ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో.. విడాకుల బాటలో మరో క్రికెటర్!

క్రికెటర్ మనీష్ పాండే, అతని భార్య ఆశ్రిత శెట్టి విడాకులు తీసుకోబోతున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మనీష్ పాండే, అశ్రిత ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. అంతేకాకుండా పెళ్లి ఫోటోలను కూడా  ఇన్‌స్టాగ్రామ్ నుండి తొలగించారు.  

New Update
Manish Pandey ,Ashrita Shetty

టీమిండియాలోని కొంతమంది ఆటగాళ్లు క్రికెట్లో సక్సెస్ అవుతున్న వైవాహిక జీవితంలో మాత్రం రాణించలేకపోతున్నారు.  గతేడాది నటాషా, స్టాంకోవిచ్ దంపతులు విడాకులు తీసుకోగా..  ఇటీవల యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకుల చర్చ సోషల్ మీడియాలో జోరుగా నడిచింది.  ఇంతలోనే మరో క్రికెటర్ కూడా విడాకులు తీసుకోబోతున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అతను ఎవరో కాదు క్రికెటర్ మనీష్ పాండే, అతని భార్య ఆశ్రిత శెట్టి. అవును త్వరలో వీరిద్దరూ విడిపోతున్నట్లుగా వార్తలు కోడై కూస్తున్నాయి.  

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో

భారత్ తరపున 68 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మనీష్ పాండే, 2019 డిసెంబర్లో నటి అశ్రిత శెట్టిని వివాహం చేసుకున్నాడు. తరచుగా కలిసి కనిపించే ఈ జంట గత కొన్ని నెలలుగా ఎక్కడా కూడా కనిపించడం లేదు.  మనీష్ పాండే, అశ్రిత ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. అంతేకాకుండా వారి పెళ్లి ఫోటోలను కూడా  ఇన్‌స్టాగ్రామ్ నుండి తొలగించారు.  దీంతో ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నట్లుగా వార్తలు చుట్టేస్తున్నాయి. అయితే విడాకుల వార్తలపై ఇప్పటివరకు ఈ జంట స్పందించలేదు. కాగా అశ్రిత వృత్తిరీత్యా నటి. ఈమె ఎక్కువగా తమిళ భాషా చిత్రాలలోనే నటించింది. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

దాదాపు నాలుగు సంవత్సరాలుగా

మరోవైపు మనీష్ పాండేకు దాదాపు నాలుగు సంవత్సరాలుగా క్రికెట్ జట్టులో చోటు దక్కలేదు.  ఇప్పటివరకు భారత్ తరపున 29 వన్డేలు, 39 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మనీష్ 2021 జూలైలో శ్రీలంకపై టీమిండియా తరపున తన చివరి వన్డే ఆడాడు. 2020 డిసెంబర్ లో కాన్‌బెర్రాలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్ ఆడాడు.  మనీష్ వన్డేల్లో 33.29 సగటుతో 566 పరుగులు చేయగా టీ20లలో 44.31 సగటుతో 709 పరుగులు చేశాడు. ఐపీఎల్ వచ్చే సీజన్‌లో మనీష్ కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడనున్నాడు. అతన్ని ఫ్రాంచైజీ రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది.

Also read :  కెప్టెన్ రోహిత్ శర్మకు అవమానం.. పట్టించుకోని ఐసీసీ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Sania Mirza : ఇంకో మూడు సార్లు ప్రెగ్నెంట్ అవుతానేమో కానీ.. ఆ పని మాత్రం కష్టం!

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాతృత్వం  అనుభవాలను, రిటైర్ కావడానికి గల కారణాల గురించి  ఓ పాడ్ కాస్ట్ లో పంచుకున్నారు. గర్భధారణ సమయంలో కంటే తల్లిపాలు ఇస్తున్నప్పుడు తాను ఎక్కువగా అలసిపోయానని సానియా తెలిపింది.

New Update

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాతృత్వం  అనుభవాలను, రిటైర్ కావడానికి గల కారణాల గురించి  ఓ పాడ్ కాస్ట్ లో పంచుకున్నారు. గర్భధారణ సమయంలో కంటే తల్లిపాలు ఇస్తున్నప్పుడు తాను ఎక్కువగా అలసిపోయానని సానియా తెలిపింది.  శారీరక అంశాల కంటే తల్లిపాలు ఇవ్వడంలోని భావోద్వేగ అంశాలే తనను ఎక్కువగా బాధించాయన్నారు సానియా. ఉద్యోగం చేసే మహిళలకు తల్లిపాలు ఇవ్వడం చాలా కష్టమైన పని అని ఆమె చెప్పుకొచ్చారు.  తన కొడుకు ఇజాన్ పుట్టిన తర్వాత 3 నెలలే పాలిచ్చానని తెలిపారు.

Also read :  పెళ్లికెళ్తే చచ్చేంతపనైంది.. తేనెటీగల దాడిలో స్పాట్‌లోనే 50 మంది!

మానసికంగా కుంగిపోయా

కొడుక్కి పాలిచ్చే క్రమంలో తాను శారీరకంగా, మానసికంగా కుంగిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే ఆటపరంగా, ఇతర పనులు, నిద్రలేమి సమస్యలు ఎదురయ్యాయని  సానియా మీర్జా వెల్లడించారు.   అప్పుడు తనకు బ్రెస్ట్ ఫీడింగ్ కష్టమనిపించిందని..  ఆ తర్వాత తన శరీరం ఆటకు సహకరించకపోవడంతో రిటైర్మెంట్ ప్రకటించానంటూ ఆమె చెప్పుకొచ్చారు.  రిటైర్ అయ్యాక తన కొడుకుతో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నానని సానియా స్పష్టం చేసింది. 2018 అక్టోబర్ 30న తన ప్రసవానికి ముందు రాత్రి కూడా టెన్నిస్ ఆడుతూ శారీరకంగా ఫిట్‌గా ఉన్నానని ఆమె గుర్తుచేసుకుంది. ప్రెగ్నెన్సీ ఒక బెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ అయితే బ్రెస్ట్‌ఫీడింగ్ చాలా కష్టంగా అనిపించిందని తెలిపింది.  మరో మూడు సార్లు తాను గర్భందాల్చినా.. బ్రెస్ట్‌ఫీడ్‌ మాత్రం చేయలేను అనుకుంటా అని చెప్పుకొచ్చింది.  

Also Read :  CM Yogi Adityanath : ఉత్తరప్రదేశ్‌లో 1,200 మంది పాకిస్తానీలు.. ఏరివేత షురూ చేసిన యోగి!

Also Read :  Samantha: జాగ్రత్తగా చూసుకున్నాడు...మా బంధానికి పేరు పెట్టలేను...సామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Advertisment
Advertisment
Advertisment