IND vs AUS:  టీమిండియా భారం కోహ్లీపైనే.. మ్యాచ్‌ను గెలిపిస్తాడా?

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో విరాట్ కోహ్లీ నిలకడగా రాణిస్తున్నాడు. 88 బంతుల్లో 78 పరుగులు వద్ద ఉన్నాడు. టీమిండియా 265 పరుగులు చేస్తేనే ఫైనల్స్‌కి వెళ్తుంది. టీమిండియా భారం కూడా విరాట్ కోహ్లీపైనే ఉంది. మ్యాచ్‌ను గెలిపిస్తాడో లేదో చూడాలి

New Update
cric

Virat Kohli

ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా, భారత్ మధ్య సెమీ ఫైనల్ జరుగుతోంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 264 పరుగులకే ఆలౌటైంది. ప్రస్తుతం టీమిండియా బ్యాటంగ్ జరుగుతోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఔట్ అయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ కూడా పెవిలియన్ చేరారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ నిలకడగా రాణిస్తున్నాడు. 88 బంతుల్లో 78 పరుగులు వద్ద ఉన్నాడు. తప్పకుండా సెంచరీ చేస్తాడని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. టీమిండియా స్కోర్ 39 ఓవర్లకు 198/4గా ఉంది. టీమిండియా ఫైనల్స్‌కి వెళ్లాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే. 265 పరుగులు చేస్తే ఇండియా జట్టు ఫైనల్స్‌కి వెళ్తుంది. టీమిండియా భారం అంతా కూడా విరాట్ కోహ్లీపైనే ఉంది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH VS MI: మళ్ళీ హైదరాబాద్ ఓటమి..వరుసగా ముంబైకు నాలుగో విజయం

సొంత గ్రౌండ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ మళ్ళీ ఓడిపోయింది. ఉప్పల్ జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ పై ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో అలవోగ్గా విజయం సాధించింది.  144 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలో పూర్తి చేసింది. 

New Update
ipl

SRH VS MI

ముంబై బ్యాటర్లు మరోసారి చెలరేగిపోయారు. ఈరోజు హైదరాబాద్ ఉప్పల్ లో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ను మట్టికరిపించారు. హైదరాబాద్ ఇచ్చిన 144 పరుగుల టార్గెట్ ను 7 వికెట్ల తేడాతో కొట్టి విజయం సాధించారు.  హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫుల్ ఫామ్ లోని వచ్చేశాడు. ఈ రోజు హైదరాబాద్ సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో 46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో చెలరేగిపోయాడు. 70 పరుగులు చేసి వరుసగా రెండో అర్దసెంచరీ సాధించాడు. అంతేకాదు ఐపీఎల్ లో అత్యతం వేగంగా 20 వేల పరుగులను పూర్తి చేసుకున్న బ్యాటర్ గా కూడా రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే సూర్య కుమార్ యావ్ కూడా  19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 పరుగులు చేసి దూకుడుగా ఆడాడు. రికెల్‌టన్ (11), విల్ జాక్స్ (22) పరుగులు చేశారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో జయదేవ్‌ ఉనద్కత్‌, జీషాన్ అన్సారీ, ఎషాన్ మలింగ తలో వికెట్‌ తీశారు. దీంతో ముంబై ఇంకా 26 బాల్స్ మిగిలుండానే హైదారబాద్ ను చిత్తు చేసింది.  దీంతో ముంబై వరుసగా నాలుగో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు ఓవరాల్ గా ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ లను గెలచి నెట్ రన్ రేట్ ను మెరుగుపరుచుకుని పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. 

చేతులెత్తేసిన హైదరాబాద్..

ముంబై ఇండియన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చేతులెత్తేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన SRH జట్టు ప్రారంభం నుంచే తడబడింది. ఓపెనర్లుగా క్రీజ్‌లోకి వచ్చిన ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ దూకుడుగా ఆడే క్రమంలో పెవిలియన్‌కు చేరారు. తొలి ఓవర్‌కు 2 పరుగులు చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ 2 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయింది. ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్‌ డకౌట్‌ అయ్యాడు. వెను వెంటనే 2 ఓవర్1వ బంతికి సన్‌రైజర్స్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఇషాన్‌ కిషన్‌ (1) ఔట్‌అయ్యాడు. దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ రికెల్‌టన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఓవర్‌లోనే మరో వికెట్ డౌన్ అయింది. 3 ఓవర్ 3వ బంతికి  అభిషేక్‌ శర్మ (8) ఔటయ్యాడు. ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఇలా 4 ఓవర్లకు 13/3 స్కోర్‌ చేసింది. ఆ తరువాత కూడా వరుసగా వికెట్లను కోల్పోతూ కనీసం వంద అయినా స్కోర్ చేస్తారా అన్న పరిస్థితుల్లోకి వెళ్ళింది. కానీ క్లాసెన్ క్లాసిక్ బ్యాటింగ్‌తో అదరగొట్టేశాడు. 30 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. నిలకడగా ఆడిన క్లాసెన్‌ (71) ఔట్‌ అయ్యాడు. దీంతో హైదరాబాద్ జట్టు ఆరో వికెట్‌ కోల్పోయింది. వెను వెంటనే ఏడో వికెట్‌ డౌన్‌ అయింది. అభినవ్‌ (43), కమిన్స్ (1) ఔట్‌ అయ్యారు. దీంతో 20 ఓవర్లకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. 

today-latest-news-in-telugu | IPL 2025 | srh-vs-mi | match

Also Read: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన్

Advertisment
Advertisment
Advertisment