Harmanpreet Kaur : హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఫీట్.. రెండో క్రికెటర్గా రికార్డు

భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఫీట్ సాధించారు. ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న 35 ఏళ్ల  హర్మన్‌ప్రీత్ ..  టీ20ల్లో 8వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారత ప్లేయర్‌గా నిలిచారు. ఈమె కంటే ముందు స్మృతి మంధాన ఈ మైలురాయి అందుకున్నారు.

New Update
Harmanpreetkaur

భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఫీట్ సాధించారు. ప్రస్తుతం మహిళల ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న 35 ఏళ్ల  హర్మన్‌ప్రీత్ ..  టీ20ల్లో 8వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారత ప్లేయర్‌గా నిలిచారు. హర్మన్ కన్నా ముందు స్మృతి మంధాన ఈ మైలురాయి అందుకున్నారు. ఆమె ప్రస్తుతం 8 వేల349 పరుగులు చేసింది.

ఈ మైలురాయిని చేరుకోవడానికి హర్మన్‌ప్రీత్‌కు 37 పరుగులు అవసరం కాగా  ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో ఆ మైలురాయిని చేరుకుంది. కాగా తన  మహిళల ప్రీమియర్ లీగ్ కెరీర్‌లో హర్మన్‌ప్రీత్  ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడి 591 పరుగులు పరుగులు చేసింది. మొత్తంమీద, హర్మన్‌ప్రీత్ ఈ రికార్డును నమోదు చేసిన 6వ భారతీయ బ్యాట్స్‌మన్‌గా కూడా నిలిచింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరియు సురేష్ రైనా వంటి వారు ఇప్పటికే ఈ మైలురాయిని సాధించిన వారిలో ఉన్నారు.

 అత్యధిక టీ20 పరుగులు చేసిన భారత మహిళా క్రికెటర్లు

8349 - స్మృతి మంధాన

8005 - హర్మన్‌ప్రీత్ కౌర్

5826 - జెమిమా రోడ్రిగ్స్

4542 - షఫాలీ వర్మ

4329 - మిథాలీ రాజ్

3889 - దీప్తి శర్మ

ఇక ముంబైతో జరిగిన మ్యాచులో ఢిల్లీ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన  ముంబై జట్టు 19.1 ఓవర్లలోనే 164 పరుగులు చేయగలిగింది. నాట్ స్కైవర్-బ్రంట్ (80), హర్మన్‌ప్రీత్ కౌర్ (42) పరుగులు చేశారు.  క్యాపిటల్స్ తరఫున అన్నాబెల్ సదర్లాండ్ 34 పరుగులకు 3 వికెట్లు పడగొట్టి బౌలింగ్ లో రాణించింది.

165 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు ఆఖరి బంతికి అందుకుంది. చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా తొలి బంతికి నిక్కీ ప్రసాద్ ఫోర్ బాదారు. ఆ తర్వాతి 3 బంతులకు నాలుగు పరుగులు రాగా ఐదో బంతికి నిక్కీ ఔటయ్యారు. చివరి బంతికి అరుంధతి రెండు పరుగులు తీసి ఢిల్లీకి విజయాన్ని అందించారు. 

Also Read :  దారుణం.. అదనపు కట్నం తేవడం లేదని కోడలికి హెచ్‌ఐవి ఇంజెక్షన్ ఇచ్చి ..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CSK vs SRH : హర్షల్ పటేల్ దెబ్బకి చెన్నై విలవిల.. 154 పరుగులకు ఆలౌట్

ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో చెన్నై ఆలౌటైంది. 19.5 ఓవర్ల వద్ద 154 పరుగులకు పరిమితమైంది. బ్రెవిస్‌(42), ఆయుష్‌(30), దీపక్‌(22) జడేజా(21) ఫర్వాలేదనిపించారు.

New Update
harshal-patel

harshal-patel

ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఇవాళ 43వ మ్యాచ్ CSK VS SRH మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన సన్‌రైజర్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో క్రీజ్‌లోకి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ తడబడుతూ ఆడింది. మొత్తంగా తొలి ఇన్నింగ్స్ పూర్తి చేసుకుంది. 19.5 ఓవర్లకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ 154 పరుగులకు ఆలౌటైంది. దీంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ముందు 155 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.  

Also Read :  మాకు నీళ్లు ఆపితే మీ శ్వాస ఆపుతాం...మోదీకి హఫీజ్ వార్నింగ్!

Also Read :  ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!

CSK VS SRH

చెన్నై బ్యాటింగ్‌లో బ్రేవిస్‌ 42, ఆయుష్‌ మాత్రే 30 రాణించారు. దీపక్‌ హుడా 22, రవీంద్ర జడేజా 21 ఫర్వాలేదనిపించాడు. షేక్‌ రషీద్‌ 0, శ్యామ్‌ కరన్‌ 9, ధోనీ 6 విఫలమయ్యారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలింగ్‌లో హర్షల్‌ పటేల్‌ 4 వికెట్లతో చెలరేగిపోయాడు. అతడికి మరికొందరు బౌలర్లు తోడయ్యారు. ప్యాట్‌ కమిన్స్‌ 2, జయదేవ్‌ ఉనద్కత్‌ 2, మహ్మద్‌ షమి 1, కమిందు మెండిస్‌ 1 వికెట్‌ తీసుకున్నారు.

Also Read :  నారాయణ విద్యార్థి సూసైడ్.. సబ్జెక్టు ఫెయిల్ అయినందుకు ప్రిన్సిపాల్ వేధింపులు..

Also Read :  బీచ్‌లో బుసలు కొడుతున్న సుప్రిత.. హాట్ అందాలకు కుర్రకారు ఫిదా

 IPL 2025 | sunrisers-hyderabad | Chennai Super Kings

Advertisment
Advertisment
Advertisment