ఛాంపియన్స్‌ ట్రోఫీపై వీడిన సస్పెన్స్.. ఐసీసీ అధికారిక ప్రకటన రిలీజ్!

2025 ఛాంపియన్స్‌ ట్రోఫీపై సస్పెన్స్ వీడింది. హైబ్రిడ్ మోడల్‌లోనే మెగా టోర్నీ నిర్వహించబోతున్నట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. టీమ్‌ఇండియా పాకిస్థాన్‌కు వెళ్లట్లేదని, 2024-27 భారత్, పాక్ ఐసీసీ ఈవెంట్లన్నీ హైబ్రిడ్ మోడల్‌లోనే జరుగుతాయని స్పష్టం చేసింది.

author-image
By srinivas
New Update
rerer wer

ee erers Photograph: (ereedfe)

Champions Trophy 2025: 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. హైబ్రిడ్ మోడల్‌లోనే మెగా టోర్నీ నిర్వహించబోతున్నట్లు ఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. టీమ్‌ఇండియా పాకిస్థాన్‌కు వెళ్లట్లేదని, 2024-27 భారత్, పాక్ ఐసీసీ ఈవెంట్లన్నీ హైబ్రిడ్ మోడల్‌లోనే జరుగుతాయని స్పష్టం చేసింది.

పాక్ లోనే 2028 వరల్డ్ కప్..

పీసీబీ, బీసీసీఐతో ఒప్పందం చేసుకున్న తర్వాత ఈ నిర్ణయం వెల్లడించినట్లు తెలిపింది. ఇక ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం భాతర్ తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు ఆడునున్నట్లు తెలిపింది. ఇండియా వేదికగా జరిగే 2025 మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌తోపాటు 2026 టీ20 ప్రపంచ కప్‌ హైబ్రిడ్ విధానంలోనే నిర్వహించబోతున్నట్లు అనౌన్స్ చేసింది. 2026 టీ20 వరల్డ్ కప్ కు భారత్, శ్రీలంక ఆతిథ్యమివ్వనుండగా.. పాక్‌ మ్యాచ్‌లు భారత్‌లో కాకుండా వేరే దేశంలో నిర్వహించబోతున్నట్లు వెల్లడించింది. ఇక 2028 మహిళల టీ20 వరల్డ్ కప్ పాక్ అథిత్యం ఇవ్వనున్నట్లు పేర్కొంది.  

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

టోక్యో ఒలింపిక్స్ విజేత మీరాబాయి చానును ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ కేంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె 49కేజీల విభాగంలో రజతం గెలుచుకున్నారు. వైస్ ఛైర్‌పర్సన్‌గా సతీస్ కుమార్ ఎన్నికయ్యారు.

New Update
_Mirabhai Chanu

టోక్యో ఒలింపిక్స్ విజేతమీరాబాయి చానుకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్ చైర్‌పర్సన్‌గా ఆమెను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మీరా భాయి చాను 49 కిలోల విభాగంలో రజత పతకం గెలుచుకున్నారు. చైర్‌పర్సన్‌గా నియమించినందుకు వెయిట్ లిఫ్టింగ్ కమిషన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. తన తోటి వెయిట్‌లిఫ్టర్ల వాయిస్ వినిపించేందుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం ఆమెకు చాలా గర్వకారణమని అన్నారు. అని టోక్యో పతక విజేత మీరాబాయి ఒక ప్రకటనలో తెలిపారు.

మీరాబాయి రెండుసార్లు 2018, 2022 కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతక విజేత. 2017లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని, 2022లో రజతాన్ని గెలుచుకుంది. మీరాబాయి కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు, ఒక రజతాన్ని గెలుచుకుంది. ఆమెతోపాటు కమీషన్ వైస్ ఛైర్‌పర్సన్‌గా సతీస్ కుమార్ ఎన్నికయ్యారు. ఆయన రెండుసార్లు కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేత. వీరిద్దరి పదవీకాలం నాలుగేళ్ల పాటు కొనసాగుతుంది. అథ్లెట్లు, పాలకమండలి మధ్య వారధిగా ఈ వెయిట్ లిఫ్టర్లు పనిచేయనున్నారు. 

#Mirabhai Chanu #Weightlifting Federation #chairperson #Weightlifter
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు