Varanasi : ప్రధాని మోదీ కారుపై చెప్పు... వీడియో సోషల్ మీడియాలో వైరల్

ప్రధాని మోదీ పర్యటనలో మరోసారి భద్రతా వైఫల్యం కనబడింది. రెండు రోజుల క్రితం వారణాసిలో పర్యటనకు వెళ్ళిన మోదీ కాన్వాయ్ మీద చెప్పులు విసిరారు. ఎవరు విసిరారు, ఎందుకు విసిరారు అన్న విషయాలే బయటకు రాలేదు కానీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

New Update
Varanasi : ప్రధాని మోదీ కారుపై చెప్పు... వీడియో సోషల్ మీడియాలో వైరల్

Slippers On Convoy : ప్రధాని మోదీ (PM Modi) పర్యటన అంటే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు పోలీసులు పహారా కాస్తూనే ఉంటారు. భారత ప్రధాని సెక్యూరిటీ బాధ్యత మొత్తం స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ)దే. ప్రధాని భద్రతకు సంబంధించిన మార్గదర్శకాలను వివరించేందుకు బ్లూ బుక్ అనే ఓ రూల్‌ బుక్‌ ఉంటుంది. ఈ బ్లూ బుక్ ఆదేశాలు, సూచనలను కేంద్ర హోంశాఖ జారీ చేస్తుంది. ప్రధాని వెళ్లడానికి మూడు రోజుల ముందే ఎస్పీజీ.. ఆ ఏరియాలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది.

ఇంటెలిజెన్స్‌ బ్యూరో (Intelligence Bureau)  అధికారులతోపాటు సంబంధిత రాష్ట్రం, అక్కడి పోలీసు అధికారులు, జిల్లా కలెక్టర్లతో భద్రతపై సమీక్షిస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ చట్టం కూడా ఉంది. ఈ చట్టం ప్రకారం ఒకవేళ ఎస్పీజీ అవసరం అనుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వాలు వారికి సహాయం అందించడం తప్పనిసరి.

అయితే ఇలాంటి భద్రత కూడా ఒక్కోసారి వైఫల్యానికి గురవుతోంది. గతంలో పంజాబ్ పర్యటన (Punjab Tour) కు ప్రధాని మోదీ వెళ్ళినప్పుడు 20 నిమిషాల పాటూ ఆయన కాన్వాయ్ నడిరోడ్డు మీద ఆగిపోయింది. రైతుల ఆందోళన నేపథ్యంలో ఇది జరిగింది. ఇప్పుడు తాజాగా వారణాసి (Varanasi) లో ప్రధాని భద్రతలో వైఫల్యం బయటపడింది. మంగళవారం వారణాసి పర్యటనకు వెళ్ళారు మోదీ. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నాక మొదటిసారి మోదీ వారణాసి వెళ్ళారు. అక్కడ ప్రజలను కలిశారు, గంగాహారతిలో పాల్గొన్నారు. అంతా బాగానే జరిగింది కానీ... తిరిగి వెళుతున్న సమయంలో మోదీ కాన్వాయ్ మీద కొంతమంది చెప్పులు విసిరారు. అయితే వీటిని ఎవరు విసిరారు, ఎందుకు ఈ పని చేశారు లాంటివి ఏమీ తెలియలేదు. దీనికి బాధ్యలయినవారిని అరెస్ట్ చేశారా అన్న విషయం మీద కూడా స్పష్టత రాలేదు. కానీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Big Breaking: కేంద్ర కేబినేట్‌లో కీలక నిర్ణయం.. 14 పంటలకు కనీస మద్ధతు ధర

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vontimitta Temple: ఒంటిమిట్టలో రాములోరి కళ్యాణం.. ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే....

ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్స వాల్లో భాగంగా ఈనెల 11న జరిగే శ్రీరాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు కడప జిల్లాఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లపై సమీక్షచేశారు.

New Update
Vontimitta Temple

Vontimitta Temple

Vontimitta Temple : ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్స వాల్లో భాగంగా ఈనెల 11న జరిగే శ్రీరాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు ఒంటిమిట్టలో పర్యటించారు… కడప జిల్లాఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లపై మంత్రుల బృందం సోమవారం ఆరా తీశారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేతృత్వంలో మంత్రుల బృందం రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎమ్మెల్సీ బి.రాంగోపాల్ రెడ్డి, కలెక్టర్ చామకూరి శ్రీధర్ లు పాల్గొన్నారు. వీరికి అర్చకులు టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికినారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒంటి మిట్ట శ్రీరాముల కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లు, ఆలయం వద్ద ఏర్పాట్లను మంత్రుల బృందం సమీక్షించి పరిశీలించారు.

Also Read: Vijay- Rashmika: ఒకేచోట విడివిడిగా ఫొటోలు.. ఇంకెన్ని రోజులు కొండన్న ఈ దాగుడు మూతలు!

దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.. దేవస్థానం సమీపంలోని శ్రీకోదండరామ స్వామి కల్యాణ వేదిక చేరుకుని అనంతరం అక్కడ జరుగుతున్న  ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి.. కల్యాణ వేదిక, గ్యాలరీలు, రోడ్లు, బారికేడ్లు, పార్కింగ్, విద్యుత్, ఇతర క్లినింగ్ వంటి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేసి సలహాలు, సూచనలు ఇచ్చినారు.. ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ… శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 11వ తేదీన సీతారాముల కల్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుందని, అందుకు సంబంధించి ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు సంయుక్తంగా, సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రులు కోరారు.

Also Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. HCU విద్యార్థులకు ఊరట

 ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి ఆలయంలో.. ఆగమ శాస్త్ర ప్రకారం, శాస్త్రోక్తంగా పూజా కైంకర్యాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రతి ఆలయంలో ప్రతి రోజూ దీప దీప నైవేద్యాలు నిరంతరాయంగా జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. అందుకే.. ప్రతి ఆలయంలో  దేదీప్యమానంగా పూజలు అందుతున్నాయన్నారు మంత్రి ఆనం.. 12 కెటగిరీలకు చెందిన 121 గ్యాలరీలలోకి వచ్చే దాదాపు 80 వేల మంది భక్తులకు సంతృప్తికరంగా 47,770 ప్యాకెట్ల అన్న ప్రసాదాలు మంచి అంద  చేయడం జరిగిందన్నారు. ప్రజా భద్రత  కోసం సుమారు 150 కి పైగా సిసి కెమెరాల నిఘా, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే కడప, రాజంపేట వైపు నుంచే ఆర్టీసీ బస్సులకు పార్కింగ్, అలాగే ఇతర జిల్లాలనుంచి ఎన్ని బస్సులు వస్తున్నాయో తెలుసుకుని పక్కాగా ప్లాన్ రూపొందించుకుని పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవడం జరిగిందన్నారు. ఒకవేళ పార్కింగ్ దూరంగా ఉంటే అక్కడి నుంచి కళ్యాణవేదిక వద్దకు భక్తులను తీసుకువచ్చేందుకు ఉచిత బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వాహనాల పార్కింగ్ వద్ద టోయింగ్ వాహనాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

Also read :  మరికొన్ని రోజుల్లో పెళ్లి... కాబోయే భర్త కళ్లముందే యువతి మృతి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు