ఓటమి ఎఫెక్ట్ :  టీమిండియా ఆటగాళ్లకు బిగ్ షాక్ ఇచ్చిన బీసీసీఐ

ఆటగాళ్లకు పనితీరుపై వేరియబుల్ పే స్ట్రక్చర్‌ను ప్రవేశపెట్టాలనే ఆలోచనలో బీసీసీఐ ఉంది. సిరీస్‌లో పేలవమైన ప్రదర్శన చేస్తే ఆటగాళ్లకు చెల్లింపులో బీసీసీఐ కోత విధిస్తుంది అన్నమాట. ఇటీవల ముంబైలో జరిగిన సమీక్ష సమావేశంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

New Update
bcci

bcci Photograph: (bcci )

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా ఓటమిపై బీసీసీఐ 2025 జనవరి 11న ముంబైలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమీక్షా సమావేశానికి కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ లు హాజరయ్యారు.  సమీక్షలో భాగంగా ఆటగాళ్లకు పనితీరుపై వేరియబుల్ పే స్ట్రక్చర్‌ను ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనను బీసీసీఐ సూచించింది.

వేరియబుల్ పే సిస్టమ్‌ అంటే  ఆటగాళ్లు జవాబుదారీగా ఉండటం. అంచనాల కంటే తక్కువగా ప్రదర్శన ఉంటే, ఆటగాడి సంపాదనలో కోత ఉంటుంది. సిరీస్‌లో పేలవమైన ప్రదర్శన చేస్తే ఆటగాళ్లకు చెల్లింపులో బీసీసీఐ కోత విధిస్తుంది అన్నమాట. ఆటగాళ్ళు జవాబుదారీగా ఉండాలని, వారి ప్రదర్శన అంచనాల ప్రకారం సరిపోదని భావించినట్లయితే వారు వేరియబుల్ పే- లను ఎదుర్కోవాలని బీసీసీఐ సూచించినట్లుగా తెలుస్తోంది.

ఈ   వేరియబుల్ పే స్ట్రక్చర్‌ అనేది కొత్తదీ కాదు  దాదాపుగా కార్పొరేట్ కంపెనీలు ఏటా తమ ఉద్యోగులకు ఈ విధమైన సిస్టమ్ ను బెస్ చేసుకుని చెల్లింపులు చేస్తుంది.  ఇప్పుడు ఈ వ్యవస్థను బీసీసీఐ త్వరలో అమలులోకి తీసుకురాబోతోంది. 

టెస్ట్ ఫార్మాట్‌ను ప్రోత్సహించడానికి

గత ఏడాది బీసీసీఐ టెస్ట్ ఫార్మాట్‌ను ప్రోత్సహించడానికి ఆటగాళ్లకు ప్రోత్సాహక వ్యవస్థను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం 2022-23 నుండి 50 శాతానికి పైగా టెస్టుల్లో పాల్గొన్న ఆటగాళ్లకు ఒక్కో మ్యాచ్‌కు 30 లక్షల ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందించింది.  ఒక సీజన్‌లో కనీసం 75 శాతం మ్యాచ్‌లు ఆడే ప్రతి ఆటగాడికి రూ. 45 లక్షలను చెల్లింపుగా అందించింది. 


బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా 1-3 తేడాతో ఓడిపోయింది. 2014-15 తర్వాత ఆస్ట్రేలియాపై టీమిండియా టెస్టు సిరీస్ ఓడిపోవడం ఇదే తొలిసారి. దీంతో జూన్‌లో జరగనున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025 ఫైనల్ పోటీ నుండి భారత్ ఔట్ అయింది. డ‌బ్ల్యూటీసీలో మొద‌టిసారి టీమిండియా ఫైనల్‌కు చేరుకోలేక‌పోయింది. 

Also Read :  Sabarimala: నేడే అయ్యప్ప మకరజ్యోతి దర్శనం..శబరిమలకు పోటెత్తిన స్వాములు

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DC VS MI: ఢిల్లీకి బ్రేక్ పడింది..ఉత్కంఠ మ్యాచ్ లో గెలిచిన ముంబయ్

ఐపీఎల్ లో అంతా తారుమారు అవుతోంది. వరుసగా మ్యాచ్ లు గెలుస్తున్న టీమ్ లు అనూహ్యంగా ఓడిపోతున్నాయి. పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న జట్లు మ్యాచ్ లు గెలుస్తున్నాయి. ఈరోజు  ఢిల్లీతో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయ్ విజయం సాధించింది. 

New Update
ipl

DC VS MI

ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. సూపర్ మ్యాచ్ లో ముంబయ్ విజయం సాధించింది. ఈరోజు ఐపీఎల్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయ్ ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఎమ్ఐ 12 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ 206 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీకి ఇచ్చింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన డీసీ బ్యాటింగ్‌కు దిగిన  19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఢిల్లీ బ్యాటర్ కరుణ్‌ నాయర్‌  40 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 89 పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో కర్ణ్‌ శర్మ 3, దీపక్‌ చాహర్‌ 1, బుమ్రా 1, శాంట్నర్‌ 1 వికెట్లు తీశారు. ముంబయ్ కు ఇది రెండో విజయం.

భారీ స్కోర్ ఇచ్చిన ముంబయ్..

అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులో 59 పరుగులు చేశాడు. రికెల్టన్ 41, సూర్యకుమార్ 40, నమన్ 38 పరుగులతో రాణించారు. విప్రజ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. మకేశ్ ఓ వికెట్ తీశారు. చివరి ఓవర్లో 11 రన్స్ చేశారు ముంబయ్ బ్యాటర్లు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(18) మరోసారి నిరాశపరిచాడు. ఐదో ఓవర్లో విప్రజ్‌ వేసిన చివరి బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. చివర్లో నమన్ దూకుడుగా ఆడి ముంబయ్ ఎక్కువ స్కోరు వచ్చలా చేశాడు. ఢిల్లీ  బౌలర్లలో విప్రజ్‌, కుల్దీప్‌ రెండేసి వికెట్లు.. ముకేశ్‌ ఒక వికెట్‌ తీశారు.    

today-latest-news-in-telugu | IPL 2025 | dc | delhi | mumbai-indians

Also Read: DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

Advertisment
Advertisment
Advertisment