Ganesh Nimajjanam: నిమజ్జనంలో విషాదాలు.. డ్యాన్స్ చేస్తూ ఒకరు మృతి.. నిమజ్జనం చేస్తూ తండ్రీకొడుకులు (వీడియోలు)

గణేష్‌ నవరాత్రులు పూజలు దేశ వ్యాప్తంగా పూర్తయ్యాయి. వైభవంగా గణేష్‌డి శోభాయాత్రలు కొనసాగుతోంది. ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. డీజే సౌండ్స్, డ్యాన్సులులతో బొజ్జగణపయ్య నిమజ్జనం రాష్ట్ర నలు మూలన సందడితో పాటు..అక్కడక్కడ అపశృతులు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంటున్నాయి.

New Update
Ganesh Nimajjanam: నిమజ్జనంలో విషాదాలు.. డ్యాన్స్ చేస్తూ ఒకరు మృతి.. నిమజ్జనం చేస్తూ తండ్రీకొడుకులు (వీడియోలు)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతంలో గణేష్ నిమజ్జన వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. భద్రాచల పట్టణంలో నిమజ్జనం వేడుకల్లో బుధవారం రాత్రి అపశృతి జరిగింది. నిమజ్జనం సందర్భంగా టపాకాయలు పేలుస్తూండగా స్థానిక అంబేద్కర్ సెంటర్‌లో పలు దుకాణాలు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశారు. ఈ సంఘటనపై మర్వాక ముందే.. గోదావరి నదిలో నిమజ్జనానికి వెళ్లి నీటమునిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. నీటమునిగిన ముగ్గురిలో ఇద్దరిని కాపాడి ఒడ్డుకు చేర్చారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. గల్లంతైన మరో యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ యువకులు భద్రాద్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

చిత్తూరు జిల్లా పుంగనూరు వినాయక నిమార్జన ర్యాలీలో అపశృతి జరిగింది. హై స్కూల్ స్ట్రీట్‌లో ఓ ఇంటిముందు ఉన్న కారు దగ్ధం అయింది. భారీ బాణసంచా పేలుస్తూ వినాయకుడిని నిమార్జనానికి తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. టపకాయల నిప్పు రవ్వలు పడి కొత్త బ్రీజా కారు దగ్ధం అయింద.ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా వినాయక నిమజ్జనంలో అపశృతి జరిగింది. ఊరేగింపు సందర్భంగా యువకుల అత్యుత్సాహం ప్రదర్శించారు. స్టెప్స్ వేస్తూ ట్రాక్టర్‌పై నుంచి పల్టీ కొట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అదుపు తప్పి రోడ్డును తాకిన తల భాగానికి గాయం అయింది. దీంతో యువకుడికి తీవ్ర గాయాలై.. పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే తిరుపతి రూయా ఆస్పత్రికి తరలించారు.

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగిన గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. రాత్రి 12:30 గంటల సమయంలో చిట్ట చివరగా భారీ గణేష్ విగ్రహాన్ని క్రేన్ ద్వారా నిమజ్జనం చేస్తుండగా భూమా చంద్రశేఖర్‌రెడ్డి (22) అనే యువకుడు నదిలో పడిపోయి గల్లంతయ్యాడు. నది నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో గల్లంతైన వ్యక్తి కోసం పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటనతో పట్టణంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పల్నాడు జిల్లా వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ కృష్ణానదిలో‌పడి తండ్రి, కొడుకులు మృతి చెందారు. మాచవరం మండలం గోవిందపురంలో ఈ ఘటన జరిగింది. మృతులు పిడుగురాళ్లకు చెందిన తండ్రి, కొడుకులు నీరుమళ్ళ శ్రీనివాసరావు(54) వెంకటేష్ (25) గా గుర్తించారు. ఇద్దరు మృతదేహాలను గజ ఈతగాళ్ళు వెలికి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CM Chandrababu: ఇవాళే అకౌంట్లోకి రూ.20 వేలు.. AP సర్కార్ కొత్త పథకం

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మత్స్యకారుల ఒక్కో కుటుంబానికి రూ.20,000 ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ డబ్బులు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో జమచేయనున్నారు.

New Update
Matsyakara sevalo scheme

Matsyakara sevalo scheme

ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. తాజాగా కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని బుడగట్లపాలెం గ్రామంలో ‘‘మత్స్యకార సేవలో’’ అనే పథకాన్ని ప్రారంభించారు. సముద్రంలో చేపల వేటపై ఆధారపడిన కుటుంబాలకు అండగా ఈ ‘‘మత్స్యకార సేవలో’’ అనే పథకాన్ని తీసుకొచ్చింది. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

ఒక్కో కుటుంబానికి రూ.20,000

ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.20,000 ఆర్థిక సహాయాన్ని అందించనుంది. ఇందులో భాగంగానే ఇవాళ ప్రారంభించిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు లబ్ధిదారులకు రూ.20,000 చెక్కును అందజేశారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు అంటే దాదాపు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేట నిషేం. కాబట్టి ఆ సమయంలో మత్స్యకారులు వారి జీవనోపాధి కోల్పోతారు. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

దానిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం.. వేటలేని కాలంలో మత్స్యకారులకు జీవనోపాధిని కొనసాగించడానికి ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తుంది. కాగా గత ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలకు రూ. 10,000 సహాయాన్ని అందించింది. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వారికి రూ. 20,000 సహాయాన్ని అందిస్తుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1,29,178 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.258 కోట్లు కేటాయించింది.

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

cm-chandra-babu | ap cm chandra babu naidu | Matsyakara sevalo | srikakulam

Advertisment
Advertisment
Advertisment