VIRAT: కోహ్లీకి కెప్టెన్ బాధ్యతలు.. గెలుపే లక్ష్యంగా కోచ్ కీలక నిర్ణయం

భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి ఆర్సీబీ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. 2025 సీజన్ కోసం ఇప్పటికే మేనేజ్‌మెంట్ కోహ్లీతో చర్చించగా సారథ్యం స్వీకరించేందుకు విరాట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 

author-image
By srinivas
New Update
VR

Kohli Captain: భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి సారథ్య బాధ్యతలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. భారత్ జట్టు కెప్టెన్ గా ఎన్నో మరుపురాని విజయాలు అందించిన కోహ్లీ.. టీ20, వన్డే, టెస్టు జట్టు కెప్టెన్ గా తప్పుకుని ఆటగాడిగా వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీంతోపాటు మెగా టోర్నీ ఐపీఎల్ లోనూ ఆర్సీబీ కెప్టెన్ బాధ్యతలనుంచి 2021 సీజన్ లో తప్పుకోగా.. సౌతాఫ్రికా మాజీ ఆటగాడు డుప్లెసిస్‌ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే వచ్చే సీజన్ లో ఎలాగైన కప్ కొట్టాలనే లక్ష్యంతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కసరత్తులు చేస్తోంది.

కెప్టెన్సీ స్వీకరించేందుకు గ్రీన్ సిగ్నల్..

ఈ మేరకు సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం 2025 సీజన్‌లో బెంగళూరుకు కోహ్లి సారథ్యం వహించనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ విషయంలో ఇప్పటికే మేనేజ్‌మెంట్, కోహ్లి మధ్య చర్చలు జరిగాయని, కెప్టెన్సీ స్వీకరించేందుకు కోహ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. 2022 నుంచి బెంగళూరుకు సారథిగా వ్యవహరిస్తున్న డుప్లెసిస్‌  40వ పడిలో అడుగుపెట్టగా.. ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: ఇంగ్లండ్ కెప్టెన్ ఇంట్లో దోపిడీ.. మెడల్‌ ఇవ్వాలంటూ రిక్వెస్ట్ పోస్ట్!

రిషబ్‌ పంత్‌ కోసం ప్రయత్నం..

మొదట శుభ్‌మన్‌ గిల్‌ కోసం బెంగళూరు ప్రయత్నించినా.. చర్చలు ఫలించలేదు. మరోవైపు ఆటగాళ్ల వేలం పాటలో రిషబ్‌ పంత్‌ కోసం గట్టిగా ప్రయత్నించాలని బెంగళూరు ప్లాన్ చేస్తోంది. ఇది జరగకపోతే బెంగళూరు కెప్టెన్‌గా కోహ్లీ ఖాయంగా కనిపిస్తోంది.  ఇక 2013 నుంచి 2021 వరకు ఆర్సీబీకి విరాట్ సారథ్యం వహించగా.. 2016లో  ఫైనల్‌కు చేర్చిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో ఓటమిపాలైంది.

ఇది కూడా చదవండి: దీపావళి రోజు ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చిన రజినీకాంత్.. సడెన్ గా ఫ్యాన్స్ మధ్యలోకి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PBKS vs KKR :  టాస్‌ గెలిచిన పంజాబ్‌..కోల్‌కతా జట్టులో ఒక మార్పు

పంజాబ్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్‌ గెలిచిన పంజాబ్‌ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్  బ్యాటింగ్‌ తీసుకున్నాడు. కోల్‌కతా తుది జట్టులో ఒక మార్పు జరిగింది. మొయిన్‌ అలీ స్థానంలో అన్రిచ్ నోకియాను తీసుకున్నారు.

New Update
pbks-vs-kkr

pbks-vs-kkr

ఐపీఎల్‌ 2025లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్‌ గెలిచిన పంజాబ్‌ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్  బ్యాటింగ్‌ తీసుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు పంజాబ్‌ 5 మ్యాచ్‌ల్లో 3, కేకేఆర్‌ 6 మ్యాచ్‌ల్లో 3 గెలిచాయి.  కోల్‌కతా నైట్‌రైడర్స్ తుది జట్టులో ఒక మార్పు జరిగింది. మొయిన్‌ అలీ స్థానంలో అన్రిచ్ నోకియాను తీసుకున్నారు.

పంజాబ్, కోల్‌కతా జట్ల మధ్య ఇప్పటివరకు 33 మ్యాచ్‌లు జరగగా..   కేకేఆర్ 21 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. పంజాబ్ 12 మ్యాచ్‌ల్లో గెలిచింది. 2021 నుంచి ఇరుజట్ల మధ్య ఆరు మ్యాచ్‌లు జరగ్గా.. మూడేసి మ్యాచ్‌లు గెలిచాయి. 

జట్లు ఇవే 

పంజాబ్ కింగ్స్  :   ప్రియాంశ్‌ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్‌కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నేహల్ వధేరా, జోష్ ఇంగ్లి్స్, శశాంక్ సింగ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మ్యాక్స్‌వెల్, మార్కో యాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.

కోల్‌కతా :  క్వింటన్ డి కాక్(వికెట్‌కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, అన్రిచ్ నార్టే, వరుణ్ చకరవర్తి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు