లైంగిక వేధింపు కేసులో రూ.9900 కోట్లు జరిమాన విధించిన కోర్టు

ఓ మహిళపై మాజీ భాగస్వామి లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో అక్కడి ప్రత్యేక న్యాయస్థానం భారీ జరిమానా విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. బాధిత మహిళకు ఏకంగా రూ. 9900 కోట్లు చెల్లించాలని మాజీ భర్తకు హుకుం జారీ చేసింది. ఈ సంచలన తీర్పు అమెరికా ప్రత్యేక న్యాయస్థానంలో చోటు చేసుకుంది.

New Update
లైంగిక వేధింపు కేసులో రూ.9900 కోట్లు జరిమాన విధించిన కోర్టు

అమెరికాలో అనేక రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న చట్టాల ప్రకారం.. ఓ వ్యక్తి అంగీకారం లేకుండా వారి వ్యక్తిగత (మాజీ భాగస్వామి) ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో షేర్‌ చేయడం నేరం. వ్యక్తిత్వానికి హాని కలిగించే ఉద్దేశంతో చేసే ఇటువంటి చర్యలను ‘రివెంజ్‌ పోర్న్‌’గా వ్యవహరిస్తారు. అమెరికాలో ఈ తరహా సెటిల్‌మెంట్‌లలో భాగంగా భారీ మొత్తాలను చెల్లించిన దాఖలాలు అనేకం ఉన్నాయి. తాజాగా దావా టెక్సాస్‌ కోర్టు పరిధిలో జరిగింది.

అమెరికాలో నివాసం ఉంటున్న ఓ జంట కొన్నిరోజులు బాగానే కలిసి ఉన్నారు. రానురాను వారి మధ్య విబేధాలు వచ్చి భాగస్వామితో విడిపోయారు. విడిపోయిన తర్వాత తన మాజీ భార్య ప్రైవేటు ఫొటోలను ఆన్‌లైన్‌లో పెట్టి అవమానాలకు గురిచేయడం స్టార్‌ చేశాడు. దీంతో ఆమె తొలుత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడ న్యాయం జరగలేదని భావించి సివిల్‌ కోర్టును ఆశ్రయించింది. ఈ సివిల్‌ దావాపై విచారణ పూర్తిచేసిన ప్రత్యేక న్యాయమూర్తుల బృందం. బాధిత మహిళకు 1.2 బిలియన్‌ డాలర్లు అంటే (సుమారు రూ.9900 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది.

అమెరికాకు చెందిన డీఎల్‌ అనే మహిళ మార్క్వెస్‌ జమాల్‌ జాక్సన్‌ అనే వ్యక్తితో 2016 నుంచి కలిసి జీవించారు. షికాగోలో కొంతకాలం గడిపిన తర్వాత అక్టోబర్‌ 2021న పరస్పర అంగీకారంతో వారిద్దరూ విడిపోయారు. అనంతరం అతడి నుంచి వేధింపులు మొదలయ్యాయి. మాజీ భాగస్వామిని అవమానించడమే లక్ష్యంగా పెట్టుకున్న అతడు.. గతంలో ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలను సైట్లలో పెట్టాడు. దీంతోపాటు ఆమె ఇంట్లోని సీసీ కెమెరాలు, మొబైల్‌, ఈ-మెయిల్‌ నుంచి వ్యక్తిగత ఫొటోలను సేకరించి ఆమె అనుమతి లేకుండా సోషల్‌ మీడియాలో నకిలీ ఖాతాలను సృష్టించి అందులో పోస్టు చేశాడు. ఆ ఫొటోల లింకులను అమ్మాయి స్నేహితులు, కుటుంబ సభ్యులకూ పంపించాడు. వాటిని ఇంటర్నెట్‌ నుంచి తీసివేయడానికి ప్రయత్నించినా.. అందుకు మీ జీవితం సరిపోదంటూ మాజీ భాగస్వామికి మెసేజ్‌లు పంపించేవాడు.

మాజీ భాగస్వామి చేష్టలతో విసుగు చెందిన ఆ మహిళ చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై 2022 ఏప్రిల్‌లో టెక్సాస్‌లోని హ్యారీస్‌ కౌంటీ సివిల్‌ కోర్టులో దావా వేశారు. అతడి చర్యలతో మానసిక, లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. అయితే, నిందితుడు కోర్టుకు రానప్పటికీ.. అతడి తరఫు న్యాయవాది మాత్రం హాజరై వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జ్యూరీ.. మహిళను మానసికంగా వేధించినందుకు 200 మిలియన్‌ డాలర్ల రూ.1600కోట్లతోపాటు ఆమెకు నష్టాన్ని కలిగించినందుకు శిక్షగా మరో రూ.8300 కోట్లు చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై బాధిత మహిళ మాట్లాడుతూ.. వేధింపుల విషయమై స్థానిక పోలీసులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ వారినుంచి సరైన స్పందన లభించకపోవడంతోనే సివిల్‌ కోర్టును ఆశ్రయించినట్లు బాధిత మహిళ పేర్కొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు