Ind Vs Nz: టెస్టుల్లో మరో చెత్త రికార్డ్ క్రియేట్ చేసి భారత్!

టెస్టుల్లో భారత్ మరో చెత్త రికార్డు క్రియేట్ చేసింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టుల్లో 46 పరుగులకే ఆలౌటైంది. ఓవరాల్‌గా ఇండియాకు ఇది మూడో అత్యల్ప స్కోరు. గతలో ఆస్ట్రేలియాపై 36, ఇంగ్లండ్‌పై 32 పరుగులకే కుప్పకూలింది. 

New Update
dtetrerse

Ind Vs Nz: టెస్టుల్లో భారత్ మరో చెత్త రికార్డు క్రియేట్ చేసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టుల్లో అత్యల్ప స్కోర్ కు ఆలౌటైంది. న్యూజీలాండ్ బౌలర్ల దెబ్బకు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 31.2 ఓవర్లలోనే 46 పరుగులకే కుప్పకూలింది. దీంతో 92 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా అత్యల్ప స్కోరు చేసింది. అయితే గతంలో స్వదేశంలో విండీస్‌పై (1987) 75 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక వీదేశాల్లో ఇంతకంటే తక్కువ స్కోర్ అడిలైడ్‌లో ఆసీస్‌ చేతిలో 36 రన్స్‌, లార్డ్స్‌లో ఇంగ్లండ్‌పై 32 పరుగులకే కుప్పకూలింది. ఓవరాల్‌గా ఇండియాకు ఇది మూడో అత్యల్ప స్కోరు. 

ఇది కూడా చదవండి: BREAKING: గ్రూప్-1 అభ్యర్థులకు సర్కార్ పిలుపు

ఇది కూడా చదవండి: రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్!

ఇక 1969లో హైదరాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ లో 27 పరుగులకే టీమ్ఇండియా 6 వికెట్లు నష్టపోయింది. ఓవరాల్‌గా భారత్‌ అత్యంత తక్కువ స్కోరుకే 6 వికెట్లను కోల్పోవడం ఇది 6వసారి. స్వదేశంలో 10 పరుగుల్లోపే భారత్ మూడు వికెట్లను నష్టపోవడం ఇది 3వసారి. న్యూజిలాండ్ పైనే ఈ చెత్త రికార్డును నమోదు చేసింది భారత్. భార‌త బ్యాట‌ర్లలో రిష‌బ్ పంత్‌(20) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అయిదుగురు బ్యాట‌ర్లు డ‌కౌట్ అయ్యారు. కోహ్లీ, స‌ర్ఫరాజ్ ఖాన్‌, జ‌డేజా, కేఎల్ రాహుల్‌, అశ్విన్‌ ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్‌ చేరారు.  కివీస్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ 5 వికెట్లు, ఓరౌర్కీ నాలుగు వికెట్లు పడగొట్టగా టిమ్‌ సౌథీ ఓ వికెట్‌ తీశాడు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో కడియం లొల్లి.. తలపట్టుకున్న పెద్దలు!

ఇది కూడా చదవండి: Caste Census: కులగణనకు రంగం సిద్ధం.. 10-15 రోజుల్లోనే పూర్తి

భారత్ అత్యల్ప స్కోర్లు:
36 vs ఆస్ట్రేలియా (అడిలైడ్‌) 2020
42 vs ఇంగ్లండ్‌ (లార్డ్స్‌) 1974
46 vs న్యూజిలాండ్ (బెంగళూరు) 2024
58 vs ఆస్ట్రేలియా (బ్రిస్బేన్‌) 1947
58 vs ఇంగ్లండ్ (మాంచెస్టర్‌) 1952

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PBKS VS CSK: పంజాబ్ విజయం..ఇక చెన్నై ఇంటికే..

ఐపీఎల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో చెన్నై పంజాబ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ కిది వరుసగా మూడో విజయం కాగా..సీఎస్కేకు వరుసగా నాలుగో పరాజయం.

New Update
ipl

PBK VS CSK

చెన్నై కథ ఇక ముగినట్లే. వరుసగా నాలుగు మ్యాచ్ లు ఓడిపోయి పాయింట్ల పట్టికలో అడుగుకు చేరిన చెన్నై సూపర్ కింగ్స్ కు ప్లే ఆప్స్ ఆశలు మూసుకుపోయినట్టే. ఈరోజు పంజాబ్ తో జరిగిన పోరులో చెన్నై 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు భారీ స్కోరు చేసింది. ఈ టార్గెట్ తో బరిలోకి దిగిన  చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. సీఎస్కే బ్యాటర్లలో డెవాన్‌ కాన్వే  49 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69 పరుగులు చేసి రిటైర్డ్‌ ఔట్‌ అయ్యాడు. తరువా శివమ్‌ దూబె  27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42, రచిన్‌ రవీంద్ర  23 బంతుల్లో 6 ఫోర్లతో 36, ధోనీ  12 బంతుల్లో ఒక ఫోర్‌, 3 సిక్స్‌లతో 27 పరుగులు చేసి రాణించారు. అయితే నిర్ణీ ఓవర్లలో టర్గెట్ ను మాత్రం చేరుకోలేకపోయారు.  పంజాబ్‌ బౌలర్లలో ఫెర్గూసన్‌ 2, మాక్స్‌వెల్‌, యశ్‌ ఠాకూర్‌ ఒక్కో వికెట్‌ తీశారు. చెన్నైకి ఇది వరుసగా ఇది నాలుగో ఓటమి.

ప్రియాంశ్ ఆర్య సెంచరీ..

అంతకు ముందు పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 219/6 రన్స్ చేసింది. పంజాబ్ ఒపెనర్ ప్రియాన్ష్ ఆర్య 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు. చివరల్లో శశాంక్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మాద్ 2, అశ్విన్ 2, ముఖేష్‌ 1, నూర్ 1 వికెట్ పడగొట్టారు. ముల్లనూర్ వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ సార‌థి శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ బ్యాటర్లు మొదటి ఓవర్ నుంచే దూకుడుగా ఆడారు. ఒపెనర్ ప్రియాన్ష్ ఆర్య 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 9 సిక్సులు, 7 ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. మరోవైపు చెన్నై బౌలర్లు సైతం వరుస వికెట్లు పడగొట్టారు. ప్రియాన్ష్ మినహా ఏ బ్యాటర్ ఎక్కవ సేపు క్రీజులో నిలవలేకపోయారు. చివరల్లో శశాంక్ 52 మెరుపులు మెరిపించాడు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | csk | match | punjab 

Also Read: Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్

Advertisment
Advertisment
Advertisment