Sajjala Ramakrishna Reddy: పవన్ కళ్యాణ్‌ టీడీపీని టేకోవర్‌ చేసుకున్నారు

టీడీపీ-జనసేన పార్టీలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణ రెడ్డి ట్రిబ్యుషనల్‌ సమీక్ష అంశాన్ని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు. టీడీపీ నేతలు దీనిపై రాజకీయ విమర్శలు చేస్తున్నారన్న ఆయన.. సోమవారమే కృష్ణ ట్రిబ్యుషన్‌ సమీక్ష అంశం వచ్చిందన్నారు.

New Update
Sajjala: ఏం తప్పుగా మాట్లాడాను?.. చిరంజీవి గొప్ప నటుడే.. కానీ..!

టీడీపీ-జనసేన పార్టీలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణ రెడ్డి ట్రిబ్యుషనల్‌ సమీక్ష అంశాన్ని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు. టీడీపీ నేతలు దీనిపై రాజకీయ విమర్శలు చేస్తున్నారన్న ఆయన.. సోమవారమే కృష్ణ ట్రిబ్యుషన్‌ సమీక్ష అంశం వచ్చిందన్నారు. కృష్ణా జలాల అంశాన్ని తిరగతోలడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్‌తో ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహించాల్సి ఉందన్నారు. మరోవైపు టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన సజ్జల.. తెలుగు దేశం పార్టీ బలహీన పడిందని పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు ఒప్పుకున్నట్లేనా అని ప్రశ్నించారు.

టీడీపీని పవన్‌ కళ్యాణ్‌ టేకోవర్‌ చేసుకున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పవన్‌ జనసేనతో పాటు టీడీపీకి సైతం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీని టేకోవర్‌ చేసుకున్న పవన్‌ కళ్యాణ్‌ రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఎన్ని సీట్లు ఇస్తున్నారో చెప్పాలన్నారు. సీఎం జగన్‌ ఢీల్లీ టూర్‌పై అసత్య ప్రచారం జరుగుతుందన్న ఆయన.. చంద్రబాబు కేసుల గురించి జగన్‌ కేంద్రం పెద్దలతో మాట్లాడటానికి వెళ్లారని విపక్ష నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. జగన్‌ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్లారన్న సజ్జల.. చంద్రబాబు కేసుల గురించి మాట్లాడే అవసరం జగన్‌కు ఏముందన్నారు.

రాష్ట్రానికి సంబంధించిన ఆంశాల గురించి సీఎం కేంద్రం పెద్దలతో మాట్లాడారని సజ్జల రామృష్ణా రెడ్డి తెలిపారు. చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్ పరారీలో ఉన్నరని సజ్జల రామకృష్ణారెడ్డి.. శ్రీనివాస్‌ త్వరగా తిరిగి వస్తే చంద్రబాబు కేసు తేలుతోందని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు తన మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ను త్వరగా తిరిగి రమ్మని చెప్పాలన్నారు. బాబు కేసులో ఆయన తరపు లాయర్లు టెక్నికల్ అంశాల పైనే మాట్లాడుతున్నారని సజ్జల రామృష్ణా రెడ్డి వెల్లడించారు. వైఎస్‌ మరణాన్ని, సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిని టీడీపీ-జనసేన నేతలు చిన్న పిల్లలతొ తిట్టించడం దారుమన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP CM Chandrababu: సచివాలయంలో అగ్నిప్రమాదం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

ఏపీ సచివాలయంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో అన్ని చోట్లా భద్రతా ప్రమాణాలన్నీ పాటిస్తున్నారా లేదా అన్న విషయంపై ఆడిట్ చేయాలని అధికారులను ఆదేశించారు.

New Update

వెలగపూడి సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో ఈ రోజు ఉదయం అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందని, ఏ సమయంలో చోటు చేసుకుందని సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతిచోటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తద్వారా ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్ బృందం ఎన్ని గంటలకు వచ్చిందని అధికారులను అడిగారు.

ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అవసరమైన ఆధారాలను సేకరించించారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. సచివాలయంలో అన్ని చోట్లా భద్రతా ప్రమాణాలన్నీ పాటిస్తున్నారా లేదా అన్న విషయంపై ఆడిట్ చేయాలని ఆదేశించారు. అనంతరం మొదటి బ్లాక్‌లోని బ్యాటరీ రూమ్‌ను కూడా సీఎం పరిశీలించారు. ఇటువంటి బ్యాటరీ గ్యాలరీనే రెండవ బ్లాక్‌లో అగ్నిప్రమాదానికి గురైందని సీఎంకు సీఎస్ వివరించారు.

అపరిశుభ్రతపై అసంతృప్తి..

అనంతరం సీఎంఆర్ఎఫ్ విభాగాన్ని పరిశీలించారు. అక్కడి అపరిశుభ్రతపై సీఎం అసంతృప్తిని వ్యక్తం చేశారు. 24 గంటల్లో చెత్తనంతా క్లీన్ చేయాలని అధికారులను ఆదేశించారు. పని ప్రదేశాల్లో ఎక్కడా తాత్కాలికంగా కూడా చెత్త కనబడటానికి వీళ్లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు వెంట సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి అనిత, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా తదితరులు ఉన్నారు. 

ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్‌లో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.  రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఎస్పీఎఫ్ సిబ్బంది ఫైర్ సేఫ్టీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సచివాలయంలోని రెండో బ్లాక్ వద్దకు చేరుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది  మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా? లేక మరేదైనా కుట్రకోణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

(telugu-news | latest-telugu-news | telugu breaking news ap cm chandrababu naidu)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు