అలా చేసి వుంటే పవార్ ను ప్రజలు ప్రశంసించే వారు... పవార్ పై శివసేన ఫైర్...!

author-image
By G Ramu
New Update
అలా చేసి వుంటే పవార్ ను ప్రజలు ప్రశంసించే వారు... పవార్ పై శివసేన ఫైర్...!

‘లోక్ మాన్య తిలక్ జాతీయ అవార్డు’ప్రదాన కార్యక్రమంలో ప్రధాని మోడీతో కలిసి శరద్ పవార్ వేదికను పంచుకోవడంపై శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ ‘మౌత్ పీస్’సామ్నాలో పవార్ పై విమర్శలు గుప్పించింది. ప్రధాని మోడీ నియంతృత్వ విధానాలను వ్యతిరేకించేందుకు గాను ఆ కార్యక్రమానికి పవార్ దూరంగా వుండి వుంటే పవార్ ను మహా ప్రజలు ప్రశంసించేవారని పేర్కొంది.

లోక్ మాన్య తిలక్ కొటేషన్ ను ప్రస్తావిస్తూ పవార్ పై మండిపడింది. ప్రజా నాయకుడు కావాలంటే అతను స్వార్ధాన్ని విడిచి పెట్టాలని తిలక్ అన్నాడని తెలిపింది. ప్రజా నాయకుడు కావాలంటే అతని ప్రవర్తన కూడా ఆదర్శంగా వుండాలని రాసుకొచ్చింది. దేశం ‘రెండవ స్వాతంత్ర్య ఉద్యమంగా అభివర్ణించే పోరాటంలో ఉన్న సమయంలో పవార్ వంటి నాయకునిపై ప్రజలకు భిన్నమైన అంచనాలు వున్నాయని సామ్నా ఎడిటర్ పేర్కొన్నారు.

కొన్ని రోజుల క్రితం ఎన్సీపీపై మోడీ అవినీతి ఆరోపణలు చేశారని తెలిపారు. ఆ తర్వాత ఆ పార్టీని రెండుగా చీల్చారన్నారు. ఆ పార్టీకి మహా సర్కార్ లో చోటు కల్పించారన్నారు. అందుకే మోడీ కార్యక్రమానికి హాజరు కావాలనుని పవార్ తీసుకున్న నిర్ణయంపై ఎన్సీపీలోని కొందరు నాయకులు తీవ్రంగా వ్యతిరేకిరించారని చెప్పారు.

ప్రధాని మోడీతో వేదిక పంచుకోవాలని పవార్ తీసుకున్న నిర్ణయం పట్ల విపక్ష పార్టీలు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నాయన్నారు. ప్రధాని మోడీ లోక్ మాన్య తిలక్ జాతీయ అవార్డును ఈ నెల 1న అందుకున్నారు. ఈ కార్యక్రమానికి అతిథిగా శరద పవార్ హాజరయ్యారు. ఈ సందర్బంగా పవార్ కు ప్రధాని మోడీ షేక్ హ్యాండ్ ఇచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

bomb blast case : 71మంది చనిపోయిన బాంబు బ్లాస్ట్ కేసులో నలుగురికి జీవిత ఖైదు

2008లో జైపూర్‌లో వరుస పేలుళ్లుకు పాల్పడిన నిందితులను స్పెషల్ కోర్టు దోషులుగా ప్రకటించింది. నలుగురికి జీవిత ఖైదు శిక్ష విధింస్తూ తీర్పు ఇచ్చింది. జైపూర్‌లో 2008 మే 13న ఎనిమిది వరుస పేలుళ్లలో 71 మంది మరణించగా, 185 మంది గాయపడ్డారు.

New Update
jaipur bamb balst case

jaipur bamb balst case Photograph: (jaipur bamb balst case)

2008 జైపూర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో జైపూర్ స్పెషల్ కోర్టు మంగళవారం ఫైనల్ తీర్పు వెల్లడించింది. నలుగురు దోషులకు జీవిత ఖైదు శిక్ష విధించింది. నలుగురు దోషులు, సర్వర్ అజ్మీ, షాబాజ్, సైఫర్ రెహమాన్ మరియు మహ్మద్ సైఫ్‌లను ఏప్రిల్ 4న కోర్టు ఐపిసిలోని వివిధ సెక్షన్లు, చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం, పేలుడు పదార్థాల చట్టం కింద దోషులుగా నిర్ధారించింది. 2008 మే 13న చాంద్‌పోల్‌లో పేలుడు పదార్థాలను అమర్చిన కేసు ఇది. ఈ కేసులో కోర్టు 600 పేజీల తీర్పును వెలువరించింది. ప్రభుత్వం 112 ఆధారాలు, 1192 పత్రాలు, 102 వ్యాసాలు మరియు 125 పేజీల లిఖిత వాదనలను సమర్పించింది.

Also read: BIG BREAKING: ‘సింగపూర్‌లో పవన్ కళ్యాణ్ కొడుక్కి ప్రధాని మోదీ సాయం’

జైపూర్‌లో 2008 మే 13న ఎనిమిది వరుస పేలుళ్లు జరిగాయి. సాయంత్రం జరిగిన పేలుళ్లలో 71 మంది మరణించగా, 185 మంది గాయపడ్డారు. రామచంద్ర ఆలయం సమీపంలో ఒక లైవ్ బాంబును స్వాధీనం చేసుకున్నారు, దానిని బాంబు డిస్పోజల్ స్క్వాడ్ నిర్వీర్యం చేసింది. తొమ్మిదవ బాంబు చాంద్‌పోల్ బజార్‌లోని గెస్ట్ హౌస్ సమీపంలో కనుగొనబడింది. చాంద్‌పోల్ లో అమర్చిన బాంబ్‌ను పేలడానికి 15 నిమిషాల ముందు దానిని నిర్వీర్యం చేశారు. ఈ కేసులో సర్వర్ అజ్మీ, మహ్మద్ సైఫ్, సైఫుర్రహ్మాన్ మరియు షాబాజ్‌లను దోషులుగా నిర్ధారించిన కోర్టు మంగళవారం వారికి జీవిత ఖైదు విధించింది.

Also read: Dubai Crown Prince: ఢిల్లీకి చేరుకున్న అత్యంత సంపన్నుడు దుభాయ్ రారాజు.. ఎందుకంటే?

అలాగే ఇదే రోజు (మంగళవారం) హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కూడా తీర్పు వెల్లడించింది. పేలుళ్లకు పాల్పడిన ఐదుగురికి ఉరిశిక్ష ఖరారు చేసింది. NIA ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. అక్తర్, జియా ఉర్ రహమాన్, తహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, అజాజ్‌ షేక్‌కు ఉరిశిక్ష విధించింది.

Advertisment
Advertisment
Advertisment