Ram Mohan Reddy : నోటికొచ్చినట్టు మాట్లాడితే తాటతీస్తా.. నీ బాగోతం బయటపెడతా : హరీష్ రావుకు వార్నింగ్!

పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే తాటతీస్తా జాగ్రత్త అంటూ హెచ్చరించారు. కుల్వకుంట్ల కుటుంబమే పెద్ద చెడ్డీ గ్యాంగ్ అని ఆరోపించారు.

New Update
Ram Mohan Reddy : నోటికొచ్చినట్టు మాట్లాడితే తాటతీస్తా.. నీ బాగోతం బయటపెడతా : హరీష్ రావుకు వార్నింగ్!

Telangana : పరిగి కాంగ్రెస్(Congress) ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి(Ram Mohan Reddy) మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే తాటతీస్తా జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ముఖ్యమంత్రిని పట్టుకుని చెడ్డీ గ్యాంగ్ సభ్యుడంటావా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన రామ్మోహన్.. కేసీఆర్ చెడ్డీ గ్యాంగ్ లీడర్ అయితే, కేటీఆర్, కవిత, హరీష్ రావు‌లు చెడ్డీ గ్యాంగ్ సభ్యులంటూ ఎద్దేవ చేశారు.

కుల్వకుంట్ల కుటుంబమే పెద్ద చెడ్డీ గ్యాంగ్..
పదేళ్ల పాటు తెలంగాణను దోచుకున్న కుల్వకుంట్ల కుటుంబమే పెద్ద చెడ్డీ గ్యాంగ్. అర్ధరాత్రి దొంగతనాలు చేసి చంద్రశేఖర్ రావు ముఠా తెలంగాణను దోచుకుంది. సీఎం రేవంత్ ను విమర్శించడానికి హరీష్ రావుకు కొంచెమైనా సిగ్గుండాలి. హరీష్ రావు కాదు ఆయన కాళేశ్వరం కమిషన్ రావు. అడ్డదిడ్డంగా కమిషన్లు బొక్కి ఆ డబ్బు మదం తో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. కాళేశ్వరంలో హరీష్ రావు బాగోతం కూడా బయటపడబోతుంది. ఆయన కమిషన్ల వ్యవహారాన్ని కూడా కక్కిస్తాం. సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రంగనాయక సాగర్ దగ్గర పేద రైతులను బెదిరించి 13 ఎకరాల ఫాంహౌజ్ కట్టుకోలేదా? అని ఆరోపించారు. చిన్న చిన్న రైతులను భూసేకరణ పేరుతో వేధించి ఫాంహౌజ్ కట్టుకోవడానికి సిగ్గులేదా? నువ్వు, నీ బామ్మర్ది ఫామ్ హౌస్ వ్యవహారాల అన్నింటిని బయటకు తీస్తాం. రైతులపైన ప్రేమ ఉన్నట్లు హరీష్ రావు తెగ బాధపడుతున్నారు. బలవంతంగా భూములు గుంజుకున్నప్పుడు రైతులు హరీష్ రావుకు గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: Narsampeta : ఉపాధ్యాయుల వేధింపులు.. దారుణానికి పాల్పడ్డ లేడీ టీచర్!

పగటి కలలు కంటున్నావా..
అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో నే రుణమాఫీ(Runa Mafi) కాలేదని ఇప్పుడు పెడబొబ్బలు పెడుతున్నాడంటూ మండిపడ్డారు. 2018లో రుణమాఫీ హామీ ఇచ్చిన 2023 వరకు చేయనప్పుడు హరీష్ రావు ఆయన మామను ఎందుకు నిలదీయలేదన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని హరీష్ రావు పగటి కలలు కంటున్నాడని.. భవిష్యత్తులో బీఆర్ఎస్ ఉండదని జోస్యం చెప్పారు. ఒక వేళ ఆ పార్టీ ఉన్నా అందులో హరీష్ రావు ఉండడన్నారు. హరీష్ రావు ఎంత గింజుకున్నా కనీసం మెదక్ ఎంపీ సీటు కూడా బీఆర్ఎస్ గెలవదన్నారు. మెదక్‌లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత హరీష్ రావుకు ఆ పార్టీలో కౌంట్ డౌన్ మొదలౌతుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Man Marries Two Women : ఒకే ముహూర్తంలో ఇద్దరమ్మాయిలతో పెళ్లి...విషయం తెలిస్తే నవ్వాపుకోలేరు

ఏపీకి సంబంధించిన ఓ వెడ్డింగ్ కార్డ్ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.  అందులో వింతేముంది అనుకుంటున్నారా? నిజానికి అన్ని పెళ్లి కార్డుల్లాగే అది కూడా సాధారణమైన కార్డే. కానీ వరుడు ఒక్కడు.. వధువులు ఇద్దరు కావడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

New Update
 Man Marries Two Women

 Man Marries Two Women Photograph

 

wedding card
wedding card Photograph: (wedding card)

 Man Marries Two Women: ఏపీకి సంబంధించిన ఓ వెడ్డింగ్ కార్డ్ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.  అందులో వింతేముంది అనుకుంటున్నారా? నిజానికి అన్ని పెళ్లి కార్డుల్లాగే అది కూడా సాధారణమైన కార్డే. కానీ వరుడు ఒక్కడు.. వధువులు ఇద్దరు కావడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన యువకుడు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పుడు ఈ కార్డు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఒకే హీరోను ఇద్దరు అక్కచెల్లెళ్లు ఇష్టపడడం సినిమాల్లో మాత్రమే సాధ్యమవుతుంది. సినిమాల్లోనూ చివరికి ఎవరో ఒకరు త్యాగం చేయడం సర్వసాధారణం కానీ సత్యసాయి జిల్లాకు చెందిన ఒక వరుడికి అక్కాచెల్లెళ్లను ఇచ్చి పెళ్లి చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. ఒకే ముహూర్తంలో, ఒకే మండపంలో అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకునేందుకు వరుడు సిద్ధమయ్యాడు. బంధువులు, సన్నిహితుల్ని ఆహ్వానిస్తూ శుభలేఖలు కూడా ప్రింట్ చేశారు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పెళ్లి కార్డు వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.

Also Read: Bigg Boss 9: కింగ్‌కు రెస్ట్.. బరిలోకి బాలయ్య- బిగ్ బాస్ 9 ఫుల్ కంటెస్టెంట్ లిస్ట్ ఇదే..

 శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గుమ్మగారిపల్లికి చెందిన గంగులమ్మ రాజువేలు కుమారుడు గంగరాజుకు.. కర్ణాటకలోని చిక్కబళ్లాపురం జిల్లా బాగేపల్లి టౌన్‌కు చెందిన కె సుశీల రఘుల కుమార్తెలు శ్రీలక్ష్మి, ఐశ్వర్యలను ఇచ్చి పెళ్లి చేస్తున్నట్లు కార్డులో ప్రింట్ చేశారు. ఈ నెల 10న ఉదయం ముహూర్తం కాగా.. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల పట్టణం బెంగళూరు రోడ్, గుమ్మ్యగారిపల్లి క్రాస్ దగ్గర ఉన్న రంగమహాల్‌లో పెళ్లి చేస్తున్నారట. పెళ్లికి ముందు రోజు అంటే ఈ నెల 9న రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. అక్కాచెల్లెళ్లను ఒకే యువకుడికి ఇచ్చి పెళ్లి చేయడం వెనుక కారణం ఏంటని సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఇది కూడా చదవండి:  పాపం ప్రణీత్.. గంట పాటు చిత్ర హింసలు పెట్టి చంపిన ఫ్రెండ్స్.. అసలేమైందంటే..!

శ్రీసత్యసాయి జిల్లా కర్ణాటకకు సరిహద్దులో ఉంటుంది.. దీంతో స్థానికులు కొందరు ఉపాధి కోసం కర్ణాటకకు వెళ్లి అక్కడే స్థిరపడతారు.. పొరుగునే ఉన్న అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలో పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటారు.. ఈ క్రమంలోనే శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన యువకుడ్ని కర్ణాటకకు చెందిన ఇద్దరు వధువులతో పెళ్లి చేస్తున్నారు. మొత్తానికి ఈ ఆయనకిద్దరు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ వెడ్డింగ్ కార్డ్ పోస్ట్ కింద నెటిజన్లు స్పందిస్తున్నారు. 'లోకం మారుతోంది అంటే ఏంటో అనుకొన్న, ఈ వెడ్డింగ్ చూసి నిజమనిపిస్తోంది.. ఒకేసారి ఇద్దరమ్మాయిల ముద్దుల మొగుడుగా.. తమ్ముడు గంగరాజు నీ గుండె పది కాలాలు బ్రతకాలి' అంటూ వెడ్డింగ్ కార్డును షేర్ చేశారు ఓ నెటిజన్. 

ఇది కూడా చదవండి: ఆఫీసు పనిలో సహోద్యోగులు ఎగతాళి చేస్తున్నారా.. ఇలా చేయండి


'పేరు మారింది కావచ్చు. అందుకే అలా రాసారేమో' అని ఒక నెటిజన్ అంటే.. 'ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త రా బాబు... నీ ఆరోగ్యం బాగుంటే అన్ని బాగుంటాయి. ఆ.విషయంలో ఇద్దరినీ మెయింటైన్ చేయాలి అంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని అనుకో.. ముందు ధూమపానం మద్యపానం వంటి అలవాట్లు ఉంటే మానుకో.. లేకపొతే ముందు ముందు ఆ రెండు వ్యసనాలకు శాశ్వతంగా బానిస కావాల్సి ఉంటుంది.. జాగ్రత్త' అని మరొకరు సలహా ఇస్తూ రిప్లై ఇచ్చారు. 'ఒక్కరిని కట్టుకున్నాందుకే బాధపడుతుంటే, మరి నీ పరిస్థితి ఏంటి? గట్టి గుండె అనిచెప్పాలి' అంటూ మరో నెటిజన్ సరదాగా కామెంట్ చేశారు. అయితే ఇద్దరిలో ఒకరికి ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయోమో అందుకే ఒకరికే ఇచ్చి పెళ్లి చేస్తున్నారని మరొకరు కామెంట్‌ చేస్తున్నారు.  మొత్తానికి ఈ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది.

Also read: 71మంది చనిపోయిన బాంబు బ్లాస్ట్ కేసులో నలుగురికి జీవిత ఖైదు

#sri-sathya-sai-district #womens #marriage
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు