Sabarimala : శబరిమలలో భారీ రద్దీ..దర్శనం చేసుకోకుండానే వెనుతిరుగుతున్న స్వాములు!

శబరిమల ఆలయంలో రోజురోజుకి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో శబరిగిరులు అన్ని కూడా రద్దీగా మారాయి. స్వామి దర్శనం కోసం 12 నుంచి 18 గంటల పాటు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి. దీంతో చాలా మంది స్వామి వారిని దర్శించుకోకుండానే వెనుతిరుగుతున్నారు.

New Update
Sabarimala : శబరిమలలో భారీ రద్దీ..దర్శనం చేసుకోకుండానే వెనుతిరుగుతున్న స్వాములు!

Ayyappa Devotees : కేరళలో(Kerala) ని శబరిగిరులు అయ్యప్ప నామ స్మరణతో మారుమోగుతున్నాయి. గత నెలలో స్వామి వారి ఆలయం తెరిచినప్పటి నుంచి రోజురోజుకి భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా స్వామి వారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో స్వాములు , భక్తులు శబరిమలకు(Sabarimala) తిరిగి వస్తున్నారు.

ప్రస్తుతం స్వామి వారి ఆలయంలో మండల- మకరవిళక్కు (Mandalam-Makaravilakku)  పూజలు జరుగుతున్నాయి. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. దీంతో స్వామి వారి దర్శనానికి సుమారు 12 నుంచి 18 గంటల సమయం పడుతోందని ఆలయాధికారులు తెలిపారు.గంటల తరబడి స్వామి వారి దర్శనం కోసం క్యూ లైన్లలలో వేచి ఉన్నప్పటికీ అయ్యప్ప దర్శనం కాకపోవడంతో చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన స్వాములు దర్శనం చేసుకోకుండానే వెనుదిరుగుతున్నారు.

కర్ణాటక(Karnataka), ఏపీ(AP), తమిళనాడు (Tamilanadu) కి చెందిన అయ్యప్ప స్వాములు స్వామి వారిని దర్శించుకోకుండానే పందళంలోని శ్రీ ధర్మ శాస్త్ర ఆలయంలో ఇరుముడి సమర్పించి..అయ్యప్పకు నెయ్యి అభిషేకం చేసి వెనక్కి వెళ్లిపోతున్నారు. పంబ, అపాచీకి మేడ నుంచి శబరిపీఠం వరకూ స్వాములు క్యూ లైన్లలో వేచి ఉన్నారు.

కొండకు వెళ్లే దారులన్నీ కూడా వాహనాలతో నిండి పోయి ఉన్నాయి. మంగళవారం కూడా భారీగా ట్రాఫిక్‌ జామ్‌ (Traffic jam) అయ్యింది. ఇప్పటికే చాలా మంది భక్తులు కొండకు చేరుకునేందుకు ఇబ్బందులు పడుతున్నామని నిరసన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పంబ వరకు కూడా చేరుకునేందుకు వీలు కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత కొద్ది రోజుల నుంచి స్వామి వారి కొండకు లక్షకు పైగా భక్తులు శబరిగిరికి వస్తుండడంతో ఇంత తీవ్ర రద్దీ ఏర్పడిందని కేరళ దేవాదాయశాఖ మంత్రి రాధాకృష్ణన్‌ (Radhakrishnan)  తెలిపారు. శబరిమలలో సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు.

కేవలం గత శుక్రవారం నుంచి భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. రోజుకు లక్ష మందికి పైగా స్వామి వారి దర్శనానికి వస్తున్నట్లు దేవస్థానం సిబ్బంది తెలిపారు. దీంతో భక్తులను క్యూలైన్లలో నియంత్రించడం చాలా కష్టం మారినట్లు అధికారులు వివరించారు. గంటల కొద్దీ క్యూలైన్ల వెంట వేచి ఉండలేని భక్తులకు కొందరు బారికేడ్లు  దూకి మరి స్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్నారు. దీంతో పరిస్థితి చేజారి పోతుందని గమనించిన ఆలయాధికారులు ఆన్‌ లైన్‌ క్యూ బుకింగ్‌ ను తగ్గించారు.

స్వాములు వచ్చిన వాహనాలు ఎరుమేలి, పంబా, నిలక్కల్‌, ఎలవుంకల్‌ ప్రాంతాల్లో బారులు తీరి ఉన్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని కేరళ దేవాదాయ మంత్రి కె.రాధాకృష్ణన్‌ ఆదేశించారు. భక్తుల తాకిడి భారీగా పెరిగినప్పటీకీ దర్శన వేళలు మాత్రం పొడిగించలేమని శబరిమల ప్రధాన అర్చకులు తెలిపారు.

Also read: దిగివస్తున్న బంగారం.. ఈరోజు ఎంత తగ్గింది అంటే.. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP News: జగన్ క్షమాపణ చెప్పాలి లేదంటే.. జనమాల శ్రీనివాసరావు స్ట్రాంగ్ వార్నింగ్!

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ క్షమాపణ చెప్పాలని జనమాల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జగన్ తీరు పోలీసులందరినీ కలవరపాటుకు గురిచేసిందన్నారు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఆయన మీద న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.

New Update
jagan-si-sudhakar

Janamala Srinivasa Rao shocking comments on jagan

AP News: పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ క్షమాపణ చెప్పాలని జనమాల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఏపీ పోలీస్ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ గా జగన్ మాట్లాడిన తీరును ఖండిస్తున్నట్లు తెలిపారు. జగన్ తీరు పోలీసులందరినీ కలవరపాటుకు గురిచేసిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పోలీసులను బట్టలూడదీస్తానని అనడం ఏమిటని మండిపడ్డారు. జగన్ వెంటనే పోలీసులందరికీ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆయన మీద న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ప్రభుత్వాలకు భజన చేయాలా..

ఈ మేరకు పోలీస్ అధికారుల సంఘం ఎప్పుడు ఒకరిపైన విమర్శలు చేయలేదు. ఏ ప్రభుత్వం ఉన్నా.. పోలీసుల మీద తప్పుగా మాట్లాడితే ఖండించాం. మాకు ప్రభుత్వాలకు భజన చేయాల్సిన అవసరం లేదు. పోలీసుల్లో మనోధైర్యాన్ని నింపడానికి మీడియా ముందుకు వస్తున్నాం. వేమగిరి ఎస్సై టీడీపీ నేతలతో తిరిగిన వీడియోలు ఉంటే దానిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. 

Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!

ఇదిలా ఉంటే.. వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కానీ గతంలోనే ప్రాజెక్టు పూర్తిచేశామని, జాతికి అంకితం ఇస్తున్నామంటూ జగన్‌ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదని, చేయని పనులూ చేసినట్లు చెప్పుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అంటూ ఎద్దేవా చేశారు.

Also Read: Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి

jagan | police | srinivas | tdp | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment