IML 2025 Final: నేడే ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్.. భారత్‌తో తలపడనున్న జట్టు అదే

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్ నేడే జరగనుంది. ఈ ఫైనల్‌లో భారత్, వెస్టిండీస్ తలపడనున్నాయి. క్రికెట్ లెజెండరీ సచిన్ టెండూల్కర్‌ ఈ ఇండియా మాస్టర్స్‌ లీగ్‌ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.  

New Update
IML Final 2025

IML Final 2025 Photograph: (IML Final 2025)

నేడే ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML) 2025లో ఫైనల్ మ్యాచ్ నేడు షాహిద్ వీర్ నారాయణ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఈ ఫైనల్స్‌కి మొదట టీమిండియా చేరగా, తర్వాత వెస్టిండీస్ చేరింది. ఫైనల్‌లో భారత్, వెస్టిండీస్ తలపడనున్నాయి. మొదటి సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా గెలిచి ఫైనల్‌లో అడుగుపెట్టింది. రెండో సెమీ ఫైనల్‌లో శ్రీలకంపై వెస్టిండీస్ మాస్టర్స్ అద్భుతమైన ప్రదర్శన చేసి గెలిచింది.క్రికెట్ లెజెండరీ సచిన్ టెండూల్కర్‌ ఈ ఇండియా మాస్టర్స్‌ లీగ్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.  

ఇది కూడా చూడండి: Coolie OTT Rights: కోట్లు కొల్లగొడుతున్న 'కూలీ'.. ఇది కదా రజిని రేంజ్..!

ఇండియా మాస్టర్స్ జట్టు

సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), నమన ఓజా (వికెట్ కీపర్), ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, సౌరభ్ తివారీ, గుర్కీరత్ సింగ్ మాన్, యూసుఫ్ పఠాన్, స్టువర్ట్ బిన్నీ, అభిమన్యు మిథున్, రాహుల్ శర్మ, వినయ్ కుమార్, అంబాటి రాయుడు, యువరాజ్ సింగ్, ధవల్ కులకర్ణి, సురేశ్ రైనా, షాబాజ్ నదీమ్.

ఇది కూడా చూడండి: PAK Vs BLA: రెండు ముక్కలుగా పాక్.. మరో దేశంగా అవతరించనున్న బలూచ్!

వెస్టిండీస్ మాస్టర్స్ జట్టు
బ్రియాన్ లారా (కెప్టెన్), క్రిస్ గేల్, కిర్క్ ఎడ్వర్డ్స్, లెండల్ సిమ్మన్స్, నర్సింగ్ డేవ్‌నారైన్, అశ్లే నర్స్, డ్వేన్ స్మిత్, ఛాడ్‌విక్ వాల్టన్, దినేష్ రామ్దీన్, విలియమ్స్ పర్కిన్స్, ఫిడెల్ ఎడ్వర్డ్స్, జెరోమ్ టేలర్, రవి రంపాల్, సులేమాన్ బెన్, టీనో బెస్ట్.

ఇది కూడా చూడండి: Telangana Budget: తెలంగాణలో భారీ బడ్జెట్.. ఈసారి ఎన్ని లక్షల కోట్లంటే ?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PBK VS RR: పంజాబ్ కింగ్స్ ను బోల్తా కొట్టించిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2025లో ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్ఆర్ ఇచ్చిన టార్గెట్ ను ఛేజ్ చేయలేక పంజాబ్ బోల్తా పడింది. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

PBK VS RR

పంజాబ్ కింగ్స్ కు షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. సంజూ శాంసన్ కెప్టెన్సీలో విజయాన్ని నమోదు చేసుకుంది. పంజాబ్ కు 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ టార్గెట్ ను ఛేదించలేక కింగ్స్ బొక్క బోర్లా పడ్డారు. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయి 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ బ్యాటర్ నేహాల్ వధేరా 62 పరుగులతో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇతని తర్వాత మాక్స్ వెల్ ఒక్కడే 30 పరుగులు చేసాడు. నేహాల్ , మ్యాక్స్ వెల్ చాలా సేపు క్రీజులో ఉండి జట్టు విజయానికి పాటు పడ్డారు. కానీ మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం డబుల్ డిజిట్ కూడా కొట్టకపోవడంతో మ్యాచ్ ను చేజార్చుకోవాల్సి వచ్చింది.  కింగ్స్ బ్యాటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచే వికెట్లను పోగొట్టుకుంటూ వచ్చింది. 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అంతకు ముందు మ్యాచ్ లో బాగా ఆడిన ప్రభ్ మన్ సింగ్ ఎవరూ కూడా ఎక్కువసేపు ఉండలేదు. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3, సందీప్‌ శర్మ 2, మహీశ్ తీక్షణ 2, కార్తికేయ,  హసరంగ చెరో వికెట్‌ తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్..

చంఢీఘడ్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జైస్వాల్ 67తో స్కోర్‌తో అదరగొట్టాడు. చివర్లో రియాన్ పరాగ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 43 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ సంజు శాంసన్ కూడా 38 పరుగులతో రాణించాడు. నితీశ్ రాణా 12, హెట్ మయర్ 20, ధ్రువ్ జురెల్ 13 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.  ఫెర్గూసన్ 2, మార్కో జన్‌సెన్, అర్ష్‌దీప్‌ తలొ వికెట్ తీశాడు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | match | cricket

Also Read: RC 16: రామ్ చరణ్ రోరింగ్ టుమారో..పెద్ది గ్లింప్స్ రిలీజ్

 

Advertisment
Advertisment
Advertisment