ధోనీ నిలిచాడు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా 24వ ఆటగాడిగా ఉన్నాడు. ధోనీ కంటే ముందు మరో ముగ్గురు ఉన్నారు. వారు.. రోహిత్ శర్మ 456 మ్యాచ్‌లు, దినేశ్‌ కార్తిక్ 412 మ్యాచ్‌లు, విరాట్ కోహ్లీ 408 మ్యాచ్‌లు ఆడారు. ఆ తర్వాత స్థానంలో ధోనీ ఈ ఘనత అందుకొన్నారు. ధోనీ ఇప్పటివరకు 399 మ్యాచులు ఆడాడు. అందులో మొత్తం 7,566 పరుగులు చేశాడు.

telugu-news | IPL 2025 | latest-telugu-news | CSK Vs SRH

Advertisment
Advertisment
Advertisment