మరోసారి తెలుగోడికే ఛాన్స్.. IPL పాలక మండలిలో చాముండేశ్వరీనాథ్‌కు చోటు

బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో  భారత క్రికెటర్ల సంఘం (ICA) ప్రతినిధిగా తెలుగు క్రికెటర్ చాముండేశ్వరనాథ్‌ నామినేట్ అయ్యారు. దీంతో ఆయనకు ఐపీఎల్ పాలకమండలిలో స్థానం లభించింది. గతంలో కూడా ఆయన ఐపీఎల్‌లో ఆటగాళ్ల సంఘం ప్రతినిధిగా వ్యవహరించారు.

New Update
V Chamundeshwaranath

BCCI: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) 93వ వార్షిక సర్వసభ్య సమావేశం 2024 సెప్టెంబర్ 29వ తేదీన బెంగళూరులో జరిగింది. ఈ సమావేశంలో బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత క్రికెటర్ల సంఘం (ICA) ప్రతినిధిగా వి.చాముండేశ్వరనాథ్‌ను నామినేట్ చేసింది. దీంతో ఆయనకు ఐపీఎల్ పాలకమండలిలో స్థానం లభించింది. తెలుగు క్రికెటర్, టీమిండియా మాజీ మేనేజర్ అయిన చాముండేశ్వరనాథ్‌ గతంలో కూడా ఐపీఎల్‌లో ఆటగాళ్ల సంఘం ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించారు. 

 

అలాగే అరుణ్ సింగ్ ధమాల్, అవిషేక్ దాల్మియా కూడా ఐపీఎల్‌ పాలకమండలికి ఎన్నికయ్యారు. ఈ వివరాలను బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. 2024-25 సీజన్‌కు బీసీసీఐ వార్షిక బడ్జెట్‌కు ఈ సర్వసభ్య సమావేశంలో ఆమోదం లభించినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఆటగాళ్ల వేలం సైకిల్ 2025-2027కి సంబంధించి IPL గవర్నింగ్ కౌన్సిల్ సిఫార్సులు ఆమోదించబడ్డాయి. ఇందులో ప్లేయర్ రిటెన్షన్స్, రైట్ టు మ్యాచ్, శాలరీ క్యాప్ మొదలైనవి ఉన్నాయి. కొత్త నేషనల్ క్రికెట్ అకాడమీ క్యాంపస్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు సంబంధించి చేపట్టిన పనులకు ఆఫీస్ బేరర్లు చేస్తున్న కృషిని జనరల్ బాడీ సభ్యులు అభినందించారు. BCCI చట్టపరమైన హోదాను కొనసాగించాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. IPLతో సహా BCCI టోర్నమెంట్‌లను వేరువేరుగా చూడకూడదని నిర్ణయించినట్లు జై షా తెలిపారు. 

Also Read :  తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌తో డైరెక్ట్‌ రిజల్ట్స్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

KKR Vs PBKS: కేకేఆర్‌కు బిగ్ షాక్.. పంజాబ్ కింగ్స్ భారీ టార్గెట్..

కోల్‌కతాతో జరుగుతోన్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. దీంతో కేకేఆర్ ముందు 202 టార్గెట్ ఉంది. బ్యాటింగ్‌లో ప్రభుసిమ్రన్‌ సింగ్‌ 83, ప్రియాంశ్‌ ఆర్య 69 రాణించారు.

New Update
KKR Vs PBKS sports

KKR Vs PBKS sports

కోల్‌కతాతో జరుగుతోన్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. దీంతో కేకేఆర్ ముందు 202 టార్గెట్ ఉంది. బ్యాటింగ్‌లో ప్రభుసిమ్రన్‌ సింగ్‌ 83, ప్రియాంశ్‌ ఆర్య 69 రాణించారు. శ్రేయస్‌ అయ్యర్‌ 25 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లలో వైభవ్‌ అరోరా 2 వికెట్లు, వరుణ్‌ చక్రవర్తి 1 వికెట్, రస్సెల్‌ 1 వికెట్‌ తీశారు. 

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన పంజాబ్ జట్టు మంచి ఆరంభం అందించింది. ప్రియాంశ్‌ ఆర్య, ప్రభు సిమ్రన్‌ సింగ్‌ ఓపెనర్లుగా వచ్చి అదరగొట్టేశారు. 5 ఓవర్లలో 0 వికెట్ నష్టానికి 54 పరుగులు చేశారు. వరుసగా ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయారు. ఇలా దూకుడుగా ఆడిన ప్రియాంశ్‌ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో 10 ఓవర్లలో 0 వికెట్ నష్టానికి 90 పరుగులు చేశారు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

ఆ తర్వాత రస్సెల్‌ బౌలింగ్‌లో ప్రియాంశ్‌ ఆర్య (69) ఔట్‌ అయ్యాడు. ఆ తర్వాత ప్రభుసిమ్రన్‌ సింగ్‌ దూకుడుగా ఆడాడు. అతడు కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వైభవ్‌ అరోరా బౌలింగ్‌లో ప్రభుసిమ్రన్‌ సింగ్‌ (83) ఔట్‌ అయ్యాడు. అలా గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (7), మార్కో యాన్సెన్‌ ఔట్, శ్రేయస్‌ అయ్యర్‌ 25* పరుగులు చేశారు. ఇలా మొత్తంగా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 201 పరుగులు రాబట్టారు. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

IPL 2025 | KKR VS PBKS | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment