ఆర్సీబీపై ఓటమి.. జీర్ణించుకోలేక టీవీ పగలగొట్టిన ధోనీ!

ఐపీఎల్‌ 2024లో ఆర్సీబీ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేక ధోనీ కోపంతో టీవీ పగలగొట్టినట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. చెన్నైప్లే ఆఫ్స్ నుంచి తప్పుకోవడంతో తట్టుకోలేక ఆర్సీబీ ఆటగాళ్లతో ధోనీ కరచాలనం చేయలేదని హర్భజన్ చెప్పినట్లు ఓ జర్నలిస్ట్ వీడియో పోస్ట్ చేశాడు.

New Update
drererer

MS Dhoni: 2024 ఐపీఎల్‌లో ఆర్సీబీపై చేతిలో ఓటమిని జీర్ణించుకోలేక ధోనీ కోపంతో టీవీ పగలగొట్టినట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఆ మ్యాచ్ లో ధోనీ ఆర్సీబీ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదనే విషయం అందరికీ తెలిసిందే. కాగా గ్రౌండ్ నుంచి గదిలోకి వెళ్లిన ధోనీ ఆవేశంతో రగిలిపోయినట్లు పుకార్లు పుట్టుకు రాగా.. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. 

ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు అర్హత..

ఈ మేరకు మే 18న చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తమ చివరి లీగ్ మ్యాచ్‌ ఓడిపోయింది. ఆర్సీబీ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది ఈ ఓటమితో ప్లే ఆఫ్స్ నుంచి చెన్నై తప్పుకోగా ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ధోనీ 13 బంతుల్లో 25 పరుగులు చేసినా విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. 

ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు..

అయితే మ్యాచ్ తర్వాత హర్భజన్ సింగ్ తో మాట్లాడుతున్నప్పుడు తనకు ఈ విషయం తెలిసిందని ఓ జర్నలిస్టు సోషల్ మీడియాలో వెల్లడించారు. 'నేను ఒక ప్రత్యేకమైన స్కూప్ గురించి తెలుసుకున్నా. నేను భజ్జీ పాజీని ఎందుకు ధోని ఆర్సీబీ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదని అడిగాను. దీంతో ధోనీ కరచాలనం చేయడమే కాదు ఓ టీవీని కూడా పగలగొట్టాడు.  తిరుగు ప్రయాణంలో కూడా ప్రతిసారి వస్తువులను పిడిగుద్దులు గుద్దాడు. టోర్నీనుంచి నిష్రమించినందుకు ఆయన చాలా కోపంగా ఉన్నాడు' అని చెప్పినట్లు ఓ వీడియోలో వివరించాడు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మొరిగే కుక్కలన్నీ ధోనీ ఆటను చూశాయనుకుంటున్నా: తమన్ పోస్ట్!

పంజాబ్, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ధోనీ ఆటపై మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘ఆయనపై మొరుగుతున్న కుక్కలన్నీ ఆ దిగ్గజం ఆటను చూశాయని భావిస్తున్నా’ అని ఒక పోస్ట్ పెట్టారు.

New Update
dhoni thaman

dhoni thaman

పంజాబ్, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ధోనీ ఆటపై మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘ఆయనపై మొరుగుతున్న కుక్కలన్నీ ఆ దిగ్గజం ఆటను చూశాయని భావిస్తున్నా’ అని ఒక పోస్ట్ పెట్టారు. దాని కింద విమర్శలు వస్తుండటంతో సమాధానంగా మరో ట్వీట్ చేశారు. ‘ఇది సీఎస్కే గెలుపు గురించి కాదు. దేశానికి ఎన్నో సిరీస్‌లు గెలిపించిన మనిషి గురించి. మనతో ఆ ట్రోఫీలు ఉన్నాయంటే ఆ ఒక్కడి వల్లే’ అని పోస్టులో తమన్ వెల్లడించాడు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ధోనీ 12 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్సులు, ఓ ఫోర్ ఉంది.  

ఉర్రూతలూగించిన ధోనీ 

అయితే ఈ మ్యాచ్ లో చెన్నై ఓడిపోగా  18 రన్స్ తేడాతో పంజాబ్ విజయం సాధించింది. 220 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో చెన్నై 201-5 స్కోరుకు పరిమితమైంది. ధోనీ(27) చివరి వరకూ పోరాడినా ఆ జట్టుకు మరో ఓటమి తప్పలేదు. అయితే ఉన్నంత సేపు తన అభిమానుల్ని ఉర్రూతలూగించారు. ధోనీ ఔటైనప్పుడు ఓ అభిమాని భోరున విలపించింది. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. చెన్నై ఆటగాళ్లలో కాన్వే (69), దూబే (42), రచిన్ (36) రన్స్ చేశారు. అంతకుముందు పంజాబ్ కింగ్స్ ప్లేయర్ ప్రియాంశ్ ఆర్య (103) సెంచరీతో అదరగొట్టారు. కాగా ఈ సీజన్‌లో పంజాబ్ కు ఇది మూడో విజయం. చెన్నైకు నాలుగో ఓటమి. 

Also Read : Tamilisai Soundararajan : తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం!

#telugu-news #sports #Chennai Super Kings #punjab-kings #PBKS vs CSK
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు