Andhra Pradesh : ఏపీ అల్లర్లపై సిట్ బృందం విచారణ వేగవంతం..

ఏపీలో అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను వేగవంతం చేసింది. తిరుపతి మహిళావర్సిటీ స్ట్రాంగ్ రూం దగ్గర జరిగిన ఘటనపై సిట్‌ బృందం అధికారులను విచారిస్తున్నారు. ఇరువర్గాల నుంచి ఫిర్యాదు స్వీకరిస్తున్నారు.

New Update
Andhra Pradesh : ఏపీ అల్లర్లపై సిట్ బృందం విచారణ వేగవంతం..

AP Violence : ఏపీ (Andhra Pradesh) లో అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను వేగవంతం చేసింది. తిరుపతి మహిళావర్సిటీ (Tirupati Women's University) స్ట్రాంగ్ రూం దగ్గర జరిగిన ఘటనపై సిట్‌ బృందం అధికారులను విచారిస్తున్నారు. ఈ బృందంలోని డీఎస్పీ రవి మనోహరాచారి, ఇన్‌స్పెక్టర్ మురళీధర్‌లు ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు నమోదైన FIRలపై విచారణ చేస్తున్నారు.

Also Read: సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసే డేట్, ప్లేస్ ఇదే.. వైసీపీ సంచలన ప్రకటన!

ఈ నెల 14న వర్సిటీ స్ట్రాంగ్ రూం దగ్గర టీడీపీ (TDP) అభ్యర్థి నానిపై హత్యాయత్నం జరిగిన ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. తిరుపతి ఎస్పీతో పాటు నలుగురు అధికారులపై వేటు వేసింది. ఈ క్రమంలోనే హింసపై ఈసీ.. సిట్‌ను నియమించింది. రేపటికల్లా సిట్‌ తమ నివేదికను సమర్పించనుంది.

Also read: అలర్ట్.. ఈ నెల 25 వరకు వర్షాలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori - Sri Varshini: నా బావ జైలులో నన్ను వేసేయండి.. బోరున ఏడ్చేసిన వర్షిణీ

అఘోరీ అరెస్టు తర్వాత శ్రీవర్షిణి బోరున ఏడ్చేసింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.

New Update

అఘోరీ, శ్రీవర్షిణీ లవ్‌కు బ్రేక్ పడింది. ప్రస్తుతం అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆదేశాలతో 14 రోజుల పాటు చంచల్‌గూడ జైల్లోకి పంపారు. అయితే అఘోరీని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో.. ఆ తర్వాత శ్రీవర్షిణీ సంచలన వ్యాఖ్యలు చేసింది. అఘోరీతో పాటే తనను కూడా అరెస్టు చేయాలని కోరింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. 

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

బోరున ఏడ్చేసిన వర్షిణి

అంతేకాకుడా తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. పోలీసులు ఎంత చెప్పినా వర్షిణీ అస్సలు వినిపించుకోలేదు. అఘోరీని జైలుకు పంపిన తర్వాత వర్షిణీకి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు భరోసా కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వర్షిణికి పోలీసులు ఎంత నచ్చ చెప్పినా ఆమె వినిపించుకోలేదు. తాను మైనర్‌ని కాదని.. మేజర్‌నని.. ఎక్కడైనా ఉండే హక్కు తనకు ఉందని వర్షిణి అంటోంది. తాను కావాలనుకున్న చోటుకే తనను వదిలేయాలని చెబుతోంది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

 

ఇందులో భాగంగానే వర్షిణికి పలు దఫాలుగా కౌన్సిలింగ్ ఇస్తూన్నా ఆమె మాత్రం ఎవ్వరి మాట వినడం లేదు. అయితే పోలీసులు దాదాపు 15 రోజుల పాటు వర్షిణీకి కౌన్సిలింగ్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వర్షిణి తల్లిదండ్రులు తమ కూతురిని తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అఘోరీ మాయమాటలకు వర్షిణి లోబడిందని.. తమ కూతురిని తామే ఇంటికి తీసుకెల్లిపోతామని అంటున్నారు.   

aghori sri varshini | lady aghori sri varshini relation | Lady Aghori Sri Varshini Marriage | Lady Aghori Sri Varshini Love Story | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు