46 పరుగులకే భారత్ ఆలౌట్

గురువారం ఎం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాను న్యూజిలాండ్ కేవలం 46 పరుగులకే ఆలౌట్ చేసింది. కోహ్లీ, సర్ఫరాజ్, రాహుల్, జడేజా, అశ్విన్, డకౌట్ కాగా.. రిషబ్ పంత్ 20, జైస్వాల్ 13, సిరాజ్ 4 పరుగులు మాత్రమే సాధించారు.

New Update
india all out

India vs New Zealand: ఇండియా - న్యూజిలాండ్ మధ్య తొలి టెస్ట్ ఇవాళ అట్టహాసంగా ప్రారంభమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ నిర్ణయం విఫలం అయింది. ఈ మొదటి టెస్ట్ లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. స్వదేశంలో భారత్ ను ఎవరూ అడ్డుకోలేరు అనేవాళ్లకు ఇదొక గట్టి దెబ్బ అనే చెప్పాలి. బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో జరుగుతోన్న తొలి టెస్ట్ లో న్యూజిలాండ్ బౌలర్లు.. టీమిండియాను గట్టి దెబ్బ కొట్టారు.

ఇది కూడా చదవండిః గ్రూప్-1 అభ్యర్థులకు సర్కార్ పిలుపు

 46 పరుగులకే ఆలౌట్

టీమిండియా స్టార్ బ్యాటర్లను సైతం కట్టడి చేశారు. పరుగులు కాదు కదా.. కనీసం బంతిని కూడా టచ్ చేయనివ్వకుండా బంబేలెత్తించారు. దీంతో భారత్ స్టార్ బ్యాటర్లు సైతం తడబడ్డారు. ఏకంగా న్యూజిలాండ్ బౌలర్ల దాటికి ఐదుగురు డకౌట్ అయ్యారు. అందులో నలుగురు స్టార్ బ్యాటర్లు కావడం విశేషం. వీరితో పాటు మిగతా బ్యాటర్లు కూడా తొందరగా విఫలమవడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 31.2 ఓవర్లలో 46 పరుగులకే ఆలౌట్ అయింది. 

ఇది కూడా చదవండిః మత్తు స్ప్రే చల్లి, న్యూడ్ వీడియోలు తీసి.. జాయ్‌ పై మరో కేసు నమోదు

ఎవరెన్ని రన్స్ చేశారు

న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో రోహిత్ శర్మ కేవలం 2 పరుగులకే ఔట్ అయ్యాడు. ఇక విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తమ ఖాతా తెరవకుండానే డకౌట్ తో వెనుదిరిగారు. మిగిలిన వారిలో యశ్వస్వి జైశ్వాల్ -13, పంత్ -20, కుల్దీప్ యాదవ్ -2, బుమ్రా -1, సిరాజ్ -4 పరుగులు చేశారు.

ఇది కూడా చదవండిః టీడీపీ నేత రాసలీలలు.. రాత్రికి వస్తేనే పింఛన్లు, ఇంటి స్థలాలు

మొత్తంగా టీమిండియా 46 పరుగులకే ఆల్ ఔట్ అయింది. అయితే న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ చెలరేగిపోయాడు. మ్యాట్ హెన్రీ- 5/15, విలియమ్ ఓరౌర్కీ - 4/22, టిమ్ సౌథీ -1/8లతో దుమ్ము దులిపేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH VS MI: మళ్ళీ హైదరాబాద్ ఓటమి..వరుసగా ముంబైకు నాలుగో విజయం

సొంత గ్రౌండ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ మళ్ళీ ఓడిపోయింది. ఉప్పల్ జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ పై ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో అలవోగ్గా విజయం సాధించింది.  144 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలో పూర్తి చేసింది. 

New Update
ipl

SRH VS MI

ముంబై బ్యాటర్లు మరోసారి చెలరేగిపోయారు. ఈరోజు హైదరాబాద్ ఉప్పల్ లో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ను మట్టికరిపించారు. హైదరాబాద్ ఇచ్చిన 144 పరుగుల టార్గెట్ ను 7 వికెట్ల తేడాతో కొట్టి విజయం సాధించారు.  హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫుల్ ఫామ్ లోని వచ్చేశాడు. ఈ రోజు హైదరాబాద్ సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో 46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో చెలరేగిపోయాడు. 70 పరుగులు చేసి వరుసగా రెండో అర్దసెంచరీ సాధించాడు. అంతేకాదు ఐపీఎల్ లో అత్యతం వేగంగా 20 వేల పరుగులను పూర్తి చేసుకున్న బ్యాటర్ గా కూడా రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే సూర్య కుమార్ యావ్ కూడా  19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 పరుగులు చేసి దూకుడుగా ఆడాడు. రికెల్‌టన్ (11), విల్ జాక్స్ (22) పరుగులు చేశారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో జయదేవ్‌ ఉనద్కత్‌, జీషాన్ అన్సారీ, ఎషాన్ మలింగ తలో వికెట్‌ తీశారు. దీంతో ముంబై ఇంకా 26 బాల్స్ మిగిలుండానే హైదారబాద్ ను చిత్తు చేసింది.  దీంతో ముంబై వరుసగా నాలుగో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు ఓవరాల్ గా ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ లను గెలచి నెట్ రన్ రేట్ ను మెరుగుపరుచుకుని పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. 

చేతులెత్తేసిన హైదరాబాద్..

ముంబై ఇండియన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చేతులెత్తేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన SRH జట్టు ప్రారంభం నుంచే తడబడింది. ఓపెనర్లుగా క్రీజ్‌లోకి వచ్చిన ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ దూకుడుగా ఆడే క్రమంలో పెవిలియన్‌కు చేరారు. తొలి ఓవర్‌కు 2 పరుగులు చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ 2 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయింది. ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్‌ డకౌట్‌ అయ్యాడు. వెను వెంటనే 2 ఓవర్1వ బంతికి సన్‌రైజర్స్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఇషాన్‌ కిషన్‌ (1) ఔట్‌అయ్యాడు. దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ రికెల్‌టన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఓవర్‌లోనే మరో వికెట్ డౌన్ అయింది. 3 ఓవర్ 3వ బంతికి  అభిషేక్‌ శర్మ (8) ఔటయ్యాడు. ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఇలా 4 ఓవర్లకు 13/3 స్కోర్‌ చేసింది. ఆ తరువాత కూడా వరుసగా వికెట్లను కోల్పోతూ కనీసం వంద అయినా స్కోర్ చేస్తారా అన్న పరిస్థితుల్లోకి వెళ్ళింది. కానీ క్లాసెన్ క్లాసిక్ బ్యాటింగ్‌తో అదరగొట్టేశాడు. 30 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. నిలకడగా ఆడిన క్లాసెన్‌ (71) ఔట్‌ అయ్యాడు. దీంతో హైదరాబాద్ జట్టు ఆరో వికెట్‌ కోల్పోయింది. వెను వెంటనే ఏడో వికెట్‌ డౌన్‌ అయింది. అభినవ్‌ (43), కమిన్స్ (1) ఔట్‌ అయ్యారు. దీంతో 20 ఓవర్లకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. 

today-latest-news-in-telugu | IPL 2025 | srh-vs-mi | match

Also Read: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన్

Advertisment
Advertisment
Advertisment