AP Elections 2024: ఓటర్లతో ఒట్లు వేయించిన వైసీపీ నాయకులు.. వీడియో వైరల్! తిరుపతిలోని టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్ర రెడ్డి ఓటర్లతో దేవుని గుడిముందు ఒట్లు వేయించడం హాట్ టాపిక్ గా మారింది. కుటుంబంతో సహా అందరూ వైసీపీకే ఓటు వేయాలని అగ్నిసాక్షిగా ప్రమాణం చేయించిన వీడియో వైరల్ అవుతోంది. వెంటనే జయచంద్రపై చర్యలు తీసుకోవాలని ఎన్డీఏ కూటమి డిమాండ్ చేస్తోంది. By srinivas 12 May 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Tirupati YCP Leader Ketham Jaya Chandra Reddy: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుండగా నిన్నటివరకూ జోరుగా ప్రచారహోరు సాగింది. ప్రధానపార్టీలన్నీ విజయం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఇందులో భాగంగానే పార్టీ కార్యకర్తలు, ఓటర్లపై పార్టీ నాయకులు ఓ కన్నేసి ఉంచారు. డబ్బులు, తదితర ప్రలోభాలకు లొంగకుండా నిఘా పెడుతూ ఓటు బ్యాంక్ కాపాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే తిరుపతి జిల్లాలో వైసీపీ నాయకులు ప్రజలతో దేవుని ముందు ప్రమాణాలు చేయించడం చర్చనీయాంశమైంది. ఈ మేరకు తిరుపతి జిల్లాలోని టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్ర రెడ్డి.. స్వయంగా తన నియోజక వర్గ ప్రజలతో దేవునిగుడిలో ప్రమాణం చేయించారు. తనతోపాటు తమ ఫ్యామిలీ ఓట్లన్నీ వైసీపీకే వేయిస్తామని దేవుని ముందు వెగిలించిన అగ్నిసాక్షిగా ఒట్టు వేయించారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. టౌన్ బ్యాంక్ చైర్మన్ పై చర్యలు తీసుకోవాలని ఎన్డీఏ కూటమి డిమాండ్ చేస్తోంది. ఓటర్లను బెదిరించి, కూటమికీ ఓట్లు వేయకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు. వెంటనే ఎలక్షన్ కమీషన్ అధికారులు స్పందించి ఈ వైసీపీ దుర్మార్గంపై చర్యలు తీసుకోవాలన్నారు. #tirupathi #ap-elections-2024 #ycp సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి