పెద్ద మెంటల్ నా కొడుకు.. యువీ శిష్యుడుపై నితీశ్ సంచలన పోస్ట్

వాంఖేడ్ వేదికగా జరిగిన ఐదో టీ20లో యూవీ శిష్యుడు అభిషేక్ శర్మ చెలరేగాడు. 54 బంతుల్లో 13 సిక్సులు, 7 ఫోర్లతో 135 పరుగులు చేశాడు. క్రికెటర్ నితీశ్ అభిషేక్‌ను ప్రశంసిస్తూ.. మెంటల్ నా కొడుకు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

New Update
Nitish post

Nitish post Photograph: (Nitish post)

ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 247 పరుగులతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ శిష్యుడు అభిషేక్ శర్మ 54 బంతుల్లో 13 సిక్సులు, 7 ఫోర్లతో 135 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. టీ20ల్లో ఒక ఇన్నింగ్సులో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు.

ఇది కూడా చూడండి: Horoscope Today:నేడు ఈ రాశివారికి అనుకున్నది ఒకటి..జరిగేది ఒకటి..సో జర భద్రం!

ఇది కూడా చూడండి: India vs England 5th T20I: టీమిండియా ఘన విజయం.. ఇంగ్లండ్ చిత్తు చిత్తు!

నితీశ్ రెడ్డి ప్రశంసిస్తూ..

అలాగే ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా కూడా అభిషేక్ శర్మ నిలిచాడు. దీంతో అభిషేక్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. యువీ శిష్యుడు అనిపించుకున్నాడని, రెండో యువీ వచ్చాడని కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో క్రికెటర్ నితీశ్ రెడ్డి కూడా అభిషేక్ శర్మను ప్రశంసించాడు. తనదైన శైలిలో మెంటల్ నా కొడుకు అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ఈ సిరీస్‌ను భారత్ ఇప్పటికే 3-1 తేడాతో లీడ్‌లో ఉంది. మరి ఈ సిరీస్‌లో ఆఖరి మ్యాచ్ ఇండియా లేదా ఇంగ్లాండ్ గెలుస్తుందో చూడాలి.  

ఇది కూడా చూడండి: Israel: నెతన్యాహు సతీమణి పై నేర విచారణ!

ఇది కూడా చూడండి: Vasant Panchami : నేడు వసంత పంచమి.. బాసరకు పోటెత్తిన భక్తులు

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

టోక్యో ఒలింపిక్స్ విజేత మీరాబాయి చానును ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ కేంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె 49కేజీల విభాగంలో రజతం గెలుచుకున్నారు. వైస్ ఛైర్‌పర్సన్‌గా సతీస్ కుమార్ ఎన్నికయ్యారు.

New Update
_Mirabhai Chanu

టోక్యో ఒలింపిక్స్ విజేతమీరాబాయి చానుకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్ చైర్‌పర్సన్‌గా ఆమెను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మీరా భాయి చాను 49 కిలోల విభాగంలో రజత పతకం గెలుచుకున్నారు. చైర్‌పర్సన్‌గా నియమించినందుకు వెయిట్ లిఫ్టింగ్ కమిషన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. తన తోటి వెయిట్‌లిఫ్టర్ల వాయిస్ వినిపించేందుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం ఆమెకు చాలా గర్వకారణమని అన్నారు. అని టోక్యో పతక విజేత మీరాబాయి ఒక ప్రకటనలో తెలిపారు.

మీరాబాయి రెండుసార్లు 2018, 2022 కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతక విజేత. 2017లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని, 2022లో రజతాన్ని గెలుచుకుంది. మీరాబాయి కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు, ఒక రజతాన్ని గెలుచుకుంది. ఆమెతోపాటు కమీషన్ వైస్ ఛైర్‌పర్సన్‌గా సతీస్ కుమార్ ఎన్నికయ్యారు. ఆయన రెండుసార్లు కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేత. వీరిద్దరి పదవీకాలం నాలుగేళ్ల పాటు కొనసాగుతుంది. అథ్లెట్లు, పాలకమండలి మధ్య వారధిగా ఈ వెయిట్ లిఫ్టర్లు పనిచేయనున్నారు. 

#Mirabhai Chanu #Weightlifting Federation #chairperson #Weightlifter
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు